Kiren Rijiju: వక్ఫ్ బిల్లుపై ముస్లింలను తప్పుదోవ పట్టించేలా జకీర్ నాయక్ ప్రచారం..
- ముస్లింలను తప్పుదోవ పట్టించేలా జకీర్ నాయక్ వ్యాఖ్యలు..
- వక్ఫ్ బిల్లుపై అనవసర వ్యాఖ్యలు..
- జకీర్ నాయక్పై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ఫైర్..
Kiren Rijiju: పరారీలో ఉన్న ఇస్లామిక్ బోధకుడు జకీర్ నాయక్ భారతీయ ముస్లింలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని, వక్ఫ్ సవరణ బిల్లుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. వివాదాస్పద బోధకుడు వక్ఫ్ బిల్లు ‘‘చెడు పరిణామాలను’’ కలిగిస్తుందని, ముస్లింలు ఈ బిల్లుని తిరస్కరిస్తున్నట్లు బిల్లుని పరిశీలిస్తున్న ‘‘ జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)’’ సందేశాలు పంపాలని ఆయన పిలుపునిచ్చాడు. ఆన్లైన్ పిటిషన్కి క్యూఆర్ కోడ్, యూఆర్ఎల్ని షేర్ చేస్తూ, కనీసం 5 మిలియన్ల భారతీయ ముస్లింలు తమ తిరస్కరణలను సెప్టెంబర్ 13తోపు పంపాలని అన్నారు.
Read Also: IC814 hijack: హైజాక్ విమానంలో అత్యంత కీలకమైన వ్యక్తి.. గుర్తించని ఉగ్రవాదులు.. అతను ఎవరంటే..?
Also Read
- High Voltage Drama: ప్రియుడిపై ప్రేమ.. టవర్పై డ్రామా! సినిమాను మించిన సీన్ చూపించిన మైనర్ బాలిక..
- Judge Suicide: ఢిల్లీలో న్యాయమూర్తి ఆత్మహత్య.. బాత్రూంలో మృతదేహం..
- Central Govt: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. బీమా రంగంలోనే సంచలనం..
- Nashik TCS Case: టీసీఎస్ నాసిక్ నిందితురాలు నిదా ఖాన్కు షాక్..
కేంద్రమంత్రి కిరణ్ రిజిజు జకీర్ నాయక్ ఆన్లైన్ పోస్ట్ని తప్పుదోవ పట్టించేవిగా, తప్పుడు ప్రచారమని పేర్కొన్నారు. ‘‘ దయచేసి మన దేశం వెలుపల ఉన్న అమాయక ముస్లింలను తప్పుదారి పట్టించొద్దు. భారతదేశ ప్రజాస్వామ్య దేశం, ప్రజలు వారి సొంత అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. తప్పుడు ప్రచారం తప్పుడు కథనాలకు దారి తీస్తుంది’’ అని కేంద్ర మంత్రి అన్నారు.
మనీలాండరింగ్, ద్వేషపూరిత ప్రసంగాల ఆరోపణలపై భారతదేశంలో వాంటెడ్ అయిన జకీర్ నాయక్ 2016లో దేశం విడిచి పారిపోయాడు. వక్ఫ్ సవరణ బిల్లు ద్వారా వక్ఫ్ బోర్డు అపరిమిత అధికారాలకు అడ్డుకట్ట వేయాలని కేంద్రం భావించింది. ఈ నేపథ్యంలోనే వక్ఫ్ సవరణ బిల్లుని తీసుకువచ్చింది. ఇందుల్లో ముస్లిమేతర, ఒక కేంద్ర మంత్రి, ముగ్గురు ఎంపీలు, సీనియర్ ఐఏఎస్ అధికారులు వక్ఫ్ బోర్డులో చేర్చడంతో పాటు మహిళలకు చోటు కల్పించారు. అయితే, ఈ బిల్లుని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించాయి. ఇది మత స్వేచ్ఛని, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తుందని కాంగ్రెస్ ఆరోపించింది. వక్ఫ్ బోర్డు సవరణల ప్రకారం ప్రభుత్వం సూచించిన విధంగా వితంతువులు, విడాకులు తీసుకున్నవారు, అనాథల సంక్షేమం కోసం అందుకునే సొమ్మును వినియోగించాలి.
తాజావార్తలు
-
Playoff Venues: ఐపీఎల్ ప్లే ఆఫ్ వేదికలపై కీలక అప్డేట్.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్కు చరమగీతం..?
-
Texas Shooting: అమెరికాలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి!
-
NTV Exclusive: సమంత ‘మా ఇంటి బంగారం’ సైలెన్స్ ఎందుకు?
-
MI Vs CSK: నిప్పులు చెరిగిన చెన్నై బౌలర్లు.. పెవిలియన్కు క్యూ కట్టిన ముంబై బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..
-
Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!