Kiren Rijiju: వక్ఫ్ బిల్లుపై ముస్లింలను తప్పుదోవ పట్టించేలా జకీర్ నాయక్ ప్రచారం..
- ముస్లింలను తప్పుదోవ పట్టించేలా జకీర్ నాయక్ వ్యాఖ్యలు..
- వక్ఫ్ బిల్లుపై అనవసర వ్యాఖ్యలు..
- జకీర్ నాయక్పై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kiren Rijiju: పరారీలో ఉన్న ఇస్లామిక్ బోధకుడు జకీర్ నాయక్ భారతీయ ముస్లింలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని, వక్ఫ్ సవరణ బిల్లుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. వివాదాస్పద బోధకుడు వక్ఫ్ బిల్లు ‘‘చెడు పరిణామాలను’’ కలిగిస్తుందని, ముస్లింలు ఈ బిల్లుని తిరస్కరిస్తున్నట్లు బిల్లుని పరిశీలిస్తున్న ‘‘ జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)’’ సందేశాలు పంపాలని ఆయన పిలుపునిచ్చాడు. ఆన్లైన్ పిటిషన్కి క్యూఆర్ కోడ్, యూఆర్ఎల్ని షేర్ చేస్తూ, కనీసం 5 మిలియన్ల భారతీయ ముస్లింలు తమ తిరస్కరణలను సెప్టెంబర్ 13తోపు పంపాలని అన్నారు.
Read Also: IC814 hijack: హైజాక్ విమానంలో అత్యంత కీలకమైన వ్యక్తి.. గుర్తించని ఉగ్రవాదులు.. అతను ఎవరంటే..?
Also Read
- Cabinet: అహ్మదాబాద్ మెట్రో విస్తరణ, అమరావతిలో సెంట్రల్ కాంప్లెక్స్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
- Congress-TMC: కాంగ్రెస్లో విలీనం దిశగా టీఎంసీ.. సోనియా, రాహుల్తో మమత, అభిషేక్ వరుస భేటీలు! ఏం జరుగుతోంది!?
- Modi-Meloni: ఇటీవల రోమ్లో కలవడం ఆనందంగా ఉంది.. మోడీ రికార్డ్పై మెలోని అభినందనలు
- Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
కేంద్రమంత్రి కిరణ్ రిజిజు జకీర్ నాయక్ ఆన్లైన్ పోస్ట్ని తప్పుదోవ పట్టించేవిగా, తప్పుడు ప్రచారమని పేర్కొన్నారు. ‘‘ దయచేసి మన దేశం వెలుపల ఉన్న అమాయక ముస్లింలను తప్పుదారి పట్టించొద్దు. భారతదేశ ప్రజాస్వామ్య దేశం, ప్రజలు వారి సొంత అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. తప్పుడు ప్రచారం తప్పుడు కథనాలకు దారి తీస్తుంది’’ అని కేంద్ర మంత్రి అన్నారు.
మనీలాండరింగ్, ద్వేషపూరిత ప్రసంగాల ఆరోపణలపై భారతదేశంలో వాంటెడ్ అయిన జకీర్ నాయక్ 2016లో దేశం విడిచి పారిపోయాడు. వక్ఫ్ సవరణ బిల్లు ద్వారా వక్ఫ్ బోర్డు అపరిమిత అధికారాలకు అడ్డుకట్ట వేయాలని కేంద్రం భావించింది. ఈ నేపథ్యంలోనే వక్ఫ్ సవరణ బిల్లుని తీసుకువచ్చింది. ఇందుల్లో ముస్లిమేతర, ఒక కేంద్ర మంత్రి, ముగ్గురు ఎంపీలు, సీనియర్ ఐఏఎస్ అధికారులు వక్ఫ్ బోర్డులో చేర్చడంతో పాటు మహిళలకు చోటు కల్పించారు. అయితే, ఈ బిల్లుని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించాయి. ఇది మత స్వేచ్ఛని, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తుందని కాంగ్రెస్ ఆరోపించింది. వక్ఫ్ బోర్డు సవరణల ప్రకారం ప్రభుత్వం సూచించిన విధంగా వితంతువులు, విడాకులు తీసుకున్నవారు, అనాథల సంక్షేమం కోసం అందుకునే సొమ్మును వినియోగించాలి.
తాజావార్తలు
-
Begger Role Movies: కోలీవుడ్ హీరోల ‘బిచ్చగాడు’ సెంటిమెంట్ పూరీకి ప్లస్సేనా?
-
Cabinet: అహ్మదాబాద్ మెట్రో విస్తరణ, అమరావతిలో సెంట్రల్ కాంప్లెక్స్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
-
Congress-TMC: కాంగ్రెస్లో విలీనం దిశగా టీఎంసీ.. సోనియా, రాహుల్తో మమత, అభిషేక్ వరుస భేటీలు! ఏం జరుగుతోంది!?
-
Heavy Rain and Thunderstorms: రెడ్ అలర్ట్.. రాబోయే 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం..!
-
Lenin: అఖిల్ కోసం తిరుపతి వస్తున్న యంగ్ టైగర్.. ‘లెనిన్’ ఈవెంట్కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!