Fire In Vande Bharat Train :వందేభారత్ రైలులో అగ్నిప్రమాదం.. తప్పిన పెను ప్రమాదం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వందేభారత్ రైలులో ఈరోజు ఉదయం అగ్నిప్రమాదం జరిగింది.. భోపాల్-ఢిల్లీ వందే భారత్ ఎక్స్ప్రెస్లోని ఒక కోచ్లోని బ్యాటరీ బాక్స్లో మంటలు చెలరేగాయి. మధ్యప్రదేశ్లోని కుర్వాయి కేతోరా స్టేషన్ దగ్గర ఉదయం ఈ ఘటన జరిగింది.. రైలులో మంటలను గమనించిన సిబ్బంది వెంటనే లోకోపైలట్ కు సమాచారం అందించారు. దీంతో రైలుని అక్కడికక్కడే నిలిపేశారు. రైలులోని సీ 14 కోచ్ వద్ద మంటలు వ్యాపించాయి. దీంతో భయంతో ప్రయాణికులు పరుగులు తీశారు.ట్రైన్ చక్రాల దగ్గర నుండి పొగలు కమ్ముకున్నట్లు సంఘటన స్థలం నుండి వచ్చిన దృశ్యాలు చూపించాయి. రైలులో అగ్నిప్రమాదం గురించి సమాచారం అందుకున్న ఫైర్ ఇంజన్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు..
ఈ మంటలు బ్యాటరీ బాక్సుకే పరిమితమైనట్లు అధికారులు తెలిపారు. సాంకేతిక పరీక్ష ముగిసిన వెంటనే రైలు దేశ రాజధానికి చేరుకుంటుందని రైల్వే అధికారులు తెలిపారు. అయితే ఈ ప్రమాదంలో ప్రయాణీకులందరూ సురక్షితంగా ఉన్నారని,వారికి ఎటువంటి గాయాలు సంభవించలేదని సమాచారం.ఈ రైలు ఉదయం 5.40 గంటలకు భోపాల్ నుండి బయలుదేరి ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్కు మధ్యాహ్నం 1.10 గంటలకు ఢిల్లీకి చేరుకోనుంది..
Also Read
- Siddaramaiah: కర్ణాటకలో ఉత్కంఠకు తెర.. గురువారం గుడ్బై చెప్పనున్న సిద్ధరామయ్య!
- Vizag: పరిచయస్తులే యమకింకరులు.. సాగర తీరంలో వరుస హత్యల వెనుక మిస్టరీ ఇదేనా?
- Nalgonda: ప్రాణం తీసిన దశాబ్ద కాలం క్రితం పగ.. బీఆర్ఎస్ నేత హత్య వెనుక ఏం జరిగిందంటే..!
- Marco Rubio: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ప్రపంచానికి దీర్ఘకాలిక సంక్షోభం.. మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు
ప్రధాని మోదీ సర్కార్ ఆర్భాటంగా ప్రారంభించిన వందే భారత్ రైలు తరచూ ప్రమాదాలకు గురవుతుంది. అక్కడ ఆవును ఢీకొన్నది.. ఇక్కడ బర్రెను ఢీకొట్టింది వంటి వార్తలను వింటూనే ఉన్నాం. ప్రమాదాల్లో రైలు ఇంజిన్ ముందు భాగం దెబ్బతినడం వంటి ఘటనలు కొనసాగుతున్నాయి. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంటుకు ఇచ్చిన సమాధానం ప్రకారం..గత ఏడాది జూన్ మరియు డిసెంబర్ మధ్య, వందేభారత్ రైళ్లలో జంతువులు ఢీకొన్న 68 కేసులు నమోదయ్యాయి.వందే భారత్ రైళ్లపై రాళ్లు రువ్విన ఘటనలు కూడా అనేకం ఉన్నాయి.. ఈ ప్రమాదానికి సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది
#WATCH | Madhya Pradesh | A fire was reported in battery box of one of the coaches in a Vande Bharat Express at Kurwai Kethora station. Fire brigade reached the site and extinguished the fire. All passengers are safe. No injuries reported. The fire is limited to Battery Box Only.… pic.twitter.com/E2s9ED99VH
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) July 17, 2023
తాజావార్తలు
-
RCB vs GT : గుజరాత్పై ఆర్సీబీ ‘రాయల్’ విక్టరీ.. ఏకంగా 92 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్లోకి..!
-
OTR : తెలంగాణ బీజేపీ నాయకులకు ఢిల్లీ అధిష్టానం వార్నింగ్ ఇచ్చిందా?
-
Siddaramaiah: కర్ణాటకలో ఉత్కంఠకు తెర.. గురువారం గుడ్బై చెప్పనున్న సిద్ధరామయ్య!
-
Khaja Mohijuddin: వక్ఫ్ బోర్డు భూముల పోరాటమే ప్రాణం తీసిందా? సెకండ్ హ్యాండ్ ‘స్కార్పియో’తో లాయర్ను లేపేసిన కిల్లర్స్!
-
Vizag Bhimili Murder: ప్రియుడి మోజులో పచ్చని సంసారంలో నిప్పులు.. భర్తను చున్నీతో చంపేసిన ఇల్లాలు!
ట్రెండింగ్
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
-
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!