Rishabh Pant: రిషబ్ పంత్పై నిషేధం పడుతుందా?
- ఆన్-ఫీల్డ్ అంపైర్పై అసహనం
- పంత్పై నిషేధం పడుతుందా?
- పంత్కు కఠిన శిక్ష పడే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా వికెట్ కీపర్, టెస్ట్ టీమ్ వైస్ కెప్టెన్ రిషబ్ పంత్.. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నుంచి ఆంక్షలు ఎదుర్కొనే అవకాశం ఉంది. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య లీడ్స్లో జరుగుతున్న తొలి టెస్ట్ మూడో రోజు ఆన్-ఫీల్డ్ అంపైర్పై అసహనం వ్యక్తం చేసిన కారణంగా.. పంత్పై ఐసీసీ చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. పంత్ రెండు ప్రవర్తనా నియామవళి ఉల్లంఘనలకు పాల్పడినట్లుగా ఐసీసీ తేల్చే అవకాశం ఉంది. ఐసీసీ నియమాలిని ఉల్లంగించినట్లు తేలితే పంత్కు కఠిన శిక్ష పడే అవకాశం ఉంది.
ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 61వ ఓవర్లో మహమ్మద్ సిరాజ్ వేసిన బంతిని హ్యారీ బ్రూక్ బౌండరీకి పంపించాడు. తర్వాత టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్, వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ బంతి మార్చాలని ఆన్-ఫీల్డ్ అంపైర్ పాల్ రీఫెల్ను కోరారు. బంతిని బాల్ గేజ్ ద్వారా పరిశీలించిన అంపైర్.. బాల్ అంతా బాగుందని, ఇంకా ఆడేందుకు అనుకూలంగా ఉందని చెప్పాడు. దాంతో పంత్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ అంపైర్తో వాదించాడు. అంపైర్ ససేమిరా అనడంతో.. బంతిని మైదానంలోకి విసిరి వెళ్లిపోయాడు. అంతేకాదు ఏదో మాట్లాడుతూ వెనక్కి తిరిగాడు. పంత్ ప్రవర్తనపై అప్పుడే వ్యాఖ్యలు కూడా స్పందించారు. ఇది మంచి పద్దతి కాదని కామెంటేటర్ మార్క్ బౌచర్ అన్నాడు.
Also Read
- CM Vijay-Amit shah: నీట్ నుంచి తమిళనాడును మినహాయించండి.. సీఎం విజయ్ విజ్ఞప్తి
- Supreme Court: జంతర్ మంతర్ ఘటనపై సుప్రీం కీలక నిర్ణయం.. జస్టిస్ సుభాష్ రెడ్డి నేతృత్వంలో హైపవర్ ఎంక్వైరీ కమిటీ
- Gold Mine: ఆఫ్రికా దేశంలో ఘోరం.. బంగారు గని కూలి 100 మంది మృతి
- CBSE Three-Language Policy: సీబీఎస్ఈ త్రిభాషా విధానంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. విద్యార్థులకు ఊరట..
Also Read: BCCI-IPL: బెంగళూరు తొక్కిసలాట ఘటన.. బీసీసీఐ కీలక నిర్ణయం!
మైదానంలో ఆన్-ఫీల్డ్ అంపైర్తో గొడవపడినందుకు రిషబ్ పంత్కు రెండు నిబంధనల ఉల్లంఘన కారణంగా శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.8లోని లెవెల్ 1 కింద అంపైర్ నిర్ణయాన్ని వ్యతిరేకించినందుకు.. పంత్ను దోషిగా పరిగణించవచ్చు. క్లాజ్(ఎ), క్లాజ్(హెచ్) కింద అంపైర్ నిర్ణయంపై సుదీర్ఘ చర్చలు జరిపినందుకు చర్యలు తీసుకోవచ్చు. కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.9ను ఉల్లంఘించినందుకు కూడా దోషిగా పరిగణించవచ్చు. ఐసీసీ నుంచి పంత్ ఆంక్షలు ఎదుర్కొనే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది. జరిమానా, హెచ్చరికతో సరిపెడతారా? లేదా మ్యాచ్ బ్యాన్ చేస్తారా? అన్నది చూడాలి.
తాజావార్తలు
-
CM Vijay-Amit shah: నీట్ నుంచి తమిళనాడును మినహాయించండి.. సీఎం విజయ్ విజ్ఞప్తి
-
Supreme Court: జంతర్ మంతర్ ఘటనపై సుప్రీం కీలక నిర్ణయం.. జస్టిస్ సుభాష్ రెడ్డి నేతృత్వంలో హైపవర్ ఎంక్వైరీ కమిటీ
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
Gold Mine: ఆఫ్రికా దేశంలో ఘోరం.. బంగారు గని కూలి 100 మంది మృతి
-
CBSE Three-Language Policy: సీబీఎస్ఈ త్రిభాషా విధానంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. విద్యార్థులకు ఊరట..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!