Jharkhand: పెళ్లయిన 15రోజులకే అల్లుడిని దారుణంగా చంపిన తండ్రికొడుకులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jharkhand: జార్ఖండ్లోని మహేశ్పూర్లో సంచలన ఘటన చోటుచేసుకుంది. ఇక్కడ తండ్రీకొడుకులు కలిసి అల్లుడిని పట్టపగలు నడిరోడ్డుపై పొడిచి దారుణంగా హత్య చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఉత్కంఠ నెలకొంది. నిజానికి ఈ మొత్తం కేసు మహేశ్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాస్మతి గ్రామానికి సంబంధించినది. తండ్రి కొడుకులు కలిసి విశ్వజిత్ గోరాయ్ని పట్టపగలు హత్య చేశారు. తండ్రీకొడుకులు విశ్వజిత్ గోరాయ్ను చాలాసార్లు కత్తులతో పొడిచి పొడిచి చంపారు. తీవ్రగాయాలతో విశ్వజిత్ అక్కడికక్కడే మరణించాడు. తర్వాత నిందితులైన తండ్రీకొడుకులు వీరు మండల్, సీతారాం మండల్లు అక్కడి నుంచి పరారయ్యారు.
విశ్వజిత్ 2020లో వీరు మండల్ కుమార్తె పాయల్తో మొదటి వివాహం జరిగింది. కానీ వరకట్న డిమాండ్లు, ఇతర వివాదాల కారణంగా పాయల్ తన ఆరు నెలల కుమార్తెతో విడిగా జీవిస్తోంది. దీని తరువాత మార్చి 16, 2021 న పాయల్ మృతదేహం ఇంటికి కూతవేటు దూరంలో ఉన్న పొదల్లో లభ్యమైంది. ఈ హత్యకు సంబంధించి అల్లుడు విశ్వజిత్ గోరాయ్, బావమరిది కరణ్ గోరాయ్, మేఘా గోరై, భైరవ్ గోరాయ్లపై పాయల్ బంధువులు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.
Also Read
- 'The Hundred'లో రోహిత్ శర్మ.! MI లండన్ ఘన విజయం.!
- AP Coronavirus Cases: ఏపీలో భయపెడుతోన్న కరోనా..! పర్యాటకులపై ఆంక్షలు
- CM Vijay and Trisha Controversy: ఆలయ ఉత్సవాల్లో త్రిష, విజయ్ ఫొటోలతో వివాదాస్పద ఫ్లెక్సీ.. ఇద్దరిపై కేసు
- Lalit Kumar Modi: ఐపీఎల్ 2009 ఫెమా కేసులో క్లీన్ చిట్.. ఆనందంతో డాన్స్ చేస్తూ రచ్చ రచ్చ.!
Read Also:Minister Harish Rao: ఏడాదికి రెండు పంటలకు నీళ్లు ఇచ్చిన ఘనత మాదే
ఈ కేసులో విశ్వజిత్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పటికీ సాక్ష్యాధారాలు లేకపోవడంతో జైలుకు పంపలేకపోయారు. క్రమంగా పోలీసులు కేసును వదిలేశారు. కానీ పాయల్ కుటుంబం మాత్రం ప్రతీకార భావంతో లోలోపల మండిపోతోంది. మే 10న హరీష్పూర్ గ్రామానికి చెందిన ప్రియాంక కుమారితో విశ్వజిత్ వివాహం చేసుకోవడం వారిలో కోపాన్ని మరింత పెంచింది. వారు ప్రతీకారం తీర్చుకోవడానికి అవకాశం కోసం చూస్తున్నారు.
Read Also:Sharwanand: హే.. శర్వా.. నువ్వా.. పెళ్ళికి ముందే ఇలా మారిపోయావు ఏంటీ ..?
విశ్వజిత్ తన రెండో భార్యతో కలిసి పూజకు వెళ్తుండగా.. తండ్రి కొడుకులు ఇద్దరిని చుట్టుముట్టి విశ్వజిత్ను హత్య చేశారు. పెళ్లి జరిగి నెల కూడా కాలేదు ప్రియాంక కుంకుమ తుడిచిపెట్టుకుపోయింది. ఈ ఘటనలో ఆమెకు కూడా గాయాలయ్యాయి. అదే సమయంలో ఈ హత్య కేసులో పోలీసులు సీరియస్గా పనిచేస్తున్నారని మహేశ్పూర్ ఎస్డిపిఓ నవనీత్ హేమ్రోమ్ అన్నారు. కేసును సత్వరమే విచారించి నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపుతామన్నారు.
తాజావార్తలు
-
‘The Hundred’లో రోహిత్ శర్మ.! MI లండన్ ఘన విజయం.!
-
Trump 200% Tariff: ట్రంప్ సంచలన నిర్ణయం.. జెనరిక్ మందులపై 200% టారిఫ్.. భారత ఫార్మా పరిశ్రమపై భారీ ప్రభావం?
-
AP Coronavirus Cases: ఏపీలో భయపెడుతోన్న కరోనా..! పర్యాటకులపై ఆంక్షలు
-
NBK : ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్కు బాలయ్య.. షూటింగ్ కు బ్రేక్
-
India Test Squad: శ్రీలంకతో టెస్టు సిరీస్.. టీమిండియాలోకి మరో కొత్త ప్లేయర్!
ట్రెండింగ్
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్టాప్లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!