Etela Rajender: గజ్వేల్ ప్రజల అండదండలతో కేసీఆర్ తో కొట్లాడుతా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గజ్వేల్ నియోజకవర్గంలో హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. గజ్వేల్ నాకు కొత్త కాదు..మీతో నాకు 20 ఏళ్ల అనుబంధం ఉంది.. నేను గజ్వేల్ వచ్చింది నాకు నియోజకవర్గం లేక కాదు.. 20 సంవత్సరాలు నాతో పని చేయించుకుని నా మెడలు పట్టుకుని బయటికి గెంటేశారు అని ఆయన ఆరోపించారు. 2017లో మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తే 1700 మంది ఉద్యోగాలు తీసేశారు.. ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటే కనికరం కూడా లేదు.. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు అని సీఎం కేసీఆర్ అన్నారు అనే విషయాన్ని ఈటెల రాజేందర్ గుర్తు చేశారు.
Read Also: Qatar: 8 మంది మాజీ ఇండియన్ నేవీ సిబ్బందికి మరణశిక్ష విధించిన ఖతార్..
Also Read
- Terror Plot: ఢిల్లీ, పంజాబ్లో భారీ దాడులకు కుట్ర.. పాక్ పన్నాగం విఫలం..
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ కోసం రూ.30 కోట్లు.. నేనంటే నేను అంటూ తీవ్ర పోటీ..
- BrahMos Missile: భారత్ బ్రహ్మోస్ క్షిపణులతో గ్రీస్ ఒప్పందం..! టర్కీలో భయాందోళనలు
- Putin: కజకిస్థాన్లో పుతిన్ పర్యటన.. అణు విద్యుత్ శక్తిపై కీలక ఒప్పందం
హుజురాబాద్ ఉప ఎన్నికలో నన్ను ఎన్నో ఇబ్బందులు పెట్టారు అని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తెలిపారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి వేల కట్టిన చరిత్ర కేసీఆర్ ది.. నా దగ్గర ఉన్న మనుషులను కోవర్టు, ఇన్ ఫార్మర్లుగా మార్చుకున్నారు అని ఆయన ఆరోపించారు. హుజురాబాద్ ఎన్నికల్లో ఎవరికి ఏం కావాలో అన్ని చేశారు సీఎం కేసీఆర్.. అన్ని పనులు చేయించుకున్నారు కానీ ఓటు మాత్రం నాకే వేశారు.. డబుల్ బెడ్ రూమ్ లు, దళిత బంధు, బీసీ బంధు అన్ని పథకాలు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే ఇస్తున్నారు అని అన్నారు. తాగుబోతులలో దేశంలో నంబర్ 1 స్థానానికి తెలంగాణ చేరింది అని ఈటెల రాజేందర్ విమర్శించారు.
Read Also: ENG vs SL: శ్రీలంకతో కీలక మ్యాచ్.. 156 పరుగులకే ఇంగ్లాండ్ ఆలౌట్
తెలంగాణ పల్లెల్లో కేసీఆర్ లిక్కర్ రాజ్యమేలుతోంది అని ఈటెల రాజేందర్ ధ్వజమెత్తారు. నాకు జీవితమంటూ ఉంటే కేసీఆర్ పై పోటీ చేస్తా అని ఆనాడే చెప్పిన.. నేను గజ్వేల్ కి ఏమిస్తానో తెలియదు కాని నా వల్ల మీ అందరి విలువ పెరిగింది.. నేను కేసీఆర్ తో పైసల్లో పోటీ పడకపోవచ్చు.. నేను బక్క పలుచని వ్యక్తినే.. గజ్వేల్ ప్రజల అండ, ధర్మం, న్యాయంతో కేసీఆర్ తో కొట్లాడుతాను అని బీజేపీ ఎమ్మెల్యే అన్నారు. బీజేపీ ప్రభుత్వం వస్తే వందల ఎకరాల భూమి ఉన్న వాళ్ళకి, మామిడి తోటలు పెట్టె రైతులకు, ఇన్కమ్ టాక్స్ కట్టే వాళ్ళకి రైతు బంధు బంద్ చేస్తామని ఆయన తెలిపారు. రైతు కూలి చనిపోతే మేం 5 లక్షల భీమా ఇస్తాం.. గజ్వేల్ కి పట్టిన పీడ పోవాలంటే ఓటే మన ఆయుధం అని ఈటెల రాజేందర్ పిలుపునిచ్చారు.
- Tags
- bjp
- BRS
- cm kcr
- Etela Rajender
- gajwel
తాజావార్తలు
-
Terror Plot: ఢిల్లీ, పంజాబ్లో భారీ దాడులకు కుట్ర.. పాక్ పన్నాగం విఫలం..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ కోసం రూ.30 కోట్లు.. నేనంటే నేను అంటూ తీవ్ర పోటీ..
-
BrahMos Missile: భారత్ బ్రహ్మోస్ క్షిపణులతో గ్రీస్ ఒప్పందం..! టర్కీలో భయాందోళనలు
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
Putin: కజకిస్థాన్లో పుతిన్ పర్యటన.. అణు విద్యుత్ శక్తిపై కీలక ఒప్పందం
ట్రెండింగ్
-
భారత్లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!
-
Dondakaya Roti Pachadi: పల్లీల స్పెషల్ టచ్తో ‘దొండకాయ రోటి పచ్చడి’.. టేస్ట్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారంతే.!
-
144Hz OLED డిస్ప్లే, 7500mAh బ్యాటరీతో గేమింగ్ మాన్స్టర్ REDMAGIC 11S Pro గ్లోబల్ లాంచ్.!
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!