Deputy CM Pawan Kalyan: బాధితుల ప్లకార్డు చూసి కాన్వాయ్ ఆపిన పవన్.. న్యాయం చేస్తానని హామీ
- పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి తీర ప్రాంతాన్ని పరిశీలించిన డిప్యూటీ సీఎం..
- పవన్ వెళ్తున్న రూట్ లో తమకు న్యాయం చేయాలని ప్లకార్డుల ప్రదర్శన..
- కాన్వాయ్ ఆపి.. వాళ్లతో మాట్లాడి పవన్ కల్యాణ్.. న్యాయం చేస్తానని హామీ..
- కొండెవరంలో గత వారం ఆత్మహత్య చేసుకున్న చక్రధర్ అనే యువకుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy CM Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రూటే వేరు.. సమస్య అంటూ తన దగ్గరకు వచ్చిన వారిని అక్కున చేర్చుకుని.. వెంటనే వారి సమస్య పరిష్కారానికి పూనుకుంటారు.. తన దగ్గరకు వచ్చేవారికే కాదు.. దారిలో ఎవరైనా కనిపించినా కాన్వాయ్ ఆపి మరి పలకరిస్తారు.. కాకినాడ జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. ఈ రోజు పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి తీర ప్రాంతాన్ని పరిశీలించారు.. అయితే, పవన్ వెళ్తున్న రూట్ లో తమకు న్యాయం చేయాలని ప్లకార్డులు ప్రదర్శించారు.. కొండెవరంలో గత వారం ఆత్మహత్య చేసుకున్న చక్రధర్ కుటుంబ సభ్యులు.. వెంటనే కాన్వాయ్ ఆపి.. వాళ్లతో మాట్లాడి పవన్.. న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు..
Also Read
- Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
- Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
- Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
కాగా, యు కొత్తపల్లి మండలం కొండెవరంలో చక్రధర్ అనే యువకుడి ఆత్మహత్య సంచలనంగా మారింది.. 2021లో గ్రామానికి చెందిన మనీషా అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న చక్రధర్.. మనీషా మైనర్ కావడంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రెండు నెలలు జైల్లోనే ఉన్నాడు.. ఆ తర్వాత మనీషాను తీసుకుని హైదరాబాద్ వెళ్ళిపోయింది కుటుంబం.. జూన్ 16న మనీషా పుట్టినరోజు సందర్భంగా విషెస్ మెసేజ్ పెట్టాడు చక్రధర్.. ఇక, 22న పరీక్ష రాయడానికి తన అక్క ఇంటికి వచ్చింది యువతి.. అదే రోజు చక్రధర్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.. 22న ఆదివారం పోలీస్ స్టేషన్ కు తీసుకుని వెళ్లి విచారణ చేసి, తిరిగి సోమవారం రమ్మని చెప్పారు పోలీసులు.. కానీ, ఇంటికి వచ్చి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు చక్రధర్.. పోలీసులు ఇబ్బందులు, మనీషా కుటుంబ సభ్యుల వేధింపుల వల్ల తమకుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని చక్రధర్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.. అయితే, విచారణలో భాగంగానే తీసుకొచ్చామని పోలీసులు చెబుతున్నారు.. మరి ఈ కేసులో ఏం తేలుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!