Vande Bharat Train: రేపు ఈ మార్గంలో 20 కోచ్ల తొలి వందే భారత్ ట్రయల్ రన్..
- ముంబై-అహ్మదాబాద్ మధ్య త్వరలో వందే భారత్ రైలు ప్రారంభం
- రేపు 20 కోచ్లతో తొలి వందేభారత్ రైలు ట్రయల్ రన్
- 130 కి.మీ వేగంతో ప్రయాణించనున్న ఈ రైలు
- అహ్మదాబాద్-వడోదర-సూరత్-ముంబై సెంట్రల్ మధ్య రైలు ట్రయల్ రన్
- ఉదయం 7 గంటలకు అహ్మదాబాద్ స్టేషన్ నుండి బయలుదేరి..
- మధ్యాహ్నం 12:15 గంటలకు ముంబై సెంట్రల్ చేరుకోనున్న ట్రైన్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ ఆర్థిక రాజధాని ముంబై-అహ్మదాబాద్ మధ్య త్వరలో వందే భారత్ రైలు ప్రారంభం కానుంది. రేపు (ఆగస్టు 9న) 20 కోచ్లతో తొలి వందేభారత్ రైలు ట్రయల్ని భారతీయ రైల్వే నిర్వహించబోతోంది. 130 కి.మీ వేగంతో ప్రయాణించే ఈ రైలును తొలిసారిగా ట్రయల్ చేయనున్నారు. అహ్మదాబాద్-వడోదర-సూరత్-ముంబై సెంట్రల్ మధ్య రైలు ట్రయల్ రన్ జరుగనుంది. ఉదయం 7 గంటలకు అహ్మదాబాద్ స్టేషన్ నుండి బయలుదేరి మధ్యాహ్నం 12:15 గంటలకు ముంబై సెంట్రల్ చేరుకుంటుంది. ప్రస్తుతం దేశంలోని పెద్ద నగరాల మధ్య 16 కోచ్లతో.. చిన్న నగరాల మధ్య 8 కోచ్లతో వందే భారత్ రైలును నడుపుతున్నారు.
Read Also: Waqf Bill: విపక్షాల ఆందోళనతో “పార్లమెంట్ కమిటీ”కి వక్ఫ్ బిల్లు..
Also Read
- Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్... సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
- Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
- Pakistan: గర్భిణీలు, చిన్న పిల్లల్ని కూడా వదల్లేదు.. POKలో పాక్ ఆర్మీ దుర్మార్గాలు..
- Off The Record: అధికారం కోసం తప్ప పార్టీ కోసం ఎవరూ పని చేయట్లేదా..? ఆ ఉమ్మడి జిల్లా జనసేన కమిటీ మొత్తం రద్దు..
ప్రస్తుతానికి 16-16 కోచ్ల రెండు వందేభారత్ రైళ్లు అహ్మదాబాద్-ముంబై మార్గంలో నడుస్తున్నాయి. ఈ రెండు రైళ్లు ఈ దూరాన్ని చేరుకోవడానికి దాదాపు ఐదున్నర గంటల సమయం పడుతుంది. ఈ రెండు రైళ్ల నుంచి 100 శాతం రెస్పాన్స్, ఆక్యుపెన్సీ అందుతుంది. ఈ క్రమంలో దీన్ని దృష్టిలో ఉంచుకుని.. దేశంలోనే మొట్టమొదటి 20 కోచ్ల వందే భారత్ రైలును ఈ రెండు నగరాల మధ్య నడపాలని రైల్వేశాఖ భావించింది. ఈ క్రమంలో.. ఈ రైలు ట్రయల్ రన్ కు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ ఆగస్టు 9న అహ్మదాబాద్-వడోదర-సూరత్-ముంబై సెంట్రల్ మధ్య ట్రయల్ను ఆమోదించింది. ఈ మేరకు పశ్చిమ రైల్వే జోన్ జనరల్ మేనేజర్ కార్యాలయానికి రైల్వేశాఖ ఆదేశాలు జారీ చేసింది.
Read Also: Paris Olympics 2024: సెమీస్కి చేరిన భారత రెజ్లర్ అమన్ సెహ్రావత్..
RDSO యొక్క స్పీడ్ సర్టిఫికేట్ ఆధారంగా 20 కోచ్ల వందే భారత్ రైలు వేగం గరిష్టంగా 130 కి.మీ. గంట. ఈ రైలు ట్రయల్ రన్ సమయంలో భద్రతపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. అన్ని LC గేట్లు, ఆక్రమణలు.. విరిగిన, తప్పిపోయిన బారికేడింగ్ సైట్ల వద్ద RPF సిబ్బందిని మోహరిస్తారు. ఈ రైలు నడిచే మార్గంలో దాదాపు 50 శాతం అంటే 792 రూట్ కి.మీ పశ్చిమ రైల్వే పరిధిలో ఉంటుందని రైల్వే అధికారులు చెబుతున్నారు. మరోవైపు.. ఈ రైల్వే మార్గంలో పశువుల కంచె, గోడకు కంచె పనులు దాదాపుగా పూర్తయ్యాయి.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!