Site icon NTV Telugu

Bombay High Court: మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నారనే కారణంతో విడాకులు కోరకూడదు..

Bombay High Court

Bombay High Court

Bombay High Court: తన జీవిత భాగస్వామి మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నారనే కారణంతో హిందూ వివాహ చట్టం, 1955 ప్రకారం ఏ వ్యక్తి విడాకులు కోరకూడదని బాంబే హైకోర్టు ఒక ముఖ్యమైన తీర్పులో పేర్కొంది. తన భార్య మూర్ఛ వ్యాధితో బాధపడుతోందని, తనకు నయంకాని వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయిందని పేర్కొన్న వ్యక్తికి విడాకులు ఇవ్వడానికి నిరాకరించిన 2016 ఫ్యామిలీ కోర్టు తీర్పును సమర్థిస్తూ జస్టిస్ వినయ్ జోషి, జస్టిస్‌ ఎస్‌ఏ మెనెజెస్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది. మూర్ఛ వ్యాధి కారణంగా తన భార్య అసాధారణంగా ప్రవర్తించిందని, ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిందని, దీంతో వివాహబంధం విచ్ఛిన్నమైందని భర్త ఆరోపించాడు. అయితే ఈ ఆరోపణలతో హైకోర్టు ఏకీభవించలేదు. ‘మూర్ఛ వ్యాధి’ అనేది నయం చేయలేని వ్యాధి కాదు, హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 13(1)(iii) ప్రకారం దీనిని మానసిక రుగ్మతగా పరిగణించలేమని న్యాయమూర్తులు తెలిపారు.

Also Read: Birhor Community: చెల్లెలికి అమ్మగా మారిన ఐదేళ్ల బాలిక.. ఈ అడవి బిడ్డల దీనగాథ కంటతడి పెట్టిస్తోంది!

ఈ విషయంలో బెంచ్ రఘునాథ్ గోపాల్ దఫ్తార్దార్ వర్సెస్ విజయ రఘునాథ్ దఫ్తార్దార్ కేసులో సింగిల్ జడ్జి పరిశీలనలపై ఆధారపడింది.ఇది ఇలాంటి కేసు కానప్పటికీ, ప్రస్తుత కేసుకు వర్తించే రీజనింగ్‌ను ఇచ్చామని డివిజన్ బెంచ్ తెలిపింది. భార్యాభర్తలు కలిసి జీవించడానికి ఇలాంటి వైద్య పరిస్థితి అడ్డంకి కాదనేదానికి పుష్కలమైన వైద్య ఆధారాలు ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది.”తదనుగుణంగా భార్య మూర్ఛ వ్యాధితో బాధపడుతుందని నిరూపించడంలో భర్త విఫలమయ్యాడని లేదా ఆమె అలాంటి పరిస్థితితో బాధపడుతుంటే, విడాకుల డిక్రీని క్లెయిమ్ చేయడంలో సెక్షన్ 13(1)(iii) చట్టం ప్రకారం పరిగణించవచ్చు.” అని ధర్మాసనం వెల్లడించింది.

Also Read: Pakistan: పాకిస్తాన్‌లో బాంబు పేలుడు.. పిల్లలు ఆడుకుంటుండగా ఘటన..

వైద్యపరమైన ఆధారాల ప్రకారం మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న ప్రతి వ్యక్తి సాధారణ జీవితాన్ని గడపవచ్చని హైకోర్టు పేర్కొంది. ప్రస్తుత కేసులో ఉన్న మహిళ మూర్ఛ వ్యాధితో బాధపడలేదని వైద్య ఆధారాలు సూచిస్తున్నాయి. “అలాంటి వైద్య పరిస్థితి భార్యాభర్తలు కలిసి జీవించడానికి అవరోధంగా ఉంటుందని పిటిషనర్ వైఖరిని సమర్థించలేమని, వైద్యపరమైన ఆధారాలు పుష్కలంగా ఉన్నాయని మేము అభిప్రాయపడుతున్నాము” అని కోర్టు పేర్కొంది. భర్త తరపున న్యాయవాది విశ్వదీప్ మేటి వాదనలు వినిపించారు. భార్య తరఫు న్యాయవాది జ్యోతి ధర్మాధికారి వాదించారు.

 

Exit mobile version