GST Rates: కొత్త సంవత్సరంలో జీవిత, ఆరోగ్య బీమాలపై తగ్గనున్న జీఎస్టీ?
- కొత్త సంవత్సరం 2025లో.
- జీవిత & ఆరోగ్య బీమాలపై జీఎస్టీ తగ్గింపు.
- పూర్తి వివరాలు ఇలా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
GST Rates: కొత్త సంవత్సరం 2025లో జీవిత, ఆరోగ్య బీమాలపై జీఎస్టీ తగ్గింపు ఉండవచ్చని ఆర్ధిక నిపుణులు భావిస్తున్నారు. 2024 డిసెంబర్ 21, 22 తేదీల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన రాజస్థాన్లో వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో సమావేశం జరగనుంది. ఈ రెండు రోజుల సమావేశంలో ఒక రోజు ఆర్థిక మంత్రి 2025-26 ఆర్థిక సంవత్సరానికి ముందు బడ్జెట్కు సంబంధించి రాష్ట్రాల ఆర్థిక మంత్రుల నుండి సూచనలు, సిఫార్సులు తీసుకుంటారు. మరొక రోజు జీఎస్టీ కౌన్సిల్ 55వ సమావేశం జరుగుతుంది. జీవిత బీమాతో పాటు ఆరోగ్య బీమాపై జీఎస్టీని తగ్గించేందుకు నిర్ణయం తీసుకోవచ్చు.
Also Read
- OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
- OTR: సీఎం టూర్.. శాసనమండలి ఛైర్మన్కు మరోసారి ప్రోటోకాల్ ఇబ్బంది.!
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
ఆ సమావేశంలో టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లపై విధించిన 18 శాతం జీఎస్టీని పూర్తిగా రద్దు చేయవచ్చు. అలాగే 5 లక్షల వరకు ఆరోగ్య బీమాను కొనుగోలు చేసే సీనియర్ సిటిజన్లు, ఇతర వ్యక్తులకు జీఎస్టీ రద్దు చేయబడుతుంది. జీఎస్టీ కౌన్సిల్ కొన్ని ఉత్పత్తులు, సేవలపై జీఎస్టీ రేట్లను హేతుబద్ధీకరించవచ్చు. అలాగే కొన్ని వస్తువులపై GST రేట్లను 12 శాతం నుండి 5 శాతానికి తగ్గించవచ్చని అందిన సమాచారంమేర తెలుస్తోంది.
ఆరోగ్య, జీవిత బీమాపై జీఎస్టీని పరిగణనలోకి తీసుకునేందుకు ఏర్పాటైన మంత్రుల బృందం టర్మ్ ఇన్సూరెన్స్పై జీఎస్టీని రద్దు చేయడంతోపాటు, సీనియర్ సిటిజన్లకు ఆరోగ్య బీమాను జీఎస్టీ నుంచి మినహాయించేందుకు అంగీకరించింది. అలాగే రూ. 5 లక్షల వరకు ఆరోగ్య బీమాపై వ్యక్తులు ప్రీమియం చెల్లింపుపై జీఎస్టీని రద్దు చేయాలనే ప్రతిపాదన కూడా ఉంది. అయితే రూ.5 లక్షల కంటే ఎక్కువ ఆరోగ్య బీమా ప్రీమియంలపై 18 శాతం జీఎస్టీ విధింపు కొనసాగుతుంది. సెప్టెంబరు 2024లో జరిగిన GST కౌన్సిల్ సమావేశంల, మంత్రుల బృందం నివేదికను సమర్పించాలని కోరింది.
Also Read: HAL Recruitment: డిప్లొమా అభ్యర్థులకు హెచ్ఏఎల్ ఉద్యోగాలు.. ఇరవై వేలకు పైగా జీతం
జీఎస్టీ రేటును హేతుబద్ధం చేసేందుకు ఏర్పాటైన మంత్రుల బృందం ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్, సైకిళ్లు, వ్యాయామ నోట్బుక్లు, లగ్జరీ రిస్ట్ వాచీలు, షూలపై జీఎస్టీ రేట్లలో మార్పులు చేయాలని ఆలోచిస్తోంది. జీఎస్టీ రేటులో ఈ మార్పు వల్ల ప్రభుత్వానికి రూ. 22000 కోట్ల రూపాయల ఆదాయ ప్రయోజనం లభిస్తుంది. 20 లీటర్ల ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్పై జీఎస్టీ రేటును 18% నుంచి 5%కి, రూ. 10,000 లోపు సైకిళ్లపై 12% నుంచి 5%కి తగ్గించాలని మంత్రుల బృదం GoM ప్రతిపాదించింది. నోట్బుక్లపై జీఎస్టీ రేటును 12% నుంచి 5%కి తగ్గించే ప్రతిపాదన కూడా ఉంది. రూ.15,000 కంటే ఎక్కువ ఉన్న షూలపై జీఎస్టీ రేటును 18% నుంచి 28%కి, రూ. 25,000 కంటే ఎక్కువ ఉన్న వాచీలపై 18% నుంచి 28%కి పెంచాలని ప్రతిపాదించినట్లు సమాచారం.
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!