Sea Products: భారీగా పెరిగిన సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత ఆర్థిక సంవత్సరంలో భారతదేశం నుంచి సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు 27శాతం పెరిగాయి. ప్రధానంగా అమెరికా, చైనా, యూరోపియన్ దేశాలకు అధిక మొత్తంలో ఎక్స్ పోర్ట్స్ అయ్యాయని సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు, అభివృద్ధి సంస్థ ఛైర్మన్ డీవీ స్వామి వెల్లడించారు. 2021-22 ఏడాదిలో భారత్ నుంచి రూ.57,486 కోట్ల విలువైన 13.69 లక్షల టన్నుల సముద్ర ఉత్పత్తుల్ని వివిధ దేశాలకు ఎగుమతి చేయగా.. 2022-23 సంవత్సరంలో రూ.63,969 కోట్ల (8.09 బిలియన్ల అమెరికా డాలర్లు) విలువైన 17.35 లక్షల టన్నులు రవాణా చేసినట్లు పేర్కొన్నారు. పరిమాణంలో 26.73శాతం, రూపాయి విలువ పరంగా 11.08శాతం మేర వృద్ధి సాధించినట్లు వెల్లడించారు.
Also Read : Trivikram: ఆ స్టార్ హీరోలతో త్రివిక్రమ్ మూడో సినిమా చిత్రం భళారే విచిత్రం
Also Read
- PM Modi: ఎన్డీఏ నేతలకు ఝుల్మురి తినిపించిన మోడీ.. వీడియో వైరల్
- APL: మరో క్రీడా సమరానికి వేదికగా హైదరాబాద్.. అక్టోబర్ 8 నుంచే ప్రారంభం..
- Sangareddy: భార్య సంపాదన పుట్టింటికి ఇస్తోందని కసి.. సుపారీ ఇచ్చి హత్య చేయించిన భర్త!
- Crispy Bread Pakoda Recipe: పిల్లలు ఎగబడి తినే స్నాక్.. ఇంట్లోనే కరకరలాడే బ్రెడ్ పకోడా ఇలా తయారు చేసుకోండి!
పరిమాణం, విలువపరంగా రొయ్యల ఉత్పత్తులు తొలి స్థానంలో నిలిచాయి. మొత్తం ఎగుమతులలో 40.98శాతం, డాలర్ విలువలో 67.72శాతం వాటా రొయ్యలదే. రూపాయి విలువలో చూస్తే 1.01శాతం పెరిగింది. రూ.43,135 కోట్ల విలువైన 7.11 లక్షల టన్నులు ఎగుమతులు చేసినట్లు పేర్కొన్నారు. ఇందులో 2.76 లక్షల టన్నుల్ని అమెరికా, 1.46 లక్షల టన్నుల్ని చైనా, 95,377 టన్నుల్ని యూరోపియన్ యూనియన్, 65,466 టన్నుల్ని సౌత్ ఈస్ట్ ఆసియా దేశాలు దిగుమతులను చేసుకున్నాయి.
Also Read : Nottingham: నాటింగ్హమ్ దాడిలో భారత సంతతి యువతి మృతి
బ్లాక్టైగర్ రొయ్యల ఎగుమతిలో 74.06శాతం వృద్ధి సాధించింది. రూ.2,564.71 కోట్ల విలువైన 31,213 టన్నుల రొయ్యల ఎగుమతులు జరిగాయి. ఈ రకం రొయ్యలకు జపాన్ ప్రధాన మార్కెట్గా నిలిచింది. విదేశీ మార్కెట్ల విలువ పరంగా 2,632 మిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులను దిగుమతి చేసుకున్న అమెరికా తొలి స్థానంలో నిలవగా.. డిమాండు మందగించడంతో అమెరికాకు ఎగుమతులు డాలర్ పరంగా 21.94శాతం మేర తగ్గాయి. అగ్ర రాజ్యానికి ఎగుమతి అయిన వాటిలో ప్రధాన ఉత్పత్తి రొయ్యలు. 1,508 మిలియన్ డాలర్ల విలువైన 4.05 లక్షల టన్నుల మేర దిగుమతి చేసుకొని చైనా సెకండ్ ప్లేస్ లో ఉంది.
తాజావార్తలు
-
PM Modi: ఎన్డీఏ నేతలకు ఝుల్మురి తినిపించిన మోడీ.. వీడియో వైరల్
-
APL: మరో క్రీడా సమరానికి వేదికగా హైదరాబాద్.. అక్టోబర్ 8 నుంచే ప్రారంభం..
-
Kitchen Hacks: వంటింట్లో ఇల్లాళ్లకు బ్రహ్మాస్త్రం.. ఈ చిట్కాలతో గంటల పని నిమిషాల్లో ముగుస్తాయి!
-
Peddi: హోంశాఖకు షాక్: ‘పెద్ది’ టికెట్ల పెంపుపై కోర్టు ధిక్కరణ నోటీసులు!
-
Sangareddy: భార్య సంపాదన పుట్టింటికి ఇస్తోందని కసి.. సుపారీ ఇచ్చి హత్య చేయించిన భర్త!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!