Etela Rajender : సొంత ఎజెండాతో పత్రికలు రాతలు రాయడం సరికాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో రోజు రోజుకు పార్టీల్లో చేరికలు జోరు పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ బీజేపీ గూటికి మాజీమంత్రులు కృష్ణ యాదవ్, చిత్తరంజన్ చేరారు. ఈ రోజు రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో వీరి చేరిక కార్యక్రమం జరిగింది. చిత్తరంజన్ దాస్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మరో కీలక నేత కృష్ణ యాదవ్ కు ఈటల రాజేందర్ బీజేపీ కుండువా కప్పారు. సిర్పూర్ కాగజ్ నగర్ జడ్పీటీసీ రేఖ సత్యనారాయణ కూడా ఈ రోజు పార్టీలో చేరగా.. డీకే అరుణ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. బీజేపీ చేరిన నాయకులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
Also Read : Rk Roja: సీఎం జగన్ ను విమర్శిస్తే.. మర్యాద దక్కదు బ్రాహ్మణి..?
Also Read
ఎన్టీఆర్ మీద సంచలనం సృష్టించి గెలిచిన బీజేపీ చేరిన సందర్భంగా చిత్తరంజన్ దాస్ కి శుభాకాంక్షలు తెలిపారు. పని గట్టుకొని కొంత మంది విష ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. సొంత ఎజెండాతో పత్రికలు రాతలు రాయడం సరికాదని ఆయన హితవు పలికారు. బీఅర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ అని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. ఖమ్మం లో సీనియర్ నాయకులు బీజేపీ లో చేరేందుకు సిద్దంగా ఉన్నారని ఆయన వెల్లడించారు. ఖమ్మం బహిరంగ సభలో 11మంది నాయకులు జాయిన్ అయ్యారని, ఇంకా పెద్ద మొత్తంలో పార్టీలో చేరేందుకు రెడీగా ఉన్నట్టు ఈటల వ్యాఖ్యానించారు. వీరంతా ఈరోజు కిషన్ రెడ్డి ని కలుస్తారని ఆయన పేర్కొన్నారు.
Also Read : Rakshasa Kavyam: అరడజను సినిమాలు.. వెనక్కి తగ్గి అక్టోబర్ 13న “రాక్షస కావ్యం”
తాజావార్తలు
-
Fed Interest Rate Hike: అమెరికా ఫెడ్ కీలక నిర్ణయం.. వడ్డీ రేట్లలో 0.25% పెంపు.. భారత్పై ప్రభావం ఎంత?
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
IND vs AFG 3rd T20I: నేడే మూడో టీ20.. వైభవ్, ఠాకూర్కు ఛాన్స్.. స్టార్ ప్లేయర్లకు షాక్.. ప్లేయింగ్ 11 ఇదే!
-
iQOO Pad Ultra: iQOO ప్యాడ్ అల్ట్రా లాంచ్ డేట్ ఫిక్స్.. 8.8-అంగుళాల డిస్ప్లే, PC-గ్రేడ్ కూలింగ్ ఫ్యాన్!
-
Road Accident: టిప్పర్ లారీ బీభత్సం.. తండ్రి కూతురు మృతి..!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!