Jharkhand: పెళ్లయిన 15రోజులకే అల్లుడిని దారుణంగా చంపిన తండ్రికొడుకులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jharkhand: జార్ఖండ్లోని మహేశ్పూర్లో సంచలన ఘటన చోటుచేసుకుంది. ఇక్కడ తండ్రీకొడుకులు కలిసి అల్లుడిని పట్టపగలు నడిరోడ్డుపై పొడిచి దారుణంగా హత్య చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఉత్కంఠ నెలకొంది. నిజానికి ఈ మొత్తం కేసు మహేశ్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాస్మతి గ్రామానికి సంబంధించినది. తండ్రి కొడుకులు కలిసి విశ్వజిత్ గోరాయ్ని పట్టపగలు హత్య చేశారు. తండ్రీకొడుకులు విశ్వజిత్ గోరాయ్ను చాలాసార్లు కత్తులతో పొడిచి పొడిచి చంపారు. తీవ్రగాయాలతో విశ్వజిత్ అక్కడికక్కడే మరణించాడు. తర్వాత నిందితులైన తండ్రీకొడుకులు వీరు మండల్, సీతారాం మండల్లు అక్కడి నుంచి పరారయ్యారు.
విశ్వజిత్ 2020లో వీరు మండల్ కుమార్తె పాయల్తో మొదటి వివాహం జరిగింది. కానీ వరకట్న డిమాండ్లు, ఇతర వివాదాల కారణంగా పాయల్ తన ఆరు నెలల కుమార్తెతో విడిగా జీవిస్తోంది. దీని తరువాత మార్చి 16, 2021 న పాయల్ మృతదేహం ఇంటికి కూతవేటు దూరంలో ఉన్న పొదల్లో లభ్యమైంది. ఈ హత్యకు సంబంధించి అల్లుడు విశ్వజిత్ గోరాయ్, బావమరిది కరణ్ గోరాయ్, మేఘా గోరై, భైరవ్ గోరాయ్లపై పాయల్ బంధువులు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.
Also Read
- Shocking: అది ఆహారం కాదు ఆత్మహత్య.. ప్లేట్లో విషాన్ని పెట్టుకుని తింటున్న హైదరాబాద్ యువత.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
- 150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కోర్టులో లొంగిపోయిన భర్త సమర్థ్ సింగ్
Read Also:Minister Harish Rao: ఏడాదికి రెండు పంటలకు నీళ్లు ఇచ్చిన ఘనత మాదే
ఈ కేసులో విశ్వజిత్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పటికీ సాక్ష్యాధారాలు లేకపోవడంతో జైలుకు పంపలేకపోయారు. క్రమంగా పోలీసులు కేసును వదిలేశారు. కానీ పాయల్ కుటుంబం మాత్రం ప్రతీకార భావంతో లోలోపల మండిపోతోంది. మే 10న హరీష్పూర్ గ్రామానికి చెందిన ప్రియాంక కుమారితో విశ్వజిత్ వివాహం చేసుకోవడం వారిలో కోపాన్ని మరింత పెంచింది. వారు ప్రతీకారం తీర్చుకోవడానికి అవకాశం కోసం చూస్తున్నారు.
Read Also:Sharwanand: హే.. శర్వా.. నువ్వా.. పెళ్ళికి ముందే ఇలా మారిపోయావు ఏంటీ ..?
విశ్వజిత్ తన రెండో భార్యతో కలిసి పూజకు వెళ్తుండగా.. తండ్రి కొడుకులు ఇద్దరిని చుట్టుముట్టి విశ్వజిత్ను హత్య చేశారు. పెళ్లి జరిగి నెల కూడా కాలేదు ప్రియాంక కుంకుమ తుడిచిపెట్టుకుపోయింది. ఈ ఘటనలో ఆమెకు కూడా గాయాలయ్యాయి. అదే సమయంలో ఈ హత్య కేసులో పోలీసులు సీరియస్గా పనిచేస్తున్నారని మహేశ్పూర్ ఎస్డిపిఓ నవనీత్ హేమ్రోమ్ అన్నారు. కేసును సత్వరమే విచారించి నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపుతామన్నారు.
తాజావార్తలు
-
Shocking: అది ఆహారం కాదు ఆత్మహత్య.. ప్లేట్లో విషాన్ని పెట్టుకుని తింటున్న హైదరాబాద్ యువత.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
-
Protein Food : అమ్మ జ్ఞాపకం.. కేవలం 5 నిమిషాల్లో తయారయ్యే రుచికరమైన లావోటియన్ ‘ఎగ్ హాష్’!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
-
Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కోర్టులో లొంగిపోయిన భర్త సమర్థ్ సింగ్
ట్రెండింగ్
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!