Bank Fraud: భారీ బ్యాంకు మోసం.. రూ.3.66 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీలను అటాచ్ చేసిన ఈడీ.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bank Fraud: బ్యాంకు మోసం కేసులో దర్యాప్తు కొనసాగిస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) మరో కీలక చర్య చేపట్టింది. భోపాల్ జోనల్ కార్యాలయం అధికారులు, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA), 2002 కింద సుమారు రూ.3.66 కోట్ల విలువైన రెండు ఇన్వెస్ట్మెంట్ లింక్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలను తాత్కాలికంగా అటాచ్ చేశారు.
ఈ కేసు M/S అడ్వాంటేజ్ ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ (AOPL), దాని ప్రమోటర్ శ్రీకాంత్ భాసికి సంబంధించినది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)కు రూ.1,266.63 కోట్ల నష్టం కలిగించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ సంస్థపై సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. దర్యాప్తులో భాగంగా AOPL, దాని ప్రమోటర్లు నకిలీ మెర్చంటింగ్ ట్రేడ్ లావాదేవీలు, సర్క్యులర్ ట్రేడింగ్, వాణిజ్య పత్రాల ఫోర్జరీ, బ్యాంకు నిధుల మళ్లింపు ద్వారా మోసపూరితంగా బ్యాంకింగ్ సదుపాయాలు పొందినట్లు ఈడీ గుర్తించింది. ఈ అక్రమాల ద్వారా వచ్చిన నిధులను వివిధ దేశీయ, విదేశీ సంస్థల ద్వారా మళ్లించినట్లు అధికారులు వెల్లడించారు.
Also Read
- Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
- NASA: అంగారక గ్రహంపై ఏలియన్ 'జెల్లీఫిష్' కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
- Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
- T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ఈడీ దర్యాప్తులో భాగంగా శ్రీకాంత్ భాసి పేరుతో జ్యూరిచ్ ఇంటర్నేషనల్ లైఫ్ లిమిటెడ్లో నిర్వహిస్తున్న రెండు ఇన్వెస్ట్మెంట్ లింక్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు గుర్తించబడ్డాయి. ఈ పాలసీలు నేరం జరిగిన కాలంలోనే కొనుగోలు చేయబడినట్లు, విదేశీ ఖాతాలు మరియు భాసికి సంబంధించిన సంస్థల ద్వారా నిధులు సమకూర్చినట్లు దర్యాప్తులో తేలింది. అంతేకాకుండా, 2026 ఏప్రిల్ నెలలో శ్రీకాంత్ భాసి ఈ రెండు పాలసీలను సరెండర్ చేయాలని కోరుతూ, వాటి ద్వారా వచ్చే మొత్తాన్ని భారతదేశంలోని తన బ్యాంకు ఖాతాకు బదిలీ చేయాలని అభ్యర్థించినట్లు ఈడీ వెల్లడించింది.
నేరం ద్వారా సంపాదించిన ఆస్తులు ఇతరత్రా మళ్లించే అవకాశం ఉందని భావించిన ఈడీ.. PMLA చట్టంలోని సెక్షన్ 5(1) కింద ఈ రెండు పాలసీలను తాత్కాలికంగా అటాచ్ చేసింది. వీటి మొత్తం సరెండర్ విలువ సుమారు రూ.3.66 కోట్లుగా ఉందని తెలిపింది. ఈ కేసులో గతంలో కూడా ఈడీ కీలక చర్యలు చేపట్టింది. దుబాయ్లో ఉన్న సుమారు రూ.51.70 కోట్ల విలువైన తొమ్మిది స్థిరాస్తులను, అలాగే భారత్లో సుమారు రూ.111 కోట్ల విలువైన ఆస్తులను తాత్కాలికంగా అటాచ్ చేసినట్లు వెల్లడించింది. నేరం ద్వారా సంపాదించిన ఆస్తులను గుర్తించడం, స్వాధీనం చేసుకోవడం లక్ష్యంగా ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని ఈడీ పేర్కొంది. మరిన్ని ఆస్తులపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందని అధికారులు సూచించారు.
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!