2025-26 Academic: ఇంజనీరింగ్ ఫీజుల పెంపు ఇంకా అనిశ్చితమే.. తుది నిర్ణయం పెండింగ్లో
- ఇంజనీరింగ్ ఫీజుల పెంపుపై ఇంకా రాని స్పష్టత
- ప్రైవేట్ కాలేజీల ప్రతిపాదనలు
- విద్యార్థులపై పెరుగుతున్న భారం
2025-26 Academic: తెలంగాణలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల వార్షిక ఫీజుల పెంపుపై స్పష్టత ఇంకా రాలేదు. 2025–26 విద్యా సంవత్సరం నుంచి వచ్చే మూడు సంవత్సరాల పాటు ఫీజులను నిర్ణయించేందుకు టీఏఎఫ్ఆర్సీ (తెలంగాణ అడ్మిషన్లు & ఫీజులు నియంత్రణ కమిటీ) అనేక సార్లు సమావేశమైనా, ఇప్పటికీ తుది నిర్ణయం తీసుకోలేకపోయింది. ప్రైవేట్ కాలేజీలు ఆడిట్ నివేదికలను తమ అనుకూలంగా రూపొందించారని ఆరోపణల నేపథ్యంలో, విద్యాశాఖ , ఉన్నత విద్యామండలి ప్రత్యేకంగా సమీక్ష సమావేశాలు నిర్వహించాయి. అయితే ఫీజుల ఖరారుపై నిర్ణయం మళ్లీ వాయిదా పడింది. మార్చి నెలలో నిర్వహించిన హియరింగ్లో కొన్ని కాలేజీలు మాత్రమే టీఏఎఫ్ఆర్సీ ప్రతిపాదనలకు అంగీకారం తెలిపాయి. మిగిలినవి విరుద్ధంగా స్పందించాయి.
విద్యా నాణ్యతపై సందేహాలు ఉన్నా కూడా కొన్నికాలేజీలు తమ ఫీజులను రూ.1.5 లక్షల నుంచి రూ.2.5 లక్షలకు పెంచాలని ప్రతిపాదించాయి. దీని ప్రకారం, మూడు సంవత్సరాల్లో ఒక విద్యార్థికి రూ.5 లక్షల వరకు చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది తల్లిదండ్రులకు, ప్రభుత్వానికి పెద్ద భారం అవుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇంజనీరింగ్ సీట్ల పెంపు, కోర్సుల విలీనంపై తుది నిర్ణయం ప్రభుత్వాధీనమేనని హైకోర్టు తాజాగా స్పష్టం చేసింది. అందులో భాగంగా, ప్రభుత్వం ఫీజు వ్యవహారాన్ని పునః సమీక్షిస్తోంది. కొన్నికాలేజీలు ప్రతిపాదించిన పెంపు శాతాలు ఏకంగా 70% వరకు ఉండటం అధికారులు ఆశ్చర్యానికి గురిచేసింది.
Also Read
- IRS Officer Daughter Murder: బాధితురాలిని నిందితుడి ఏమని పిలిచేవాడంటే..! పోలీసుల రిపోర్ట్లో సంచలన విషయాలు
- IPL 2026: వరుస పరాజయాలు.. Mumbai Indians ప్లేఆఫ్స్ ఆశలు నిలబెట్టుకోవాలంటే ఇలా ఆడాల్సిందే.!
- Top Heroines : ఆ రెండు భారీ చిత్రాల వల్ల ఆఫర్లు కోల్పోతున్నఇద్దరు హీరోయిన్లు!
- Ragi Papad Recipe: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. "రాగి పాపడాలు" ఈజీగా తయారు చేసుకోండిలా..
1500 కంటే ఎక్కువ సీట్లు కలిగిన కొన్ని కాలేజీలు ఇప్పటికే రూ.24 కోట్లు వరకు వార్షిక ఆదాయం పొందుతుండగా, ఫీజు పెరిగితే ఇది రూ.40 కోట్లకు చేరుతుందని అంచనా. కొన్ని ప్రముఖ కాలేజీలు ఏకంగా రూ.2 లక్షల ఫీజు పెంపును కోరడం మీద అధికారులు తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేశారు. టీఏఎఫ్ఆర్సీ సిఫార్సులను స్వీకరించలేమని కొందరు తేల్చిచెప్పారు. ఫీజు పెంపు 30 శాతాన్ని మించకూడదని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. ప్రస్తుత పరిస్థితుల్లో టీఏఎఫ్ఆర్సీ కొత్త ఫీజు జాబితాను సవరించాల్సి ఉంటుంది. ఆపై మరోసారి సమావేశం నిర్వహించి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు. విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం ఇష్టారీతిగా ఫీజు పెంపుపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధిక ఖర్చుతో ప్రైవేట్ కోర్సులపై మరింత భారం పడుతుందన్న వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
IRS Officer Daughter Murder: బాధితురాలిని నిందితుడి ఏమని పిలిచేవాడంటే..! పోలీసుల రిపోర్ట్లో సంచలన విషయాలు
-
IPL 2026: వరుస పరాజయాలు.. Mumbai Indians ప్లేఆఫ్స్ ఆశలు నిలబెట్టుకోవాలంటే ఇలా ఆడాల్సిందే.!
-
CSK History: సరికొత్త చరిత్ర సృష్టించిన సీఎస్కే.. ఐపీఎల్ చరిత్రలోనే..!
-
Top Heroines : ఆ రెండు భారీ చిత్రాల వల్ల ఆఫర్లు కోల్పోతున్నఇద్దరు హీరోయిన్లు!
-
Ragi Papad Recipe: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. “రాగి పాపడాలు” ఈజీగా తయారు చేసుకోండిలా..
ట్రెండింగ్
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!