S Jaishankar Mauritius Visit: రేపు మారిషస్లో విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..ఈ అంశాలపై చర్చలు
- ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించే మార్గాలను అన్వేషించే లక్ష్యంతో మంత్రి పర్యటన
- మారిషస్ మంగళవారం నుంచి రెండు రోజులు ఉండనున్న జైశంకర్
- మారిషస్ ప్రధాని ప్రవింద్ జుగ్నాథ్తో సమావేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించే మార్గాలను అన్వేషించే లక్ష్యంతో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మంగళవారం నుంచి మారిషస్లో రెండు రోజుల పర్యటనకు వెళ్లనున్నారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) ఈ పర్యటనను ప్రకటించింది. జైశంకర్ తన పర్యటనలో మారిషస్ ప్రధాని ప్రవింద్ జుగ్నాథ్తో సమావేశమవుతారు. ఇతర సీనియర్ మంత్రులతో కూడా ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. ప్రధాని మోడీ ప్రమాణ స్వీకారోత్సవం కోసం మారిషస్ ప్రధాని ప్రవింద్ జుగ్నాథ్ ఇటీవల భారత్కు వచ్చిన తర్వాత ఈ పర్యటన జరుగుతోంది. జైశంకర్ ఇంతకుముందు ఫిబ్రవరి 2021లో మారిషస్ను సందర్శించారు.
READ MORE: Madhya Pradesh: ఇంట్లో రావణుడికి గుడి కట్టి పూజలు చేస్తున్న 80 ఏళ్ల వృద్ధుడు..
Also Read
- CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
- Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
- CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్లు వైరల్
- Lalit Modi: 16 ఏళ్ల తర్వాత భారత్ రాబోతున్న లలిత్ మోడీ..
ఈ పర్యటన రెండు దేశాలకు కీలకం..
విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో ‘ఈ పర్యటన భారత్-మారిషస్ సంబంధాల ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. ఇది భారతదేశం యొక్క ‘నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ’, విజన్ సాగర్, గ్లోబల్ సౌత్ (అత్యల్ప అభివృద్ధి చెందిన దేశాలు) పట్ల దాని నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. బహుళ కోణాల ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి మరియు ప్రజల మధ్య సన్నిహిత సంబంధాలను మరింతగా పెంచుకోవడానికి రెండు దేశాల నిరంతర నిబద్ధతను కూడా ఈ పర్యటన పునరుద్ఘాటిస్తోంది.” అని పేర్కొన్నారు.
READ MORE: BJP MLA: పంక్చర్లు వేసుకోండి..విద్యార్థులకు ఎమ్మెల్యే సలహా! మండిపడుతున్న నెటిజన్లు
కాగా.. భారతదేశం మరియు రిపబ్లిక్ ఆఫ్ మార్షల్ దీవుల మధ్య ఈ రోజు (సోమవారం) అనేక ముఖ్యమైన ఒప్పందాలు జరిగాయి. 10వ మైక్రోనేషియన్ గేమ్స్ను విజయవంతంగా నిర్వహించినందుకు రిపబ్లిక్ ఆఫ్ మార్షల్ ఐలాండ్స్ను విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ వీడియో సందేశం ద్వారా అభినందించారు. రిపబ్లిక్ ఆఫ్ మార్షల్ ఐలాండ్స్లో నాలుగు కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్టుల అమలుకు సంబంధించిన ఎంఓయూపై సంతకం చేసే అవకాశం రావడం ఆనందంగా ఉందన్నారు. దాని సహాయంతో మార్షల్ దీవులు ఎంతో ప్రయోజనం పొందుతాయి.
తాజావార్తలు
-
Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్కు గుడ్బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
-
CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
-
Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
-
Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
-
Komatireddy Rajgopal Reddy : కాంగ్రెస్ నాయకత్వానికి రాజగోపాల్ రెడ్డి కీలక విజ్ఞప్తి..!
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!