Adilabad: విత్తన షాపుల వద్ద రైతుల పాట్లు.. ఎండలో ఇబ్బందులు పడుతున్న అన్నదాతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో విత్తన షాపుల వద్ద రైతులు పాట్లు పడుతున్నారు. ఉదయం నుంచి ఎండలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆధార్ కార్డు, పాస్ పుస్తకాలు చేత పట్టుకొని విత్తనాల కోసం క్యూ కట్టారు. మండుతున్న ఎండలో విత్తనాల కోసం రైతుల కష్టాలు పడుతున్నారు. కొద్ది షాపుల్లో స్టాక్ ఉండటంతో.. రైతులు భారీగా బారులు తీరారు. ఎండను సైతం లెక్క చేయకుండా నిలబడితే కేవలం ప్యాకెట్లు ఇస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 659 అనే రకం విత్తనాలే కావాలని రైతులు కోరుతున్నారు.
Read Also: PawanKalyan- Chandrababu: ఈనెల 31న పవన్ కల్యాణ్, చంద్రబాబు భేటీ.. ఎందుకంటే?
Also Read
- Islamabad: ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన 15 మంది శిశువులు
- WhatsApp: వాట్సాప్ వినియోగదారులకు మైండ్ బ్లోయింగ్ అప్డేట్.. ఇక మీ అకౌంట్కు డబుల్ ప్రొటెక్షన్!
- Fake Cancer Drugs: క్యాన్సర్ బాధితుల ప్రాణాలతో చెలగాటం.. నీళ్లతో నింపిన నకిలీ ఇంజెక్షన్ల విక్రయం గుట్టురట్టు
- Rohit Sharma: ఆర్సీబీలోకి రోహిత్ శర్మ? ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రెడ్ జెర్సీ ఫొటో.. ఇక్కడే అసలైన ట్విస్ట్!
మరోవైపు.. పట్టణంలోని గాంధీచౌక్, అంబేద్కర్ చౌక్ ప్రాంతంలో గల విత్తనాల షాపులను జిల్లా ఎస్పీ గౌష్ ఆలం పరిశీలించారు. ఈ సందర్భంగా యజమానులతో విత్తనాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులు ఒకే రకం విత్తనాలను కోరుకోవడం వల్ల డిమాండ్ పెరిగిపోయిందని తెలిపారు. దానివల్లనే షాపుల వద్ద క్యూ లైన్లను ఏర్పాటు చేయడంలో పోలీసుల బందోబస్తు ఏర్పా్టు చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు. అన్ని షాపుల వద్ద సరైన క్రమబద్దీకరణతో కూడిన వరుసక్రమాలను ఏర్పాటు చేయాలని సిబ్బందికి సూచించారు. ప్రశాంతంగా రైతులు సంయమనం పాటిస్తూ వరుస క్రమాలలో విత్తనాలను షాపుల వద్ద నుండి తీసుకోవాలని, పోలీసులు తమ క్షేమం కోసమే విధులను నిర్వర్తిస్తుంటారనే విషయాన్ని గమనించాలని ఎస్పీ సూచించారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా నకిలీ విత్తనాలు అడ్డుకట్టకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తే ఆకస్మిక తనిఖీలను నిర్వర్తిస్తున్నట్టు, ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం ఆదిలాబాద్ పట్టణంలో భారీ ఎత్తున దాదాపు 500 కిలోల 19 లక్షల విలువ చేసే నకిలీ విత్తనాలను పట్టుకున్నట్లు ఎస్పీ గౌష్ ఆలం తెలిపారు.
Read Also: Mamata Banerjee: ‘‘మోడీకి గుడి కట్టించి, ధోక్లా ప్రసాదంగా ఇస్తాం’’.. ప్రధానిపై మమత సెటైర్లు..
తాజావార్తలు
-
Islamabad: ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన 15 మంది శిశువులు
-
US Visa Interview Pause: అమెరికా వీసా కోసం ఎదురుచూస్తున్నవారికి షాక్.. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్వ్యూలు వాయిదా, కారణం ఇదే!
-
Ravi Teja-Irumudi: బాక్సాఫీస్ను షేక్ చేస్తున్న ‘ఇరుముడి’.. రవితేజ @ 100 కోట్ల సినిమాల లిస్ట్ ఇదే!
-
Baahubali: Before the Beginning: రూ.97 కోట్లు ఖర్చు.. రెండు సీజన్లు పూర్తి.. అయినా ‘బాహుబలి’ ప్రీక్వెల్ ను నెట్ఫ్లిక్స్ ఎందుకు ఆపేసింది?
-
Nokia 300 Charge: నోకియా 300 Charge ఫీచర్ ఫోన్ వచ్చేసింది.. 10W రివర్స్ ఛార్జింగ్, 3,700mAh బ్యాటరీతో!
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!