Rice Price Hike: సన్నబియ్యం ధరల షాక్.. రెండు నెలల్లోనే క్వింటాల్పై రూ.2 వేల పెరుగుదల!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fine Rice Prices Surge in Godavari Districts: ఉమ్మడి గోదావరి జిల్లాల్లో సన్నబియ్యం ధరలు సామాన్యులకు భారంగా మారాయి. గత రెండున్నర నెలల్లో క్వింటాల్కు రూ.1,500 నుంచి రూ.2,000 వరకు ధరలు పెరగడంతో.. సామాన్య కుటుంబాల నెలవారీ ఖర్చు గణనీయంగా పెరిగింది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్కు అన్నపూర్ణగా పేరొందిన గోదావరి జిల్లాల్లోనే ఇప్పుడు బియ్యం ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో.. వినియోగదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎల్నినో ప్రభావంతో పంట దిగుబడులు తగ్గడం, బియ్యం ఎగుమతులు పెరగడం, మార్కెట్లో నిల్వలు తగ్గిపోవడం వంటి కారణాలతో ధరలు ఒక్కసారిగా పెరిగాయని రైస్ ట్రేడర్స్ అసోసియేషన్ ప్రతినిధులు అంటున్నారు. 52 సంవత్సరాలుగా బియ్యం వ్యాపారం చేస్తున్నామని, కానీ కేవలం నెల రోజుల వ్యవధిలో క్వింటాల్కు రూ.1,000 వరకు ధరలు పెరగడం ఇప్పటివరకు ఎప్పుడూ చూడలేదని వ్యాపారులు చెబుతున్నారు.
Also Read
- MLA Rakesh Reddy: జోక్ కాదు సీరియస్ అధ్యక్షా.. ఈరోజే రాజీనామా చేస్తా.. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ఫైర్.!
- UPI MDR Revenue: MDR ఆదాయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ డబ్బుతో ఏం చేస్తారంటే..?
- UPI Charges: ఎవరు చెల్లించాలి? ఎవరు అవసరం లేదు?.. ఇంకా సందేహాలా..? పూర్తి వివరాలు ఇవే
- Assembly Protest: దివ్యాంగుల అసెంబ్లీ ముట్టడి.. పోలీసుల అడ్డగింత.!
రైతుల వద్ద సరిపడా ధాన్యం లేకపోవడం, కొందరు మిల్లర్లు ధరలు మరింత పెరుగుతాయన్న అంచనాతో నిల్వలు ఉంచుకోవడం వల్ల మార్కెట్లో సరఫరా తగ్గిందని మిల్లర్ల సంఘం పేర్కొంటోంది. అందుకే సన్నబియ్యం ధరలు మరింత పెరుగుతున్నాయంటున్నారు. ప్రభుత్వం రైతు బజార్లలో సబ్సిడీ ధరలకు బియ్యం విక్రయాలు ప్రారంభించినప్పటికీ.. పంట దిగుబడులు తగ్గిన పరిస్థితిలో దీర్ఘకాలికంగా సమస్యను ఎలా పరిష్కరిస్తుందనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. రైతులకు సరిపడా పంట లేకపోతే మార్కెట్లో ధరలను నియంత్రించడం సవాలుగా మారుతుందని వ్యాపార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అటు వినియోగదారులు బియ్యం ధరల పెరుగుదలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అన్ని రకాల బియ్యం ధరలు బస్తాకు రూ.200 నుంచి రూ.400 వరకు పెరగడంతో మధ్యతరగతి, పేద కుటుంబాలపై తీవ్ర భారం పడుతోంది. బియ్యం ఎగుమతులు పెరగడం, కరువు వస్తుందన్న అంచనాల పేరుతో మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టించి ధరలను పెంచుతున్నారంటూ పలువురు ఆరోపిస్తున్నారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఇప్పుడు బియ్యం ధరల పెరుగుదల మరో పెద్ద భారంగా మారింది.
తాజావార్తలు
-
MLA Rakesh Reddy: జోక్ కాదు సీరియస్ అధ్యక్షా.. ఈరోజే రాజీనామా చేస్తా.. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ఫైర్.!
-
UPI MDR Revenue: MDR ఆదాయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ డబ్బుతో ఏం చేస్తారంటే..?
-
Ahaana Krishna Wedding: 20 ఏళ్ల వయసులో కలిసిన వ్యక్తినే 30కి పెళ్లాడిన నటి అహానా కృష్ణ.. నిమిష్ రవితో లవ్ స్టోరీ ఇదే!
-
Priyanka Chopra: ఆ ఒక్క మాటతో వెంటనే ఒప్పేసుకున్నా.. రాజమౌళిపై ప్రియాంక చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు!
-
UPI Charges: ఎవరు చెల్లించాలి? ఎవరు అవసరం లేదు?.. ఇంకా సందేహాలా..? పూర్తి వివరాలు ఇవే
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!