Delhi Heatwave: ఢిల్లీలో నిప్పుల కొలిమి.. తారు రోడ్ల ఏకంగా 65°C ఉష్ణోగ్రత నమోదు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Heatwave: ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయి. ఢిల్లీతో పాటు ఉత్తర భారత దేశంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40°C నుంచి 45°C మధ్య నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు బయట అడుగు పెట్టాలంటేనే వణికిపోతున్నారు. అయితే, మన మొబైల్ ఫోన్లలోని వెదర్ యాప్స్ చూపించే నంబర్లకు బయట పరిస్థితులకు అస్సలు పొంతన లేదు. తూర్పు ఢిల్లీలోని జనసాంద్రత ఎక్కువగా ఉండే ‘నంద్ నగరి’ అనే ప్రాంతంలో ఉష్ణోగ్రతను క్షేత్రస్థాయిలో పరిశీలించగా షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. గ్రీన్పీస్ ఇండియా సంస్థ అందించిన థర్మల్ కెమెరా, హ్యాండ్హెల్డ్ టెంపరేచర్ మీటర్ (చేత్తో పట్టుకునే ఉష్ణోగ్రత మీటర్) సహాయంతో నంద్ నగరిలోని పలు ప్రాంతాల్లో ఉపరితల ఉష్ణోగ్రతలను (సర్ఫేస్ టెంపరేచర్) కొలిచారు. అందులో వచ్చిన ఫలితాలు చూసి అందరూ ముక్కున వేలేసుకున్నారు. ఎండ నేరుగా పడే తారు రోడ్లు, అక్కడ పార్క్ చేసిన వాహనాల ఉపరితల ఉష్ణోగ్రత ఏకంగా 65°C కంటే ఎక్కువగా నమోదైంది. థర్మల్ కెమెరా అనేది వస్తువుల నుంచి వచ్చే ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ (కంటికి కనిపించని వేడి) ఆధారంగా రంగుల చిత్రాలను చూపిస్తుంది. ఎక్కువ వేడి ఉన్న ప్రాంతాలు స్క్రీన్పై ఎరుపు లేదా తెలుపు రంగులో, చల్లగా ఉన్న ప్రాంతాలు నీలం లేదా ఆకుపచ్చ రంగులో కనిపిస్తాయి. ఈ కెమెరాలో చూసినప్పుడు రోడ్లు నిప్పులు చెరుగుతున్నట్లు కనిపించాయి.
అయితే, అదే రోడ్డు పక్కన ఉన్న ఒక చెట్టు నీడలోకి వెళ్లి చూడగా, అక్కడ ఉష్ణోగ్రత ఒక్కసారిగా 40°C కి పడిపోయింది. కేవలం కొన్ని అడుగుల దూరంలోనే దాదాపు 20 డిగ్రీల సెల్సియస్ వ్యత్యాసం కనిపించడం సామాన్యమైన విషయం కాదు. 65°C వేడి ఉన్న రోడ్డుపై మనం నడిస్తే కేవలం కొన్ని సెకన్లలోనే బొబ్బలు వచ్చేస్తాయి. నంద్ నగరి వంటి ప్రాంతాల్లో చెప్పులు లేకుండా రోడ్లపై ఆడుకునే చిన్న పిల్లలకు దీనివల్ల తీవ్ర ప్రమాదం పొంచి ఉంది. అదే సమయంలో నేరుగా ఎండలో నిలబడి గాల్లోని ఉష్ణోగ్రతను కొలిచే థర్మామీటర్తో చెక్ చేయగా.. అది 48°C చూపించింది. కానీ, అదే సమయంలో మొబైల్ ఫోన్లలోని వెదర్ యాప్స్ మాత్రం అక్కడ 42°C ఉష్ణోగ్రత ఉన్నట్లు చూపించాయి. అంటే, అధికారిక వాతావరణ సమాచారానికి, మనుషులు అక్కడ అనుభవిస్తున్న అసలైన వేడికి మధ్య 6 డిగ్రీల తేడా ఉంది.
Also Read
- AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
- Kangana Ranaut-Baba Ramdev: నా యవ్వనం గురించి మీకెందుకు బెంగ.. బాబా రామ్దేవ్పై కంగనా ఫైర్
- School Holidays: కుక్కల బెడదతో స్కూళ్లకు సెలవులు.. 4 రోజులు ఆన్లైన్ క్లాసులే..
ఈ తేడా ఎందుకు వస్తుందంటే.. అధికారిక వాతావరణ కేంద్రాలు ఉష్ణోగ్రతలను ఎప్పుడూ నీడలో, నేల నుంచి దాదాపు 1.2 మీటర్ల ఎత్తులో, వేడిని ప్రతిబింబించే వస్తువులు లేని నియంత్రిత వాతావరణంలో కొలుస్తాయి. కానీ కాంక్రీట్ భవనాలు, మెటల్ వస్తువులు, వాహనాల పొగతో నిండిపోయిన ఇరుకైన వీధుల్లో ప్రజలు అనుభవించే వేడి చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే, అదే వీధిలో ఉన్న చెట్ల నీడలోకి వెళ్లినప్పుడు మాత్రం ఎయిర్ టెంపరేచర్ 42°C నుంచి 43°C కి పడిపోయింది. ఇది వెదర్ యాప్ చూపించిన రీడింగ్తో సరిగ్గా సరిపోయింది. చెట్లు తమ వేర్ల ద్వారా పీల్చుకున్న నీటిని ఆకుల ద్వారా నీటి ఆవిరి రూపంలో గాల్లోకి విడుదల చేస్తాయి. దీనినే ఎవాపోట్రాన్స్పిరేషన్ అంటారు. ఈ ప్రక్రియ చుట్టుపక్కల ఉన్న వేడిని లాగేసుకుంటుంది. మనుషులకు చెమట పట్టినప్పుడు శరీరం ఎలా చల్లబడుతుందో.. ఇది కూడా అంతే! పైగా చెట్ల కొమ్మలు, ఆకులు సూర్యుడి ఎండ నేరుగా భూమిపై పడకుండా అడ్డుకుంటాయి.
తాజావార్తలు
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!