Jharkhand: పెళ్లయిన 15రోజులకే అల్లుడిని దారుణంగా చంపిన తండ్రికొడుకులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jharkhand: జార్ఖండ్లోని మహేశ్పూర్లో సంచలన ఘటన చోటుచేసుకుంది. ఇక్కడ తండ్రీకొడుకులు కలిసి అల్లుడిని పట్టపగలు నడిరోడ్డుపై పొడిచి దారుణంగా హత్య చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఉత్కంఠ నెలకొంది. నిజానికి ఈ మొత్తం కేసు మహేశ్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాస్మతి గ్రామానికి సంబంధించినది. తండ్రి కొడుకులు కలిసి విశ్వజిత్ గోరాయ్ని పట్టపగలు హత్య చేశారు. తండ్రీకొడుకులు విశ్వజిత్ గోరాయ్ను చాలాసార్లు కత్తులతో పొడిచి పొడిచి చంపారు. తీవ్రగాయాలతో విశ్వజిత్ అక్కడికక్కడే మరణించాడు. తర్వాత నిందితులైన తండ్రీకొడుకులు వీరు మండల్, సీతారాం మండల్లు అక్కడి నుంచి పరారయ్యారు.
విశ్వజిత్ 2020లో వీరు మండల్ కుమార్తె పాయల్తో మొదటి వివాహం జరిగింది. కానీ వరకట్న డిమాండ్లు, ఇతర వివాదాల కారణంగా పాయల్ తన ఆరు నెలల కుమార్తెతో విడిగా జీవిస్తోంది. దీని తరువాత మార్చి 16, 2021 న పాయల్ మృతదేహం ఇంటికి కూతవేటు దూరంలో ఉన్న పొదల్లో లభ్యమైంది. ఈ హత్యకు సంబంధించి అల్లుడు విశ్వజిత్ గోరాయ్, బావమరిది కరణ్ గోరాయ్, మేఘా గోరై, భైరవ్ గోరాయ్లపై పాయల్ బంధువులు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.
Also Read
- Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంపై కొత్త డిమాండ్.. పైలట్ల సంఘాలు నిరసన
- AP Liquor Scam: లిక్కర్ కేసులో అరెస్ట్లపై ఈడీ కీలక ప్రకటన.. రూ.195.33 కోట్ల నష్టం..!
- Riyan Parag: గాయంతో పోరాటం.. కన్నీళ్లు దాచుకుంటూ సర్జరీ బెడ్పై నుంచి రియాన్ పరాగ్ ఎమోషనల్ వర్డ్స్..
- Tilak Varma: మా కొంప ముంచింది అదొక్కటే.. ఓటమిపై కీలక వ్యాఖ్యలు చేసిన తిలక్ వర్మ..
Read Also:Minister Harish Rao: ఏడాదికి రెండు పంటలకు నీళ్లు ఇచ్చిన ఘనత మాదే
ఈ కేసులో విశ్వజిత్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పటికీ సాక్ష్యాధారాలు లేకపోవడంతో జైలుకు పంపలేకపోయారు. క్రమంగా పోలీసులు కేసును వదిలేశారు. కానీ పాయల్ కుటుంబం మాత్రం ప్రతీకార భావంతో లోలోపల మండిపోతోంది. మే 10న హరీష్పూర్ గ్రామానికి చెందిన ప్రియాంక కుమారితో విశ్వజిత్ వివాహం చేసుకోవడం వారిలో కోపాన్ని మరింత పెంచింది. వారు ప్రతీకారం తీర్చుకోవడానికి అవకాశం కోసం చూస్తున్నారు.
Read Also:Sharwanand: హే.. శర్వా.. నువ్వా.. పెళ్ళికి ముందే ఇలా మారిపోయావు ఏంటీ ..?
విశ్వజిత్ తన రెండో భార్యతో కలిసి పూజకు వెళ్తుండగా.. తండ్రి కొడుకులు ఇద్దరిని చుట్టుముట్టి విశ్వజిత్ను హత్య చేశారు. పెళ్లి జరిగి నెల కూడా కాలేదు ప్రియాంక కుంకుమ తుడిచిపెట్టుకుపోయింది. ఈ ఘటనలో ఆమెకు కూడా గాయాలయ్యాయి. అదే సమయంలో ఈ హత్య కేసులో పోలీసులు సీరియస్గా పనిచేస్తున్నారని మహేశ్పూర్ ఎస్డిపిఓ నవనీత్ హేమ్రోమ్ అన్నారు. కేసును సత్వరమే విచారించి నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపుతామన్నారు.
తాజావార్తలు
-
Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంపై కొత్త డిమాండ్.. పైలట్ల సంఘాలు నిరసన
-
AP Liquor Scam: లిక్కర్ కేసులో అరెస్ట్లపై ఈడీ కీలక ప్రకటన.. రూ.195.33 కోట్ల నష్టం..!
-
Pawan Kalyan : ఓజీ 2 ఈజ్ ఆన్.. పవన్ ఫ్యాన్ కి పండుగ లాంటి న్యూస్
-
Riyan Parag: గాయంతో పోరాటం.. కన్నీళ్లు దాచుకుంటూ సర్జరీ బెడ్పై నుంచి రియాన్ పరాగ్ ఎమోషనల్ వర్డ్స్..
-
Vishal: ఒళ్లు గగుర్పొడిచేలా విశాల్ ‘మకుటం’ టీజర్
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!