Biplab Kumar Deb: త్రిపుర మాజీ సీఎం బిప్లబ్ దేబ్ ఇంటిపై దాడి.. వాహనాలు ధ్వంసం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Biplab Kumar Deb: త్రిపురలోని గోమతి జిల్లాలోని ఉదయపూర్లో మాజీ ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్ పూర్వీకుల ఇంటి వెలుపల మంగళవారం అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు పూజారులపై దాడి చేశారు. ఉదయ్పూర్లోని జంజురీ ప్రాంతంలోని రాజధర్ నగర్లోని దేబ్ నివాసానికి పూజారుల బృందం వచ్చిన సమయంలో ఈ సంఘటన జరిగింది. బుధవారం దేబ్ తండ్రి వార్షిక శ్రాద్ వేడుకలో యజ్ఞం చేయడానికి పూజారులు వచ్చారు.
గుర్తు తెలియని వ్యక్తులు సాధువులపై దాడి చేసి వారి వాహనాలను ధ్వంసం చేశారు. చుట్టుపక్కల వారు, స్థానికులు అర్చకులను రక్షించడంతో దుండగులు పారిపోయారు. “నేను త్రిపుర సుందరి ఆలయాన్ని సందర్శించడానికి వచ్చాను. బుధవారం నిర్వహించే యజ్ఞం సన్నాహాలను చూసుకోవడానికి మా గురుదేవ్ జీ సూచనల మేరకు నేను ఇక్కడకు వచ్చాను. అకస్మాత్తుగా ఒక గుంపు వచ్చి నాపై దాడి చేసి నా వాహనాన్ని ధ్వంసం చేసింది. వారు అరిచారు.” అని వాహనం దెబ్బతిన్న జితేంద్ర కౌశిక్ అన్నారు.
Also Read
- Virat Kohli: SRH మ్యాచ్కు ముందు కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఈ స్థితికి కారణం వారే అంటూ..
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు పండగలాంటి న్యూస్.. ఇకపై నిమిషాల్లోనే జేబుల్లోకి క్యాష్!
- Bank Licence Cancelled: ఆ బ్యాంక్కు బిగ్ షాక్ ఇచ్చిన ఆర్బీఐ.. లైసెన్స్ రద్దు.. ఖాతాదారుల పరిస్థితి ఏంటి..?
- PM Modi: భారత్-నార్వే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాయి.. ఉగ్రవాదం విషయంలో రాజీపడబోమన్న మోడీ
ఈ ఘటనపై స్థానికులు నిరసనకు దిగారు. ఇంతలో, ఆందోళనకారులు దాడికి పాల్పడినట్లు భావిస్తున్న దుకాణాలను ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. సబ్ డివిజనల్ పోలీసు అధికారి నిరుపమ్ దెబ్బర్మ, అదనపు పోలీసు సూపరింటెండెంట్ దేబంజన రాయ్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. ఈ సంఘటన జరిగినప్పుడూ బిప్లబ్ దేబ్ పూర్వీకుల ఇంట్లో లోపల ఎవరూ లేరు. అందుకే ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. దుండగులు బిప్లబ్ దేబ్ ఇంటితో పాటు పక్కనే ఉన్న ఇతర వాహనాలు, బీజేపీ జెండాలను తగులబెట్టారు. సీపీఎం మద్దతుదారులే ఈ హింసాత్మక ఘటనకు పాల్పడ్డారని బీజేపీతో సంబంధమున్న నేతలు పేర్కొంటున్నారు.
Supreme Court: సినిమాలకు వెళ్లేవారికి షాక్.. థియేటర్లలో బయటి ఆహారాలకు అనుమతి లేదని తీర్పు
బిప్లబ్ దేబ్ 1969 నవంబర్ 25న త్రిపురలోని గోమతి జిల్లా రాజధర్ నగర్ గ్రామంలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. అతని తండ్రి హరధన్ దేబ్ స్థానిక జనసంఘ్ నాయకుడు. బిప్లబ్ దేబ్ 1999లో త్రిపురలోని ఉదయపూర్ కళాశాల నుండి గ్రాడ్యుయేషన్ డిగ్రీని పొందారు. ఆ తర్వాత తదుపరి చదువుల కోసం ఢిల్లీ వచ్చారు. ఢిల్లీలో 16 ఏళ్ల పాటు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తగా పనిచేశారు. మధ్యప్రదేశ్ , సాత్నాలతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయన దాదాపు పదేళ్లపాటు సాత్నా బీజేపీ ఎంపీ గణేష్ సింగ్ ప్రైవేట్ సెక్రటరీగా ఉన్నారు. 2014లో బనారస్లో లోక్సభ ఎన్నికల కోసం ప్రధాని మోదీ ప్రచారాన్ని నిర్వహించే పనిని కూడా బిప్లబ్ దేబ్ చేశారు. 2014లో ప్రధాని అయిన తర్వాత మోదీ బిప్లబ్ దేబ్ను ఢిల్లీ నుంచి త్రిపురకు పంపించారు. త్రిపుర రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రెండు సంవత్సరాలలో బిప్లబ్ దేవ్ ఆ రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వచ్చింది. దీంతో గత 25 యేండ్ల వామపక్ష సామ్రాజ్యం అంతమైంది. ఈ అద్భుతమైన విజయం సాధించడంతో కీలక పాత్ర పోషించిన బిప్లబ్ దేబ్కు బీజేపీ బహుమతి ఇచ్చింది.2018లో ఆయనను రాష్ట్ర ముఖ్యమంత్రిని చేసింది.
తాజావార్తలు
-
Virat Kohli: SRH మ్యాచ్కు ముందు కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఈ స్థితికి కారణం వారే అంటూ..
-
Peddi: ‘పెద్ది’కి లైన్ క్లియర్.. పర్సంటేజ్ విధానంపై గుడ్ న్యూస్
-
Hyderabad Water Board : ఏసీబీ దాడుల్లో షాక్.. బయటపడ్డ కోట్ల సామ్రాజ్యం.!
-
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు పండగలాంటి న్యూస్.. ఇకపై నిమిషాల్లోనే జేబుల్లోకి క్యాష్!
-
Cheesy Chicken Sandwich Recipe: నోరూరించే చీజీ ‘చికెన్ శాండ్విచ్’.. బ్రేక్ఫాస్ట్, స్నాక్స్ కోసం ఐదు నిమిషాల్లో ఇలా చేసుకోండి!
ట్రెండింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!