2025-26 Academic: ఇంజనీరింగ్ ఫీజుల పెంపు ఇంకా అనిశ్చితమే.. తుది నిర్ణయం పెండింగ్లో
- ఇంజనీరింగ్ ఫీజుల పెంపుపై ఇంకా రాని స్పష్టత
- ప్రైవేట్ కాలేజీల ప్రతిపాదనలు
- విద్యార్థులపై పెరుగుతున్న భారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2025-26 Academic: తెలంగాణలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల వార్షిక ఫీజుల పెంపుపై స్పష్టత ఇంకా రాలేదు. 2025–26 విద్యా సంవత్సరం నుంచి వచ్చే మూడు సంవత్సరాల పాటు ఫీజులను నిర్ణయించేందుకు టీఏఎఫ్ఆర్సీ (తెలంగాణ అడ్మిషన్లు & ఫీజులు నియంత్రణ కమిటీ) అనేక సార్లు సమావేశమైనా, ఇప్పటికీ తుది నిర్ణయం తీసుకోలేకపోయింది. ప్రైవేట్ కాలేజీలు ఆడిట్ నివేదికలను తమ అనుకూలంగా రూపొందించారని ఆరోపణల నేపథ్యంలో, విద్యాశాఖ , ఉన్నత విద్యామండలి ప్రత్యేకంగా సమీక్ష సమావేశాలు నిర్వహించాయి. అయితే ఫీజుల ఖరారుపై నిర్ణయం మళ్లీ వాయిదా పడింది. మార్చి నెలలో నిర్వహించిన హియరింగ్లో కొన్ని కాలేజీలు మాత్రమే టీఏఎఫ్ఆర్సీ ప్రతిపాదనలకు అంగీకారం తెలిపాయి. మిగిలినవి విరుద్ధంగా స్పందించాయి.
విద్యా నాణ్యతపై సందేహాలు ఉన్నా కూడా కొన్నికాలేజీలు తమ ఫీజులను రూ.1.5 లక్షల నుంచి రూ.2.5 లక్షలకు పెంచాలని ప్రతిపాదించాయి. దీని ప్రకారం, మూడు సంవత్సరాల్లో ఒక విద్యార్థికి రూ.5 లక్షల వరకు చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది తల్లిదండ్రులకు, ప్రభుత్వానికి పెద్ద భారం అవుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇంజనీరింగ్ సీట్ల పెంపు, కోర్సుల విలీనంపై తుది నిర్ణయం ప్రభుత్వాధీనమేనని హైకోర్టు తాజాగా స్పష్టం చేసింది. అందులో భాగంగా, ప్రభుత్వం ఫీజు వ్యవహారాన్ని పునః సమీక్షిస్తోంది. కొన్నికాలేజీలు ప్రతిపాదించిన పెంపు శాతాలు ఏకంగా 70% వరకు ఉండటం అధికారులు ఆశ్చర్యానికి గురిచేసింది.
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
1500 కంటే ఎక్కువ సీట్లు కలిగిన కొన్ని కాలేజీలు ఇప్పటికే రూ.24 కోట్లు వరకు వార్షిక ఆదాయం పొందుతుండగా, ఫీజు పెరిగితే ఇది రూ.40 కోట్లకు చేరుతుందని అంచనా. కొన్ని ప్రముఖ కాలేజీలు ఏకంగా రూ.2 లక్షల ఫీజు పెంపును కోరడం మీద అధికారులు తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేశారు. టీఏఎఫ్ఆర్సీ సిఫార్సులను స్వీకరించలేమని కొందరు తేల్చిచెప్పారు. ఫీజు పెంపు 30 శాతాన్ని మించకూడదని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. ప్రస్తుత పరిస్థితుల్లో టీఏఎఫ్ఆర్సీ కొత్త ఫీజు జాబితాను సవరించాల్సి ఉంటుంది. ఆపై మరోసారి సమావేశం నిర్వహించి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు. విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం ఇష్టారీతిగా ఫీజు పెంపుపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధిక ఖర్చుతో ప్రైవేట్ కోర్సులపై మరింత భారం పడుతుందన్న వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!