TSPSC : వార్డు ఆఫీసర్లను నియమించనున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) గ్రూప్ IV నోటిఫికేషన్ను జారీ చేయడంతో, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్ విభాగం రాష్ట్రంలోని మొత్తం 141 మునిసిపాలిటీలలో వార్డు ఆఫీసర్లను నియమించడానికి సన్నద్ధమవుతోంది. దేశంలోనే మున్సిపాలిటీల్లో వార్డు ఆఫీసర్లను నియమించనున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ అవతరించనుంది. తెలంగాణ మినిస్టీరియల్ సర్వీసెస్లో వార్డు స్థాయిలో వివిధ పాత్రలు, బాధ్యతలతో వార్డ్ ఆఫీసర్ పోస్ట్ కొత్తగా చేర్చబడింది. పట్టణ స్థానిక సంస్థల (ULBలు)లో హరితహారం, పారిశుధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణ, సామాజిక భద్రతా పథకాలు మరియు ఇతర మున్సిపల్ సేవలను మెరుగైన పర్యవేక్షణ, సమర్థవంతంగా అమలు చేయడంలో వార్డు అధికారుల నియామకం సహాయపడుతుందని భావిస్తుస్తోంది అధికార యంత్రాంగం.
Also Read : Mass Killings: సామూహిక హత్యలు జరిగే దేశాల జాబితాలో పాకిస్థాన్దే అగ్రస్థానం!
ఇంటి పన్ను, ఇతర పన్నుల సేకరణ, రుసుములు, ఛార్జీలు, మదింపు చేయని, తక్కువ అంచనా వేయబడిన ఆస్తుల నెలవారీ జాబితాను తయారు చేయడం కూడా వారికి అప్పగించబడుతుంది. అలాగే, గ్రామీణ సంస్థలలో పంచాయతీ కార్యదర్శులు, వార్డు అధికారులు స్థానిక కౌన్సిలర్లు లేదా కార్పొరేటర్ల సమన్వయంతో వివిధ అభివృద్ధి పనులను పర్యవేక్షి అమలు చేస్తారు. 50 వేల జనాభా దాటిన వార్డుకు ఒక వార్డు అధికారిని, 50 వేల లోపు జనాభా ఉన్న రెండు వార్డులకు ఒక అధికారిని నియమించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ మేరకు 2,242 మంది వార్డు అధికారులను నియమించేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది.
Also Read : Ex-Boyfriend Hacked Young Woman : కొచ్చిలో యువతిపై కత్తితో దాడి చేసిన మాజీ ప్రియుడు
Also Read
- FTA: ఇరాన్ యుద్ధం గొడవలో ప్రపంచం.. సైలెంట్గా కీలక ఒప్పందాన్ని పూర్తి చేసిన భారత్..
- Sanju Samson: గుజరాత్ టైటాన్స్పై చేసిన పరుగులు 11.. అయినా మరో రికార్డ్ సాధించిన సంజూ శాంసన్..
- Weight Loss: బరువు తగ్గాలనుకునే వారికి శుభవార్త.. ఇంత వరకు ఎవరూ చెప్పని చిట్కా.. 99 శాతం సక్సెస్..
- Bangladesh: బంగ్లాదేశ్ ఎయిర్ఫోర్స్లో తాలిబాన్లు.. బయటపడ్డ పాకిస్తాన్ మూలాలు..
9168 గ్రూప్ IV ఖాళీల భర్తీకి ఆమోదం తెలిపినందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు కృతజ్ఞతలు తెలుపుతూ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఇలా ట్వీట్ చేశారు. “TSPSC ద్వారా గ్రూప్-4 నోటిఫికేషన్ జారీ చేయబడింది. ఒక మార్గదర్శక చొరవలో, తెలంగాణ ప్రభుత్వం మొత్తం 141 మున్సిపాలిటీలలో వార్డు అధికారులను నియమిస్తుంది అని మంత్రి కేటీఆర్ ఓ ట్విట్ లో తెలిపారు.
ఇది పౌర సమస్యలపై హైపర్ లోకల్ ఫోకస్ని తెస్తుంది మరియు వార్డు కౌన్సిలర్లతో సమన్వయం చేసుకోవడానికి సహాయపడుతుంద మంత్రి కేటీఆర్ ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జూలైలో జిఓ ఎంఎస్ నెం.109 జారీ చేసి 2,242 వార్డు ఆఫీసర్ పోస్టులను మంజూరు చేసింది. 2,242 పోస్టుల్లో 380 పోస్టులను యూఎల్బీల్లో వీఆర్వోల ద్వారా భర్తీ చేశారు. ఇప్పుడు, TSPSC 9,168 గ్రూప్ IV ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయడంతో, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్ విభాగం మిగిలిన 1,862 వార్డు ఆఫీసర్ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయడానికి ప్రతిపాదిస్తోంది.
తాజావార్తలు
-
Senior Citizen FD: సీనియర్ సిటిజన్లకు FDలో అత్యధిక రాబడి.. ఏ బ్యాంకులు ఉత్తమం? పూర్తి వివరాలు
-
FTA: ఇరాన్ యుద్ధం గొడవలో ప్రపంచం.. సైలెంట్గా కీలక ఒప్పందాన్ని పూర్తి చేసిన భారత్..
-
Sanju Samson: గుజరాత్ టైటాన్స్పై చేసిన పరుగులు 11.. అయినా మరో రికార్డ్ సాధించిన సంజూ శాంసన్..
-
Post Office Scheme: కేవలం వడ్డీతోనే రూ.18 లక్షలు.. సింపుల్గా కోటీశ్వరులు అయ్యే ఛాన్స్!
-
Weight Loss: బరువు తగ్గాలనుకునే వారికి శుభవార్త.. ఇంత వరకు ఎవరూ చెప్పని చిట్కా.. 99 శాతం సక్సెస్..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!