Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం..
- నకిలీ మద్యం తయారీ కేసులో కీలక పరిణామం..
- ఏడుగురు నిందితులను కస్టడీలోకి తీసుకున్న ఎక్సైజ్ పోలీసులు..
- ఐదు రోజులపాటు విచారించనున్న అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fake Liquor Case: నకిలీ మద్యం తయారీ కేసులో ఏడుగురు నిందితులను ఎక్సైజ్ పోలీసులు కస్టడీకి తీసుకొని విచారణ ప్రారంభించారు.. వీరిని ఐదు రోజులపాటు విచారించనున్నారు.. కోర్టు ఆదేశాలతో నిందితులను జైలు నుంచి ఎక్సైజ్ కార్యాలయానికి శుక్రవారం ఉదయం తరలించారు.. కేసులో నిందితులుగా ఉన్న రవి, బాదల్ దాస్, ప్రదీప్ దాస్, శ్రీనివాస్ రెడ్డి, కళ్యాణ్, రమేష్ బాబు, అల్లా భక్షు లను కస్టడీ కి తీసుకున్నారు. ఈ ఏడుగురు కూడా అద్దేపల్లి జనార్ధన్ కి నకిలీ మద్యం తయారీకి సంబంధించి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా సహకరించినట్టు ఇప్పటికే పోలీసులు గుర్తించారు. దీంతో అద్దేపల్లి జనార్ధన్ తో ఉన్న ఆర్థిక సంబంధాలను కూడా అధికారులు విచారణ సందర్భంగా నిందితులను ప్రశ్నించారు.
Also Read
- Weather Forecast Today: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. రెండు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు!
- What's Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
- TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
నకిలీ మద్యం తయారు చేయడం కోసం ప్లాస్టిక్ బాటిల్స్ ను లేబుల్స్ అందించిన ఏ ఫోర్ రవిని పూర్తిస్థాయిలో విచారించారు. ఎంత స్థాయిలో వాటిని అద్దేపల్లి జనార్ధన్కు ఎన్నాళ్ళ నుంచి సరఫరా చేస్తున్నారు.. అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఒరిస్సాకు చెందిన బాధలుదస్ ప్రదీప్ దాస్ ఇద్దరు కూడా.. నకిలీ మద్యం తయారీ కార్మికులుగా.. పనిచేస్తున్నట్టు గుర్తించి అరెస్టు చేశారు. దీంతో తమతో ఎవరు టచ్ లోకి వచ్చి ఈ పనిలో చేర్చారు.. అనే అంశాలను విచారణలో తెలుసుకున్నారు. ఇక నకిలీ మద్యం అమ్మకాలు జరిపిన శ్రీనివాస్ వైన్స్ మేనేజర్ కళ్యాణ్ ని కూడా విచారించారు. నకిలీ మద్యం అని తెలిసి అమ్మకాలు ఎలా జరిపారని దీని వెనుక జనార్ధన్ కాకుండా ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే విషయాలను ప్రశ్నించారు. ఇక, మరో నిందితుడు శ్రీనివాస్ రెడ్డి తన కంపెనీలోనే ప్లాస్టిక్ బాటిల్ లను పెద్ద ఎత్తున నకిలీ మద్యం నింపేందుకు జనార్ధన్ కు అమ్మినట్టు గుర్తించారు. దీంతో జనార్ధన్ తో ఏ విధంగా పరిచయం అయింది.. అనే అంశాలతో పాటు ఎన్ని లక్షలు బాటిల్స్ సరఫరా చేశారని వివరాలను అడిగారు విచారణ రేపు కూడా కొనసాగనుంది..
తాజావార్తలు
-
Tragedy : చిలకలగూడలో దారుణం.. బీటెక్ విద్యార్థిని వెంటాడి, కత్తులతో పొడిచి దారుణ హత్య.!
-
Trump Tariffs: అమెరికా కోర్టు నుంచి ట్రంప్కు మరో ఎదురుదెబ్బ.. 10% సుంకాలు చట్టవిరుద్ధమని కొట్టివేత
-
BCCI-IPL 2026: ఇకపై ఐపీఎల్లో ఆటగాళ్ల ఆటలు సాగవు.. సస్పెన్షన్ లేదా డిస్క్వాలిఫికేషన్!
-
AshuReddy Case : అషురెడ్డి కేసులో స్టేకు హైకోర్టు నిరాకరణ.. రంగంలోకి పోలీసులు
-
Weather Forecast Today: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. రెండు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు!