Nellore: వివాహేతర సంబంధం.. నిండు ప్రాణం బలి.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nellore: చెట్ల మధ్యలో కుళ్లినస్థితిలో గుర్తు తెలియని మృతదేహం.. మూడు రోజుల క్రితం చంపేసి పడేశారు.. ఈ కేసులో పోలీసులకు ఎలాంటి క్లూ దొరకలేదు.. మృతుని బంధువుల ఫిర్యాదుతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేశారు.. దీంతో హత్యకు గల కారణాలు.. చంపిన వారి వివరాలు.. ఎందుకు చంపారనే విషయాలు బయటపడ్డాయి. నెల్లూరు జిల్లాలో వారం క్రితం జరిగిన హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి.
నెల్లూరు జిల్లా వింజమూరు సమీపంలోని వింజెటమ్మ కొండ సమీపంలో స్థానికులు ఓ డెడ్ బాడీ గుర్తించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు.. అక్కడికి చేరుకున్నారు. ఓ యువకుడు మూడు రోజుల క్రితం మృతి చెందినట్లు గుర్తించి అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతి చెందిన వ్యక్తిని కలిగిరి మండలంలోని వీర్నకొల్లు గ్రామానికి చెందిన మేదరమెట్ల శ్రీకాంత్గా గుర్తించారు. మృతికి గల కారణాలపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్భంగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మృతుడు మేదరమెట్ల శ్రీకాంత్ మృతికి ఓ మహిళతో వివాహేతర సంబంధం కారణమని పోలీసులు నిర్ధారించారు. ఆ మహిళ కోసం సెర్చ్ చేసే సమయంలో హత్య జరిగిన చోట టవర్ డంప్ చూడగా.. స్పాట్లో ముగ్గురు వ్యక్తులు ఉన్నారని తెలుసుకున్న పోలీసులు.. ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా నిజాలు బయటపడ్డాయి.
Also Read
- Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
- Kolkata Airport Mosque: ముగ్గురు సీఎంలు టచ్ చేయలేకపోయారు.. సువేందు రాకతో ఎయిర్పోర్టు మసీదు తరలింపు.!
- Israel-France: ఇజ్రాయెల్ మంత్రి బెన్-గ్విర్కు ఫ్రాన్స్ షాక్.. దేశంలోకి రాకుండా నిషేధం
- iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
వెంగమ్మకు.. మృతుడు శ్రీకాంత్కు మధ్య వివాహేతర సంబంధం ఉంది. శ్రీకాంత్కి తెలియకుండా వెంగమ్మ మరో ఇద్దరితో సన్నిహిత సంబంధం కొనసాగిస్తూ ఉండటంతో శ్రీకాంత్కి తెలిసి నిలదీశాడు. దీంతో అతన్ని ఎలాగైనా చంపేయాలని ఆమె డిసైడ్ అయింది. అతనికి మే 15న స్పాట్ పెట్టీ ఫోన్ చేశారు. కానీ శ్రీకాంత్ స్పందించలేదు.. దీంతో మరుసటి రోజు మరోసారి ఫోన్ చేయగా వింజమూరులోని వింజటమ్మ కొండ సమీపానికి వెళ్లాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మరోసారి గొడవ జరిగింది. ముందస్తు ప్లాన్ ప్రకారం తనతో వివాహేతర సంబంధం కలిగి ఉన్న హరిబాబు, ప్రదీప్ను పిలిపించి అతన్ని కత్తితో పొడిచి చంపించేసింది. అనంతరం మృతదేహాన్ని అక్కడే పడేసి వెళ్లిపోయారు.
ఎలాంటి క్లూ లేని ఈ కేసులో కలిగిరి పోలీసులు సాంకేతికతను ఉపయోగించి మృతుని వివరాలు తెలుసుకున్నారు. అనంతరం అతని ఫోన్ డేటా సేకరించి మహిళను అదుపులోకి తీసుకుని విచారించగా శ్రీకాంత్తో తనకు వివాహేతర సంబంధం ఉందని.. మరో ఇద్దరితో కూడా సంబంధం ఉండటంతో తనకు, శ్రీకాంత్ కి మనస్పర్ధలు వచ్చాయని విచారణలో నిందితురాలు చెప్పింది. అడ్డుగా ఉన్నాడని ఇద్దరు యువకులతో కలిసి చంపేసినట్లు నేరం ఒప్పుకుంది. ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించినట్లు తెలిపారు పోలీసులు. మొత్తంగా ఈ కేసులో ముగ్గురు నిందితులు తప్పించుకోవాలని చూసినప్పటికీ.. పోలీసులు సాంకేతిక ఆధారాలతో కేసును ఛేదించారు.
తాజావార్తలు
-
Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
-
STORY Board : తెలుగు సినీ పరిశ్రమ సంక్షోభంలో..!
-
Nellore: వివాహేతర సంబంధం.. నిండు ప్రాణం బలి.!
-
Kolkata Airport Mosque: ముగ్గురు సీఎంలు టచ్ చేయలేకపోయారు.. సువేందు రాకతో ఎయిర్పోర్టు మసీదు తరలింపు.!
-
Film Chamber: పెద్ది’ వివాదంపై సురేష్ బాబు అఫీషియల్ ప్రెస్ నోట్?
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?