Fire In Vande Bharat Train :వందేభారత్ రైలులో అగ్నిప్రమాదం.. తప్పిన పెను ప్రమాదం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వందేభారత్ రైలులో ఈరోజు ఉదయం అగ్నిప్రమాదం జరిగింది.. భోపాల్-ఢిల్లీ వందే భారత్ ఎక్స్ప్రెస్లోని ఒక కోచ్లోని బ్యాటరీ బాక్స్లో మంటలు చెలరేగాయి. మధ్యప్రదేశ్లోని కుర్వాయి కేతోరా స్టేషన్ దగ్గర ఉదయం ఈ ఘటన జరిగింది.. రైలులో మంటలను గమనించిన సిబ్బంది వెంటనే లోకోపైలట్ కు సమాచారం అందించారు. దీంతో రైలుని అక్కడికక్కడే నిలిపేశారు. రైలులోని సీ 14 కోచ్ వద్ద మంటలు వ్యాపించాయి. దీంతో భయంతో ప్రయాణికులు పరుగులు తీశారు.ట్రైన్ చక్రాల దగ్గర నుండి పొగలు కమ్ముకున్నట్లు సంఘటన స్థలం నుండి వచ్చిన దృశ్యాలు చూపించాయి. రైలులో అగ్నిప్రమాదం గురించి సమాచారం అందుకున్న ఫైర్ ఇంజన్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు..
ఈ మంటలు బ్యాటరీ బాక్సుకే పరిమితమైనట్లు అధికారులు తెలిపారు. సాంకేతిక పరీక్ష ముగిసిన వెంటనే రైలు దేశ రాజధానికి చేరుకుంటుందని రైల్వే అధికారులు తెలిపారు. అయితే ఈ ప్రమాదంలో ప్రయాణీకులందరూ సురక్షితంగా ఉన్నారని,వారికి ఎటువంటి గాయాలు సంభవించలేదని సమాచారం.ఈ రైలు ఉదయం 5.40 గంటలకు భోపాల్ నుండి బయలుదేరి ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్కు మధ్యాహ్నం 1.10 గంటలకు ఢిల్లీకి చేరుకోనుంది..
Also Read
- FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు 'ఛాంపియన్షిప్ రింగ్స్'..
- Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
- Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
ప్రధాని మోదీ సర్కార్ ఆర్భాటంగా ప్రారంభించిన వందే భారత్ రైలు తరచూ ప్రమాదాలకు గురవుతుంది. అక్కడ ఆవును ఢీకొన్నది.. ఇక్కడ బర్రెను ఢీకొట్టింది వంటి వార్తలను వింటూనే ఉన్నాం. ప్రమాదాల్లో రైలు ఇంజిన్ ముందు భాగం దెబ్బతినడం వంటి ఘటనలు కొనసాగుతున్నాయి. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంటుకు ఇచ్చిన సమాధానం ప్రకారం..గత ఏడాది జూన్ మరియు డిసెంబర్ మధ్య, వందేభారత్ రైళ్లలో జంతువులు ఢీకొన్న 68 కేసులు నమోదయ్యాయి.వందే భారత్ రైళ్లపై రాళ్లు రువ్విన ఘటనలు కూడా అనేకం ఉన్నాయి.. ఈ ప్రమాదానికి సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది
#WATCH | Madhya Pradesh | A fire was reported in battery box of one of the coaches in a Vande Bharat Express at Kurwai Kethora station. Fire brigade reached the site and extinguished the fire. All passengers are safe. No injuries reported. The fire is limited to Battery Box Only.… pic.twitter.com/E2s9ED99VH
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) July 17, 2023
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?