Jharkhand: పెళ్లయిన 15రోజులకే అల్లుడిని దారుణంగా చంపిన తండ్రికొడుకులు
Jharkhand: జార్ఖండ్లోని మహేశ్పూర్లో సంచలన ఘటన చోటుచేసుకుంది. ఇక్కడ తండ్రీకొడుకులు కలిసి అల్లుడిని పట్టపగలు నడిరోడ్డుపై పొడిచి దారుణంగా హత్య చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఉత్కంఠ నెలకొంది. నిజానికి ఈ మొత్తం కేసు మహేశ్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాస్మతి గ్రామానికి సంబంధించినది. తండ్రి కొడుకులు కలిసి విశ్వజిత్ గోరాయ్ని పట్టపగలు హత్య చేశారు. తండ్రీకొడుకులు విశ్వజిత్ గోరాయ్ను చాలాసార్లు కత్తులతో పొడిచి పొడిచి చంపారు. తీవ్రగాయాలతో విశ్వజిత్ అక్కడికక్కడే మరణించాడు. తర్వాత నిందితులైన తండ్రీకొడుకులు వీరు మండల్, సీతారాం మండల్లు అక్కడి నుంచి పరారయ్యారు.
విశ్వజిత్ 2020లో వీరు మండల్ కుమార్తె పాయల్తో మొదటి వివాహం జరిగింది. కానీ వరకట్న డిమాండ్లు, ఇతర వివాదాల కారణంగా పాయల్ తన ఆరు నెలల కుమార్తెతో విడిగా జీవిస్తోంది. దీని తరువాత మార్చి 16, 2021 న పాయల్ మృతదేహం ఇంటికి కూతవేటు దూరంలో ఉన్న పొదల్లో లభ్యమైంది. ఈ హత్యకు సంబంధించి అల్లుడు విశ్వజిత్ గోరాయ్, బావమరిది కరణ్ గోరాయ్, మేఘా గోరై, భైరవ్ గోరాయ్లపై పాయల్ బంధువులు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.
Also Read
- US: ముంచుకొస్తున్న ముప్పు.. ఇరాన్ను తుడిచిపెట్టేందుకు ట్రంప్ 'మాస్టర్ ప్లాన్' సిద్ధం!
- Petrol, Diesel Price: భారీగా పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధరలు.. పెట్రోల్, డీజిల్ పెరుగుదలపై కేంద్రం క్లారిటీ!
- Bitter Gourd Chips Recipe: కారం కారంగా కరకరలాడే కాకరకాయ చిప్స్.. చేదు లేకుండా ఇంట్లోనే సులభంగా తయారు చేసే ప్రత్యేక రెసిపీ..
- AP Student Suicide in US: అమెరికాలో కర్నూలు యువకుడు ఆత్మహత్య.. పిస్టల్తో కాల్చుకుని..
Read Also:Minister Harish Rao: ఏడాదికి రెండు పంటలకు నీళ్లు ఇచ్చిన ఘనత మాదే
ఈ కేసులో విశ్వజిత్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పటికీ సాక్ష్యాధారాలు లేకపోవడంతో జైలుకు పంపలేకపోయారు. క్రమంగా పోలీసులు కేసును వదిలేశారు. కానీ పాయల్ కుటుంబం మాత్రం ప్రతీకార భావంతో లోలోపల మండిపోతోంది. మే 10న హరీష్పూర్ గ్రామానికి చెందిన ప్రియాంక కుమారితో విశ్వజిత్ వివాహం చేసుకోవడం వారిలో కోపాన్ని మరింత పెంచింది. వారు ప్రతీకారం తీర్చుకోవడానికి అవకాశం కోసం చూస్తున్నారు.
Read Also:Sharwanand: హే.. శర్వా.. నువ్వా.. పెళ్ళికి ముందే ఇలా మారిపోయావు ఏంటీ ..?
విశ్వజిత్ తన రెండో భార్యతో కలిసి పూజకు వెళ్తుండగా.. తండ్రి కొడుకులు ఇద్దరిని చుట్టుముట్టి విశ్వజిత్ను హత్య చేశారు. పెళ్లి జరిగి నెల కూడా కాలేదు ప్రియాంక కుంకుమ తుడిచిపెట్టుకుపోయింది. ఈ ఘటనలో ఆమెకు కూడా గాయాలయ్యాయి. అదే సమయంలో ఈ హత్య కేసులో పోలీసులు సీరియస్గా పనిచేస్తున్నారని మహేశ్పూర్ ఎస్డిపిఓ నవనీత్ హేమ్రోమ్ అన్నారు. కేసును సత్వరమే విచారించి నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపుతామన్నారు.
తాజావార్తలు
-
Junior Civil Judge Court: కాటారం రెవెన్యూ డివిజన్కు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మంజూరు..
-
Kalki2898AD : ‘కల్కి 2’ షూటింగ్ స్టార్ట్.. రెబలోడు సెట్స్ లో ఎప్పుడు అడుగుపెడుతున్నాడంటే?
-
US: ముంచుకొస్తున్న ముప్పు.. ఇరాన్ను తుడిచిపెట్టేందుకు ట్రంప్ ‘మాస్టర్ ప్లాన్’ సిద్ధం!
-
Imran Khan: 85% చూపు కోల్పోయిన ఇమ్రాన్ ఖాన్.. వైద్య కారణాలతో విడుదల కోరుతూ కోర్టుకు అప్పీల్
-
Rajat Patidar: పాయింట్ల పట్టికను పట్టించుకోవడం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!