Jharkhand: పెళ్లయిన 15రోజులకే అల్లుడిని దారుణంగా చంపిన తండ్రికొడుకులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jharkhand: జార్ఖండ్లోని మహేశ్పూర్లో సంచలన ఘటన చోటుచేసుకుంది. ఇక్కడ తండ్రీకొడుకులు కలిసి అల్లుడిని పట్టపగలు నడిరోడ్డుపై పొడిచి దారుణంగా హత్య చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఉత్కంఠ నెలకొంది. నిజానికి ఈ మొత్తం కేసు మహేశ్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాస్మతి గ్రామానికి సంబంధించినది. తండ్రి కొడుకులు కలిసి విశ్వజిత్ గోరాయ్ని పట్టపగలు హత్య చేశారు. తండ్రీకొడుకులు విశ్వజిత్ గోరాయ్ను చాలాసార్లు కత్తులతో పొడిచి పొడిచి చంపారు. తీవ్రగాయాలతో విశ్వజిత్ అక్కడికక్కడే మరణించాడు. తర్వాత నిందితులైన తండ్రీకొడుకులు వీరు మండల్, సీతారాం మండల్లు అక్కడి నుంచి పరారయ్యారు.
విశ్వజిత్ 2020లో వీరు మండల్ కుమార్తె పాయల్తో మొదటి వివాహం జరిగింది. కానీ వరకట్న డిమాండ్లు, ఇతర వివాదాల కారణంగా పాయల్ తన ఆరు నెలల కుమార్తెతో విడిగా జీవిస్తోంది. దీని తరువాత మార్చి 16, 2021 న పాయల్ మృతదేహం ఇంటికి కూతవేటు దూరంలో ఉన్న పొదల్లో లభ్యమైంది. ఈ హత్యకు సంబంధించి అల్లుడు విశ్వజిత్ గోరాయ్, బావమరిది కరణ్ గోరాయ్, మేఘా గోరై, భైరవ్ గోరాయ్లపై పాయల్ బంధువులు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.
Also Read
- Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ 'నో ఛాన్స్'.!
- Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
- US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
- Ishan Kishan: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో పేలిన పాకెట్ డైనమెట్.. నెం.1 బ్యాటర్గా ఇషాన్ కిషన్.!
Read Also:Minister Harish Rao: ఏడాదికి రెండు పంటలకు నీళ్లు ఇచ్చిన ఘనత మాదే
ఈ కేసులో విశ్వజిత్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పటికీ సాక్ష్యాధారాలు లేకపోవడంతో జైలుకు పంపలేకపోయారు. క్రమంగా పోలీసులు కేసును వదిలేశారు. కానీ పాయల్ కుటుంబం మాత్రం ప్రతీకార భావంతో లోలోపల మండిపోతోంది. మే 10న హరీష్పూర్ గ్రామానికి చెందిన ప్రియాంక కుమారితో విశ్వజిత్ వివాహం చేసుకోవడం వారిలో కోపాన్ని మరింత పెంచింది. వారు ప్రతీకారం తీర్చుకోవడానికి అవకాశం కోసం చూస్తున్నారు.
Read Also:Sharwanand: హే.. శర్వా.. నువ్వా.. పెళ్ళికి ముందే ఇలా మారిపోయావు ఏంటీ ..?
విశ్వజిత్ తన రెండో భార్యతో కలిసి పూజకు వెళ్తుండగా.. తండ్రి కొడుకులు ఇద్దరిని చుట్టుముట్టి విశ్వజిత్ను హత్య చేశారు. పెళ్లి జరిగి నెల కూడా కాలేదు ప్రియాంక కుంకుమ తుడిచిపెట్టుకుపోయింది. ఈ ఘటనలో ఆమెకు కూడా గాయాలయ్యాయి. అదే సమయంలో ఈ హత్య కేసులో పోలీసులు సీరియస్గా పనిచేస్తున్నారని మహేశ్పూర్ ఎస్డిపిఓ నవనీత్ హేమ్రోమ్ అన్నారు. కేసును సత్వరమే విచారించి నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపుతామన్నారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!