Ambati Rambabu: వైసీపీ నేతలపై కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడమే ప్రభుత్వ లక్ష్యం..
- చంద్రబాబు ప్రభుత్వంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు
- వైసీపీ నేతలపై కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడమే ప్రభుత్వ లక్ష్యం- అంబటి
- బుడమేరు.. కృష్ణానది వరదలను వైసీపీ నేతలపై కక్ష తీర్చుకోవటానికి..
- చంద్రబాబు ఉపయోగించటం దురదృష్టకరం- అంబటి రాంబాబు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చంద్రబాబు ప్రభుత్వంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బుడమేరు, కృష్ణానది వరదలను వైసీపీ నేతలపై కక్ష తీర్చుకోవటానికి చంద్రబాబు ఉపయోగించటం దురదృష్టకరమని ఆరోపించారు. ప్రకాశం బ్యారేజ్ను 3 బోట్లు ఢీకొన్న ఘటనకు వైసీపీ కుట్ర కారణమని చంద్రబాబు అపవాదు వేస్తున్నారని అన్నారు. వైసీపీ నేతలపై కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడమే ప్రభుత్వ లక్ష్యమని అంబటి రాంబాబు పేర్కొన్నారు. గతంలో లేనంత వరద వల్ల ఎగువ నుంచి ప్రవాహంతో వందల బోట్లు కొట్టుకు వచ్చాయి.. దిగువకు చిన్న బోట్లు బ్యారేజ్ నుంచి కిందకి కొట్టుకు పోతే, పెద్దగా ఉన్న 3 బోట్లు మాత్రం బ్యారేజ్ దగ్గర చిక్కుకు పోయాయన్నారు. పోలీసులు ఈ కేసులో అరెస్ట్ చేసిన కోమటి రాము.. టీడీపీ ఎన్నారై విభాగానికి చెందిన కోమటి జయరాం బంధువు అని తెలిపారు.
Read Also: Haryana Polls: లాడ్వాలో ముఖ్యమంత్రి సైనీ నామినేషన్.. హాజరైన కేంద్రమంత్రి ఖట్టర్
Also Read
- Women's World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
- CM Yogi: "ఎవ్వరినీ వదిలి పెట్టను".. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
- Ketan Murder Case: కేతన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఇద్దరు తల్లుల మధ్య మాటల యుద్ధం!
- Bank Fraud: భారీ బ్యాంకు మోసం.. రూ.3.66 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీలను అటాచ్ చేసిన ఈడీ.!
లోకేష్ తో ఫోటో దిగిన ఉషాద్రి కూడా వైసీపీ నేతగా చెబుతున్నారని అంబటి రాంబాబు మండిపడ్డారు. అలాగే.. నందిగామ సురేష్, తలశిల రఘురాం మీద మళ్ళీ కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. జగన్ కు సన్నిహితంగా ఉండే వారిని అరెస్ట్ చేయాలని.. చంద్రబాబు చేసే చౌకబారు ఎత్తుగడలతో మీరే భ్రష్టు పడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు వరద వస్తుందని ముందే హెచ్చరిక చేయాల్సిన ప్రభుత్వం.. ఆ పని చేయలేదని ఆరోపించారు.
Read Also: Kiren Rijiju: వక్ఫ్ బిల్లుపై ముస్లింలను తప్పుదోవ పట్టించేలా జకీర్ నాయక్ ప్రచారం..
కేంద్రంలో బీజేపీ.. ఏపీలో జనసేన అండగా, చంద్రబాబు ఇలా చేయటానికి ప్రధాన కారణం జగన్ అని అంబటి రాంబాబు తెలిపారు. జగన్ అంటే చంద్రబాబుకు భయం.. ఈ ఎన్నికల్లో గెలుపు తమ సొంత గెలుపు కాదని.. అందరిదీ అనే విషయం చంద్రబాబుకి తెలుసన్నారు. జగన్ వెనుక 40 శాతం ఓటు బ్యాంక్ ఉండటంతో వైసీపీని అణిచివేయాలని చంద్రబాబు ఆలోచన అని పేర్కొన్నారు. పడవలకు వేసే సహజ రంగులను వైసీపీకి ముడి పెడుతున్నారని.. వరదలు వచ్చి 10 రోజులు గడుస్తున్న బాధితులకు సాయం అందటం లేదని అంబటి రాంబాబు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Women’s World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
-
CM Yogi: “ఎవ్వరినీ వదిలి పెట్టను”.. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
-
RC17 Update: రామ్ చరణ్ కెరీర్లోనే తొలిసారి.. సుక్కు మాస్టర్ ప్లాన్ మాములుగా లేదుగా!
-
Oppo Reno 16 Series: ఒప్పో రెనో 16 సిరీస్ రిలీజ్.. 7000mAh బ్యాటరీ, 50MP కెమెరా, కొత్త మ్యాగ్నెటిక్ డిస్ప్లే
-
Ketan Murder Case: కేతన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఇద్దరు తల్లుల మధ్య మాటల యుద్ధం!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!