GST Rates: కొత్త సంవత్సరంలో జీవిత, ఆరోగ్య బీమాలపై తగ్గనున్న జీఎస్టీ?
- కొత్త సంవత్సరం 2025లో.
- జీవిత & ఆరోగ్య బీమాలపై జీఎస్టీ తగ్గింపు.
- పూర్తి వివరాలు ఇలా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
GST Rates: కొత్త సంవత్సరం 2025లో జీవిత, ఆరోగ్య బీమాలపై జీఎస్టీ తగ్గింపు ఉండవచ్చని ఆర్ధిక నిపుణులు భావిస్తున్నారు. 2024 డిసెంబర్ 21, 22 తేదీల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన రాజస్థాన్లో వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో సమావేశం జరగనుంది. ఈ రెండు రోజుల సమావేశంలో ఒక రోజు ఆర్థిక మంత్రి 2025-26 ఆర్థిక సంవత్సరానికి ముందు బడ్జెట్కు సంబంధించి రాష్ట్రాల ఆర్థిక మంత్రుల నుండి సూచనలు, సిఫార్సులు తీసుకుంటారు. మరొక రోజు జీఎస్టీ కౌన్సిల్ 55వ సమావేశం జరుగుతుంది. జీవిత బీమాతో పాటు ఆరోగ్య బీమాపై జీఎస్టీని తగ్గించేందుకు నిర్ణయం తీసుకోవచ్చు.
Also Read
- Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
- NASA: అంగారక గ్రహంపై ఏలియన్ 'జెల్లీఫిష్' కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
- Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
- T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ఆ సమావేశంలో టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లపై విధించిన 18 శాతం జీఎస్టీని పూర్తిగా రద్దు చేయవచ్చు. అలాగే 5 లక్షల వరకు ఆరోగ్య బీమాను కొనుగోలు చేసే సీనియర్ సిటిజన్లు, ఇతర వ్యక్తులకు జీఎస్టీ రద్దు చేయబడుతుంది. జీఎస్టీ కౌన్సిల్ కొన్ని ఉత్పత్తులు, సేవలపై జీఎస్టీ రేట్లను హేతుబద్ధీకరించవచ్చు. అలాగే కొన్ని వస్తువులపై GST రేట్లను 12 శాతం నుండి 5 శాతానికి తగ్గించవచ్చని అందిన సమాచారంమేర తెలుస్తోంది.
ఆరోగ్య, జీవిత బీమాపై జీఎస్టీని పరిగణనలోకి తీసుకునేందుకు ఏర్పాటైన మంత్రుల బృందం టర్మ్ ఇన్సూరెన్స్పై జీఎస్టీని రద్దు చేయడంతోపాటు, సీనియర్ సిటిజన్లకు ఆరోగ్య బీమాను జీఎస్టీ నుంచి మినహాయించేందుకు అంగీకరించింది. అలాగే రూ. 5 లక్షల వరకు ఆరోగ్య బీమాపై వ్యక్తులు ప్రీమియం చెల్లింపుపై జీఎస్టీని రద్దు చేయాలనే ప్రతిపాదన కూడా ఉంది. అయితే రూ.5 లక్షల కంటే ఎక్కువ ఆరోగ్య బీమా ప్రీమియంలపై 18 శాతం జీఎస్టీ విధింపు కొనసాగుతుంది. సెప్టెంబరు 2024లో జరిగిన GST కౌన్సిల్ సమావేశంల, మంత్రుల బృందం నివేదికను సమర్పించాలని కోరింది.
Also Read: HAL Recruitment: డిప్లొమా అభ్యర్థులకు హెచ్ఏఎల్ ఉద్యోగాలు.. ఇరవై వేలకు పైగా జీతం
జీఎస్టీ రేటును హేతుబద్ధం చేసేందుకు ఏర్పాటైన మంత్రుల బృందం ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్, సైకిళ్లు, వ్యాయామ నోట్బుక్లు, లగ్జరీ రిస్ట్ వాచీలు, షూలపై జీఎస్టీ రేట్లలో మార్పులు చేయాలని ఆలోచిస్తోంది. జీఎస్టీ రేటులో ఈ మార్పు వల్ల ప్రభుత్వానికి రూ. 22000 కోట్ల రూపాయల ఆదాయ ప్రయోజనం లభిస్తుంది. 20 లీటర్ల ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్పై జీఎస్టీ రేటును 18% నుంచి 5%కి, రూ. 10,000 లోపు సైకిళ్లపై 12% నుంచి 5%కి తగ్గించాలని మంత్రుల బృదం GoM ప్రతిపాదించింది. నోట్బుక్లపై జీఎస్టీ రేటును 12% నుంచి 5%కి తగ్గించే ప్రతిపాదన కూడా ఉంది. రూ.15,000 కంటే ఎక్కువ ఉన్న షూలపై జీఎస్టీ రేటును 18% నుంచి 28%కి, రూ. 25,000 కంటే ఎక్కువ ఉన్న వాచీలపై 18% నుంచి 28%కి పెంచాలని ప్రతిపాదించినట్లు సమాచారం.
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!