Kiren Rijiju: వక్ఫ్ బిల్లుపై ముస్లింలను తప్పుదోవ పట్టించేలా జకీర్ నాయక్ ప్రచారం..
- ముస్లింలను తప్పుదోవ పట్టించేలా జకీర్ నాయక్ వ్యాఖ్యలు..
- వక్ఫ్ బిల్లుపై అనవసర వ్యాఖ్యలు..
- జకీర్ నాయక్పై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kiren Rijiju: పరారీలో ఉన్న ఇస్లామిక్ బోధకుడు జకీర్ నాయక్ భారతీయ ముస్లింలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని, వక్ఫ్ సవరణ బిల్లుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. వివాదాస్పద బోధకుడు వక్ఫ్ బిల్లు ‘‘చెడు పరిణామాలను’’ కలిగిస్తుందని, ముస్లింలు ఈ బిల్లుని తిరస్కరిస్తున్నట్లు బిల్లుని పరిశీలిస్తున్న ‘‘ జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)’’ సందేశాలు పంపాలని ఆయన పిలుపునిచ్చాడు. ఆన్లైన్ పిటిషన్కి క్యూఆర్ కోడ్, యూఆర్ఎల్ని షేర్ చేస్తూ, కనీసం 5 మిలియన్ల భారతీయ ముస్లింలు తమ తిరస్కరణలను సెప్టెంబర్ 13తోపు పంపాలని అన్నారు.
Read Also: IC814 hijack: హైజాక్ విమానంలో అత్యంత కీలకమైన వ్యక్తి.. గుర్తించని ఉగ్రవాదులు.. అతను ఎవరంటే..?
Also Read
- Mamata Banerjee-EC: మమతా బెనర్జీకి ఈసీ లేఖ.. 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
- Maharashtra: ఆర్టీఐలో మార్పులు.. అన్నాహజారే హెచ్చరికతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
- Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
కేంద్రమంత్రి కిరణ్ రిజిజు జకీర్ నాయక్ ఆన్లైన్ పోస్ట్ని తప్పుదోవ పట్టించేవిగా, తప్పుడు ప్రచారమని పేర్కొన్నారు. ‘‘ దయచేసి మన దేశం వెలుపల ఉన్న అమాయక ముస్లింలను తప్పుదారి పట్టించొద్దు. భారతదేశ ప్రజాస్వామ్య దేశం, ప్రజలు వారి సొంత అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. తప్పుడు ప్రచారం తప్పుడు కథనాలకు దారి తీస్తుంది’’ అని కేంద్ర మంత్రి అన్నారు.
మనీలాండరింగ్, ద్వేషపూరిత ప్రసంగాల ఆరోపణలపై భారతదేశంలో వాంటెడ్ అయిన జకీర్ నాయక్ 2016లో దేశం విడిచి పారిపోయాడు. వక్ఫ్ సవరణ బిల్లు ద్వారా వక్ఫ్ బోర్డు అపరిమిత అధికారాలకు అడ్డుకట్ట వేయాలని కేంద్రం భావించింది. ఈ నేపథ్యంలోనే వక్ఫ్ సవరణ బిల్లుని తీసుకువచ్చింది. ఇందుల్లో ముస్లిమేతర, ఒక కేంద్ర మంత్రి, ముగ్గురు ఎంపీలు, సీనియర్ ఐఏఎస్ అధికారులు వక్ఫ్ బోర్డులో చేర్చడంతో పాటు మహిళలకు చోటు కల్పించారు. అయితే, ఈ బిల్లుని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించాయి. ఇది మత స్వేచ్ఛని, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తుందని కాంగ్రెస్ ఆరోపించింది. వక్ఫ్ బోర్డు సవరణల ప్రకారం ప్రభుత్వం సూచించిన విధంగా వితంతువులు, విడాకులు తీసుకున్నవారు, అనాథల సంక్షేమం కోసం అందుకునే సొమ్మును వినియోగించాలి.
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!