NTV Telugu Site icon

Road Accident: అన్నమయ్య జిల్లాలో ఘోర ప్రమాదం.. కారు-లారీ ఢీ, ఐదుగురు స్పాట్ డెడ్

Accident

Accident

అన్నమయ్య జిల్లా సరిహద్దుల్లో ఘోర ప్రమాదం జరిగింది. కారు కంటైనర్ లారీని ఢీకొనడంతో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. గువ్వల చెరువు ఘాట్ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కాగా.. కారు కడప నుండి రాయచోటికి వెళ్తున్న సమయంలో కంటైనర్ ను ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. అయితే.. ఈ ఘటనలో కారు లారీని ఢీకొట్టడంతో లోయలో పడింది. దీని బట్టి అర్ధం చేసుకోవచ్చు.. కారు ఎంతటి వేగంలో ఉన్నదని. ఇదిలా ఉంటే.. లారీని ఢీకొట్టిన కారు.. నుజ్జునుజ్జు అయింది.

Read Also: Pune: 11 ఏళ్ల విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడిన 67ఏళ్ల వృద్ధుడు!

మరోవైపు ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ కూడా మృతి చెందాడు. కాగా.. క్లీనర్ పరిస్థితి విషమంగా ఉంది. కారులో ప్రయాణిస్తున్న మృతులంతా చక్రాయపేట మండలం చెందిన వారిగా ప్రాథమికంగా గుర్తించారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు.

Read Also: ICC Women’s T20 World Cup 2024: ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2024 కొత్త షెడ్యూల్‌ విడుదల..