Deputy CM Pawan Kalyan: బాధితుల ప్లకార్డు చూసి కాన్వాయ్ ఆపిన పవన్.. న్యాయం చేస్తానని హామీ
- పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి తీర ప్రాంతాన్ని పరిశీలించిన డిప్యూటీ సీఎం..
- పవన్ వెళ్తున్న రూట్ లో తమకు న్యాయం చేయాలని ప్లకార్డుల ప్రదర్శన..
- కాన్వాయ్ ఆపి.. వాళ్లతో మాట్లాడి పవన్ కల్యాణ్.. న్యాయం చేస్తానని హామీ..
- కొండెవరంలో గత వారం ఆత్మహత్య చేసుకున్న చక్రధర్ అనే యువకుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy CM Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రూటే వేరు.. సమస్య అంటూ తన దగ్గరకు వచ్చిన వారిని అక్కున చేర్చుకుని.. వెంటనే వారి సమస్య పరిష్కారానికి పూనుకుంటారు.. తన దగ్గరకు వచ్చేవారికే కాదు.. దారిలో ఎవరైనా కనిపించినా కాన్వాయ్ ఆపి మరి పలకరిస్తారు.. కాకినాడ జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. ఈ రోజు పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి తీర ప్రాంతాన్ని పరిశీలించారు.. అయితే, పవన్ వెళ్తున్న రూట్ లో తమకు న్యాయం చేయాలని ప్లకార్డులు ప్రదర్శించారు.. కొండెవరంలో గత వారం ఆత్మహత్య చేసుకున్న చక్రధర్ కుటుంబ సభ్యులు.. వెంటనే కాన్వాయ్ ఆపి.. వాళ్లతో మాట్లాడి పవన్.. న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు..
Also Read
- Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
- Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
- YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
- OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
కాగా, యు కొత్తపల్లి మండలం కొండెవరంలో చక్రధర్ అనే యువకుడి ఆత్మహత్య సంచలనంగా మారింది.. 2021లో గ్రామానికి చెందిన మనీషా అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న చక్రధర్.. మనీషా మైనర్ కావడంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రెండు నెలలు జైల్లోనే ఉన్నాడు.. ఆ తర్వాత మనీషాను తీసుకుని హైదరాబాద్ వెళ్ళిపోయింది కుటుంబం.. జూన్ 16న మనీషా పుట్టినరోజు సందర్భంగా విషెస్ మెసేజ్ పెట్టాడు చక్రధర్.. ఇక, 22న పరీక్ష రాయడానికి తన అక్క ఇంటికి వచ్చింది యువతి.. అదే రోజు చక్రధర్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.. 22న ఆదివారం పోలీస్ స్టేషన్ కు తీసుకుని వెళ్లి విచారణ చేసి, తిరిగి సోమవారం రమ్మని చెప్పారు పోలీసులు.. కానీ, ఇంటికి వచ్చి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు చక్రధర్.. పోలీసులు ఇబ్బందులు, మనీషా కుటుంబ సభ్యుల వేధింపుల వల్ల తమకుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని చక్రధర్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.. అయితే, విచారణలో భాగంగానే తీసుకొచ్చామని పోలీసులు చెబుతున్నారు.. మరి ఈ కేసులో ఏం తేలుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్ఫర్డ్కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!