S Jaishankar Mauritius Visit: రేపు మారిషస్లో విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..ఈ అంశాలపై చర్చలు
- ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించే మార్గాలను అన్వేషించే లక్ష్యంతో మంత్రి పర్యటన
- మారిషస్ మంగళవారం నుంచి రెండు రోజులు ఉండనున్న జైశంకర్
- మారిషస్ ప్రధాని ప్రవింద్ జుగ్నాథ్తో సమావేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించే మార్గాలను అన్వేషించే లక్ష్యంతో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మంగళవారం నుంచి మారిషస్లో రెండు రోజుల పర్యటనకు వెళ్లనున్నారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) ఈ పర్యటనను ప్రకటించింది. జైశంకర్ తన పర్యటనలో మారిషస్ ప్రధాని ప్రవింద్ జుగ్నాథ్తో సమావేశమవుతారు. ఇతర సీనియర్ మంత్రులతో కూడా ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. ప్రధాని మోడీ ప్రమాణ స్వీకారోత్సవం కోసం మారిషస్ ప్రధాని ప్రవింద్ జుగ్నాథ్ ఇటీవల భారత్కు వచ్చిన తర్వాత ఈ పర్యటన జరుగుతోంది. జైశంకర్ ఇంతకుముందు ఫిబ్రవరి 2021లో మారిషస్ను సందర్శించారు.
READ MORE: Madhya Pradesh: ఇంట్లో రావణుడికి గుడి కట్టి పూజలు చేస్తున్న 80 ఏళ్ల వృద్ధుడు..
Also Read
- Mavigan vs Amaravati: నెక్ట్స్ ఫైట్ 'మావిగన్ వర్సెస్ అమరావతి'.. వైఎస్ జగన్ సవాల్..
- Online House Hunting Scams: ఆన్లైన్లో ఇల్లు వెతుకుతున్నారా..? ఆకర్షణీయమైన ఫొటోల వెనుక దాగి ఉన్న మోసాలను గుర్తించండి..!
- How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
- YS Jagan: సాయికృష్ణ కేసులో కవర్అప్ జరిగిందా? జగన్ సంచలన ఆరోపణలు
ఈ పర్యటన రెండు దేశాలకు కీలకం..
విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో ‘ఈ పర్యటన భారత్-మారిషస్ సంబంధాల ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. ఇది భారతదేశం యొక్క ‘నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ’, విజన్ సాగర్, గ్లోబల్ సౌత్ (అత్యల్ప అభివృద్ధి చెందిన దేశాలు) పట్ల దాని నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. బహుళ కోణాల ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి మరియు ప్రజల మధ్య సన్నిహిత సంబంధాలను మరింతగా పెంచుకోవడానికి రెండు దేశాల నిరంతర నిబద్ధతను కూడా ఈ పర్యటన పునరుద్ఘాటిస్తోంది.” అని పేర్కొన్నారు.
READ MORE: BJP MLA: పంక్చర్లు వేసుకోండి..విద్యార్థులకు ఎమ్మెల్యే సలహా! మండిపడుతున్న నెటిజన్లు
కాగా.. భారతదేశం మరియు రిపబ్లిక్ ఆఫ్ మార్షల్ దీవుల మధ్య ఈ రోజు (సోమవారం) అనేక ముఖ్యమైన ఒప్పందాలు జరిగాయి. 10వ మైక్రోనేషియన్ గేమ్స్ను విజయవంతంగా నిర్వహించినందుకు రిపబ్లిక్ ఆఫ్ మార్షల్ ఐలాండ్స్ను విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ వీడియో సందేశం ద్వారా అభినందించారు. రిపబ్లిక్ ఆఫ్ మార్షల్ ఐలాండ్స్లో నాలుగు కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్టుల అమలుకు సంబంధించిన ఎంఓయూపై సంతకం చేసే అవకాశం రావడం ఆనందంగా ఉందన్నారు. దాని సహాయంతో మార్షల్ దీవులు ఎంతో ప్రయోజనం పొందుతాయి.
తాజావార్తలు
-
Mavigan vs Amaravati: నెక్ట్స్ ఫైట్ ‘మావిగన్ వర్సెస్ అమరావతి’.. వైఎస్ జగన్ సవాల్..
-
Kohinoor: ఈ వజ్రం కోసం యుద్ధాలు ఎందుకు జరిగాయి? శతాబ్దాలుగా వీడని మిస్టరీ!
-
Explainer: బంగారం మనది.. బిజినెస్ వాళ్లది.. ఆసియాలో గోల్డ్ హబ్గా సింగపూర్ ఎలా మారింది?
-
Fake Currency: ఎంఎన్ సీ కంపెనీలో జాబ్.. ఏడాదికి రూ.42 లక్షల శాలరీ.. హోటల్ లో ఫేక్ కరెన్సీ ప్రింట్ చేస్తున్న టెకీ..
-
IND vs ENG 2026: ఇంగ్లండ్, భారత్ టీ20 సిరీస్.. షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్, టీమ్స్ డీటెయిల్స్ ఇవే!
ట్రెండింగ్
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..