TTD: గోవిందరాజస్వామి రథం సేఫ్.. విష ప్రచారాలు నమ్మొద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TTD: నిత్యం భక్తులతో రద్దీగా ఉండే తిరుపతి పట్టణంలోని గోవిందరాజస్వామి ఆలయం సమీపంలోని లావణ్య ఫొటో ఫ్రేమ్ వర్క్స్ దుకాణంలో మంటలు చెలరేగాయి. రద్దీగా ఉండే ప్రాంతంలో ప్రమాదం జరగడం.. మంటలు ఇళ్ల వైపు వ్యాపిస్తుండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గోవిందరాజస్వామి ఆలయ రథం వైపు మంటలు వస్తుండటంతో అగ్నిమాపక సిబ్బంది ఆర్పే ప్రయత్నం చేశారు. ఎట్టకేలకు మంటలు అదుపులోకి వచ్చినట్లు తెలిసింది.
Also Read: TSRTC: టీఎస్ఆర్టీసీ గుడ్న్యూస్.. అందుబాటులోకి ‘టీ-9 టికెట్’
Also Read
- Japan-Mangoes: అన్నదాతలకు జపాన్ షాక్.. సీజన్లో భారత మామిడిపండ్లపై నిషేధం
- Siddaramaiah: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఎగ్జిట్.. హైకమాండ్ ఫోర్స్ చేసిందా? ఆయనే లొంగిపోయారా?
- Twisha Sharma: ట్విషా శర్మ రీ-పోస్ట్మార్టంలో షాకింగ్ ట్విస్ట్.. అత్త గిరిబాల సింగ్ అరెస్ట్
- Abhishek Banerjee: మమత మేనల్లుడికి బిగుస్తున్న ఉచ్చు.. మరో కేసు నమోదు..
సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. 10 ఫైరింజన్లు, 6 వాటర్ ట్యాంకులతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎండలు ఎక్కువగా ఉండడంతో పాటు గాలి వీస్తుండడంతో మంటలను అదుపు చేయడం కష్టంగా మారింది. అగ్నిప్రమాదం జరిగిన భవనం చుట్టూ ఎక్కువగా దుకాణాలు ఉన్నాయి. ఫోటో ఫ్రేమ్ షాపులు, పూజ సామాగ్రిని విక్రయించే దుకాణాలు ఉన్నాయి. దీంతో పరిసర ప్రాంతాలకు మంటలు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రమాద ప్రాంతం నుంచి ప్రజలను బయటకు పంపుతున్నారు. దాదాపు మంటలు అదుపులోకి వచ్చినట్లు తెలిసింది.
Also Read: Fire Accident: తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం.. ఫొటో ఫ్రేమ్స్ షాపులో చెలరేగిన మంటలు
ఇదివా ఉండగా.. తిరుపతి గోవిందరాజస్వామి వారి రథం అగ్నికి ఆహుతి అయినట్లుగా వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని టీటీడీ తెలిపింది. ఆలయం సమీపంలో ఉన్న లావణ్య ఫోటోఫ్రేమ్స్ దుకాణంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఆ దుకాణం మాత్రమే అగ్నికి ఆహుతి అయింది తప్పి గోవిందరాజస్వామి ఆలయ రథానికి ఎటువంటి ప్రమాదం జరగలేదని టీటీడీ అధికారులు వెల్లడించారు. దీనిపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్పందించారు. గోవిందరాజ స్వామి ఆలయం రథం నిప్పు అంటుకుందని దుష్ప్రచారం చేస్తున్నారని.. రథానికి ఎలాంటి మంటలు అంటుకోలేదన్నారు. ముందు జాగ్రత్తగా కాస్త వెనక్కి లాగి పెట్టామని ఆయన చెప్పారు. సోషల్ మీడియాలో వచ్చే రూమర్స్ను భక్తులు నమ్మొద్దన్నారు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయని ఆయన స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Nara Lokesh : మహిళలకు రిజర్వేషన్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు..
-
Japan-Mangoes: అన్నదాతలకు జపాన్ షాక్.. సీజన్లో భారత మామిడిపండ్లపై నిషేధం
-
Mercury transit 2026: మే 29న అరుదైన “సరస్వతి యోగం”.. ఈ 6 రాశుల వారికి అదృష్టమే అదృష్టం
-
Siddaramaiah: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఎగ్జిట్.. హైకమాండ్ ఫోర్స్ చేసిందా? ఆయనే లొంగిపోయారా?
-
Twisha Sharma: ట్విషా శర్మ రీ-పోస్ట్మార్టంలో షాకింగ్ ట్విస్ట్.. అత్త గిరిబాల సింగ్ అరెస్ట్
ట్రెండింగ్
-
భారత్లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!
-
Dondakaya Roti Pachadi: పల్లీల స్పెషల్ టచ్తో ‘దొండకాయ రోటి పచ్చడి’.. టేస్ట్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారంతే.!
-
144Hz OLED డిస్ప్లే, 7500mAh బ్యాటరీతో గేమింగ్ మాన్స్టర్ REDMAGIC 11S Pro గ్లోబల్ లాంచ్.!
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!