Fish Farming: చేపల పెంపకంలో ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వ్యవసాయం చేసే రైతులు కేవలం పంటలను మాత్రమే కాదు చేపలను కూడా పెంచుతున్నారు.. చేపల పెంపకం ఉపాదికి చక్కటి మార్గం. వీటి పెంపకంలో అధిక దిగుబడి రావాలంటే చేప పిల్లల ఎంపిక, నీటి నాణ్యత, ఎరువులు, మేత, ఆరోగ్య యాజమాన్య పద్ధతులను విధిగా పాటించాలి..
చేపల పిల్లలను ఎంపిక చేసుకోవడంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.. 3 రకాల చేప పిల్లలను 2 మీటర్లలోతుండే చెరువులో ఎకరా నీటి విస్తీర్ణానానికి 2 వేల వరకు వదలాలి.2-4 అంగుళాల సైజు కలిగి చురుకుగా, ఆరోగ్యంగా ఉన్న చేప పిల్లల్ని ఎంచుకోవాలి. దాణా పెట్టే ప్రత్యేక చెరువుల్లో ఎకరాకు 3 వేల పిల్లల్ని వేసుకోవచ్చు. నాచు ఎక్కువగా పెరిగే చెరువుల్లో ఎకరాకు 100-150 గడ్డి చేపపిల్లల్ని వేసుకోవడం మంచిది. మిశ్రమ పెంపకంలో చేపలతో పాటుగా రొయ్యలు పెంచుకుంటే అధిక లాభాలను పొందవచ్చు..
Also Read
- India Vs Ireland: మళ్లీ మారిన టీ20 కెప్టెన్.. ఐర్లాండ్తో తలపడే ప్రతి టీ-20 సిరీస్లోనూ కొత్త కెప్టెనే..
- India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
- Ayodhya Ram mandir: రామ మందిర విరాళాలు చోరీ.. 8 మందిపై ఎఫ్ఐఆర్..
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
ఇక చెరువును సారవంతం చేసి, సహజ ఆహారం ఉత్పత్తికి గాను నెలకొకసారి ఎకరానికి 500కి. కోళ్ల పెంట, లేదా 1000 కి.పశువుల ఎరువు,8 కి. యూరియా, 20 కి. సూపర్ ఫాస్ఫేట్,3 కి పోటాష్ చొప్పున చేరువంతా చల్లాలి. సేంద్రియ, రసాయన ఎరువుల్ని 15 రోజుల తేడాతో ఒకటి వేసుకున్నాక మరొకటి వేసుకోవాలి..
చేపలు బాగా ఆరోగ్యంగా ఉండాలంటే మేత తయారీకి నాణ్యమైన దినుసులు వాడాలి.. అంటే వేరు సెనగ , ప్రత్తి, చెక్క, ఖనిజలవణాలు మిశ్రమం తగు మోతాదుల్లో వాడాలి. ఎకరాకు 5-10 మేత సంచులను సూర్యోదయం తరువాతనే కట్టాలి..
చేపల ఆరోగ్యం చాలా ముఖ్యం.. అందుకే 20 రోజులకొకసారి ట్రయల్ నెట్టింగ్ చేసి కొన్ని చేపల్ని పట్టి పెరుగుదలను, ఆరోగ్యాన్ని పరిశీలించి వివరాలను రిజిస్టర్ లో నమోదు చేయాలి. చేపల్లో సూక్ష్మ జీవులు, పరాన్నా జీవుల వల్ల వచ్చే వ్యాధులను సకాలంలో గుర్తించి నివారణ చేయాలి.. వీలైతే నిపుణుల సలహా మేరకు తగిన మందులను కూడా వాడటం మంచిది..
బాగా పెరిగిన చేపలను సకాలంలో పట్టుబడి చేసి, సైజుల వారిగా గ్రేడింగ్ చేసి గిట్టుబాటు ధరకు మార్కెటింగ్ చేసుకోవాలి. చేప కిలో సైజు పెరగడానికి 12 నేలలు పడుతుంది.. అయితే చేపలను పట్టి వాటిని వెదురు, లేదా థర్మాకోల్ లో ఐస్ వేసి మార్కెటింగ్ చెయ్యాలి అప్పుడే అవి పాడవ్వవు.. మంచి లాభాలను పొందవచ్చు..
తాజావార్తలు
-
India Vs Ireland: మళ్లీ మారిన టీ20 కెప్టెన్.. ఐర్లాండ్తో తలపడే ప్రతి టీ-20 సిరీస్లోనూ కొత్త కెప్టెనే..
-
Anantha Sriram : రివ్యూస్ రాసేవాళ్ళకు ఏం అర్హత ఉంది?
-
India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
-
AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
-
Ayodhya Ram mandir: రామ మందిర విరాళాలు చోరీ.. 8 మందిపై ఎఫ్ఐఆర్..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!