America: విద్యార్థినిపై పిడుగుపాటు.. అమెరికాలో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
America: భారతీయులు విదేశాలకు వివిధ పనుల కోసం వెళుతుంటారు. ప్రధానంగా ఉన్నత విద్యను అభ్యసించడంతోపాటు.. ఉద్యోగాల కోసం ప్రపంచంలోని వివిధ దేశాలకు వెళుతుంటారు. అందులో ఎక్కువ మంది ఉన్నత విద్యతోపాటు.. ఉద్యోగాల కోసం అమెరికా వెళ్లే భారతీయు ఎక్కువగా ఉంటారు. ఇప్పటికీ అమెరికాలో ప్రవాస భారతీయులు ఎక్కువ మంది ఉంటారు. అలా అమెరికాలో ఉన్నత విద్య, ఉద్యోగాల కోసం వెళుతున్న వారిలో కొందరు ప్రమాదాలకు గురవుతున్న వారు కూడా ఉంటున్నారు. ప్రమాదాలకు గురై మరణిస్తున్న వారు కొందరైతే.. ప్రమాదాల నుంచి బయట పడుతున్న వారు మరికొందరు. భారత సంతతికి చెందిన ఒక విద్యార్థిని పిగుడుపాటుకు గురైంది. విద్యార్థినిపై పిడుగు పడింది. పిడుగుపాటుకు గురైన విద్యార్థిని మృత్యుతో పోరాడుతోంది. ఉన్నత విద్య కోసం అమెరికా వచ్చిన సుశ్రూణ్య పిడుగుపాటుకు గురైంది. ప్రస్తుతం మృత్యువుతో పోరాడుతోంది.
Read also: Kishan Reddy: నేడే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యతలు.. పాల్గొననున్న ముఖ్యనేతలు
Also Read
- Sheikh Hasina: "నరహంతకురాలు".. షేక్ హసీనా స్పీచ్పై బంగ్లాదేశ్ ఆగ్రహం..
- Iran: సుప్రీం లీడర్తో మాట్లాడటం కష్టమే.. ఇరాన్ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
- Princess Isabella: చరిత్ర సృష్టించిన డెన్మార్క్ యువరాణి ఇసబెల్లా.. తొలిసారి సైన్యంలో చేరిన రాజకుటుంబ మహిళ!
- Trump Marine One: ట్రంప్కు గగనతలంలో ప్రమాదం?.. ప్రయాణిస్తున్న ‘మెరైన్ వన్’కు దగ్గరగా వచ్చిన ప్యాసింజర్ విమానం
ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన భారతీయ విద్యార్థిని పిడుగుపాటుకు గురై మృత్యువుతో పోరాడుతోంది. యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్ (యూహెచ్)లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మాస్టర్స్ చేస్తున్న విద్యార్థిని సుశ్రూణ్య కోడూరు (25) జులై మొదటివారంలో తన స్నేహితులతో కలిసి స్థానిక పార్కులో ఓ కొలను వెంబడి నడుచుకుంటూ వెళుతున్న సమయంలో పిడుగుపాటుకు గురైంది. వెంటనే విద్యార్థిని ఆసుప్రతికి తరలించి చికిత్సను అందించారు. అయితే ఈ ఘటనలో ఆమె మెదడు దెబ్బతిన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. చాలా కీలకమైన వైద్యచికిత్సను సుదీర్ఘకాలం అందించాల్సి ఉంటుందని సుశ్రూణ్య బంధువు సురేంద్రకుమార్ కొత్త తెలిపారు. ఈ మేరకు ఆమె వైద్యఖర్చుల కోసం, అలాగే కుటుంబసభ్యులను పిలిచేందుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని కోరుతూ ఆన్లైన్లో ‘గోఫండ్మీ’ని ఏర్పాటు చేశారు. సుశ్రూణ్య పిడుగుపాటుకు గురైన వెంటనే కొలనులో పడిపోయారని, ఆ సమయంలో 20 నిమిషాలపాటు గుండె లయ తప్పడంతో మెదడు దెబ్బతిన్నట్లు సురేంద్ర తెలిపారు. తర్వాత ఆమె కోమాలోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం కోమాలోనే ఉన్నారని తెలిపారు.
తాజావార్తలు
-
GDN : సైలెంటుగా తెలుగులోకి మాధవన్ G D నాయుడు
-
Sheikh Hasina: “నరహంతకురాలు”.. షేక్ హసీనా స్పీచ్పై బంగ్లాదేశ్ ఆగ్రహం..
-
Retirement Age: ఆ ఉద్యోగులకు గుడ్న్యూస్.. పదవీ విరమణ వయస్సు పెంపు..
-
Iran: సుప్రీం లీడర్తో మాట్లాడటం కష్టమే.. ఇరాన్ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
-
Uttar Pradesh: గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ కుమారుడు మృతి.. జైలులో ఉన్న అన్నను కలిసేందుకు వెళ్తూ..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!