Errabelli Dayakar Rao : మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నదే నా సంకల్పం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జనగామ జిల్లాలోని వీఆర్ఏల రెగ్యులరైజేషన్ తో పాటు, వారిని వివిధ శాఖలకు కేటాయించిన ఆర్డర్స్ ను ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డితో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నదే నా సంకల్పమన్నారు. వారి కుటుంబాలను వారే సాదుకునే స్థాయికి రావాలని, మహిళలు బాగుపడితే దేశం బాగుపడుతుందన్నారు. మహిళలు సైనికుల్లా పని చేయాలన్నారు మంత్రి ఎర్రబెల్లి. సీఎ కేసీఆర్ ఆధ్వర్యంలోనే మహిళలకు మహర్దశ అని ఆయన వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే.. పాలకుర్తి నియోజకవర్గంలో ఎర్రబెల్లి ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాలను సందర్శించి, పరిశీలించి, శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లు పంపిణీ చేశారు మంత్రి ఎర్రబెల్లి.
Also Read : Bholaa Shankar: పొరపాటున కూడా థియేటర్ విజిట్ కు రావద్దు మెహర్ అన్నా..
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
తమ ఎర్రబెల్లి ట్రస్ట్ తరఫున రాజకీయాలకు అతీతంగా తాను సేవ చేస్తున్నట్లు, తన వద్ద డబ్బులు లేనప్పటికీ, పలువురు స్నేహితుల సహకారంతో వినూత్నంగా, విశేషంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్. పాలకుర్తి నియోజకవర్గంలో యువతకు ఉచితంగా ఎర్రబెల్లి ట్రస్ట్ ద్వారా డ్రైవింగ్ లైసెన్సుల జారీ కార్యక్రమం నిర్వహిస్తుండగా, ఈ రోజు మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూర్ లోని ఆర్అండ్బీ అతిథి గృహంలో తొర్రూరు పట్టణానికి చెందిన 150 మందికి ఉచిత లెర్నింగ్ డ్రైవింగ్ లైసెన్సులను పంపిణీ చేశారు మంత్రి ఎర్రబెల్లి. ఉషా దయాకర్ రావు నేతృత్వంలో నిర్వహిస్తున్న ఎర్రబెల్లి ట్రస్టు వైద్య ఆరోగ్య శిబిరాలతో పాటు కరోనా కష్టకాలంలో నిరుపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ, ఉచిత శిక్షణ ఉచితంగా కుట్టు మిషన్ల పంపిణీ, ఉపాధి హామీ కూలీలకు లంచ్ బాక్సుల పంపిణీ, నిరుద్యోగ యువతకు ఉచిత ఉపాధి, ఉద్యోగ శిక్షణ, తాజాగా యువతకు డ్రైవింగ్ లైసెన్సుల పంపిణీ వంటి పలు కార్యక్రమాలను దిగ్విజయంగా చేపట్టినట్లు మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు.
Also Read : Russia-Ukraine War: మాస్కోలో విమానాల రాకపోకలు నిలిపివేత.. ఎందుకంటే?
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!