GST Rates: కొత్త సంవత్సరంలో జీవిత, ఆరోగ్య బీమాలపై తగ్గనున్న జీఎస్టీ?
- కొత్త సంవత్సరం 2025లో.
- జీవిత & ఆరోగ్య బీమాలపై జీఎస్టీ తగ్గింపు.
- పూర్తి వివరాలు ఇలా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
GST Rates: కొత్త సంవత్సరం 2025లో జీవిత, ఆరోగ్య బీమాలపై జీఎస్టీ తగ్గింపు ఉండవచ్చని ఆర్ధిక నిపుణులు భావిస్తున్నారు. 2024 డిసెంబర్ 21, 22 తేదీల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన రాజస్థాన్లో వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో సమావేశం జరగనుంది. ఈ రెండు రోజుల సమావేశంలో ఒక రోజు ఆర్థిక మంత్రి 2025-26 ఆర్థిక సంవత్సరానికి ముందు బడ్జెట్కు సంబంధించి రాష్ట్రాల ఆర్థిక మంత్రుల నుండి సూచనలు, సిఫార్సులు తీసుకుంటారు. మరొక రోజు జీఎస్టీ కౌన్సిల్ 55వ సమావేశం జరుగుతుంది. జీవిత బీమాతో పాటు ఆరోగ్య బీమాపై జీఎస్టీని తగ్గించేందుకు నిర్ణయం తీసుకోవచ్చు.
Also Read
- Modi-Meloni: ఇటీవల రోమ్లో కలవడం ఆనందంగా ఉంది.. మోడీ రికార్డ్పై మెలోని అభినందనలు
- Women's T20 World Cup 2026కు కౌంట్డౌన్ స్టార్ట్.. భారత్-పాకిస్థాన్ మధ్యే తొలి పోరు.. పూర్తి వివరాలు ఇవే..
- Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
- 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
ఆ సమావేశంలో టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లపై విధించిన 18 శాతం జీఎస్టీని పూర్తిగా రద్దు చేయవచ్చు. అలాగే 5 లక్షల వరకు ఆరోగ్య బీమాను కొనుగోలు చేసే సీనియర్ సిటిజన్లు, ఇతర వ్యక్తులకు జీఎస్టీ రద్దు చేయబడుతుంది. జీఎస్టీ కౌన్సిల్ కొన్ని ఉత్పత్తులు, సేవలపై జీఎస్టీ రేట్లను హేతుబద్ధీకరించవచ్చు. అలాగే కొన్ని వస్తువులపై GST రేట్లను 12 శాతం నుండి 5 శాతానికి తగ్గించవచ్చని అందిన సమాచారంమేర తెలుస్తోంది.
ఆరోగ్య, జీవిత బీమాపై జీఎస్టీని పరిగణనలోకి తీసుకునేందుకు ఏర్పాటైన మంత్రుల బృందం టర్మ్ ఇన్సూరెన్స్పై జీఎస్టీని రద్దు చేయడంతోపాటు, సీనియర్ సిటిజన్లకు ఆరోగ్య బీమాను జీఎస్టీ నుంచి మినహాయించేందుకు అంగీకరించింది. అలాగే రూ. 5 లక్షల వరకు ఆరోగ్య బీమాపై వ్యక్తులు ప్రీమియం చెల్లింపుపై జీఎస్టీని రద్దు చేయాలనే ప్రతిపాదన కూడా ఉంది. అయితే రూ.5 లక్షల కంటే ఎక్కువ ఆరోగ్య బీమా ప్రీమియంలపై 18 శాతం జీఎస్టీ విధింపు కొనసాగుతుంది. సెప్టెంబరు 2024లో జరిగిన GST కౌన్సిల్ సమావేశంల, మంత్రుల బృందం నివేదికను సమర్పించాలని కోరింది.
Also Read: HAL Recruitment: డిప్లొమా అభ్యర్థులకు హెచ్ఏఎల్ ఉద్యోగాలు.. ఇరవై వేలకు పైగా జీతం
జీఎస్టీ రేటును హేతుబద్ధం చేసేందుకు ఏర్పాటైన మంత్రుల బృందం ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్, సైకిళ్లు, వ్యాయామ నోట్బుక్లు, లగ్జరీ రిస్ట్ వాచీలు, షూలపై జీఎస్టీ రేట్లలో మార్పులు చేయాలని ఆలోచిస్తోంది. జీఎస్టీ రేటులో ఈ మార్పు వల్ల ప్రభుత్వానికి రూ. 22000 కోట్ల రూపాయల ఆదాయ ప్రయోజనం లభిస్తుంది. 20 లీటర్ల ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్పై జీఎస్టీ రేటును 18% నుంచి 5%కి, రూ. 10,000 లోపు సైకిళ్లపై 12% నుంచి 5%కి తగ్గించాలని మంత్రుల బృదం GoM ప్రతిపాదించింది. నోట్బుక్లపై జీఎస్టీ రేటును 12% నుంచి 5%కి తగ్గించే ప్రతిపాదన కూడా ఉంది. రూ.15,000 కంటే ఎక్కువ ఉన్న షూలపై జీఎస్టీ రేటును 18% నుంచి 28%కి, రూ. 25,000 కంటే ఎక్కువ ఉన్న వాచీలపై 18% నుంచి 28%కి పెంచాలని ప్రతిపాదించినట్లు సమాచారం.
తాజావార్తలు
-
Modi-Meloni: ఇటీవల రోమ్లో కలవడం ఆనందంగా ఉంది.. మోడీ రికార్డ్పై మెలోని అభినందనలు
-
Women’s T20 World Cup 2026కు కౌంట్డౌన్ స్టార్ట్.. భారత్-పాకిస్థాన్ మధ్యే తొలి పోరు.. పూర్తి వివరాలు ఇవే..
-
Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
-
Sehwag-Dhoni: టీమిండియా నుంచి తప్పించాడు, సీఎస్కేలో స్టార్ను చేశాడు.. ధోనీపై సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు!
-
Alimony: పెళ్లైన 6నెలలకే విడాకులు.. నెలకు రూ.1.40 లక్షలు సంపాదించే మహిళకు.. భరణంగా నెలకు రూ.1.35 లక్షలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!