Tragedy: అంధ తల్లిదండ్రులకు అంతులేని విషాదం.. కొడుకు చనిపోయినా..
- నాగోల్లో అంధ తల్లిదండ్రులకు అంతులేని విషాదం
- కుమారుడు మృతి చెందిన విషయం తెలియని వైనం
- మూడు రోజుల పాటు తిండి..తిప్పలు లేక అవస్థలు
- దుర్వాసన రావడంతో స్థానికుల ఫిర్యాదుతో వెలుగులోకి ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tragedy: కొడుకు చనిపోయిన విషయం తెలియక మూడు రోజుల పాటు అంధకారంలోనే ఉండిపోయారు అంధ తల్లిదండ్రులు. మనసును కలచివేసే ఈ విషాద ఘటన హైదరాబాద్లోని నాగోల్లో చోటుచేసుకుంది. కొడుకు మృతి నాగోల్లో అంధ తల్లిదండ్రులకు అంతులేని విషాదాన్ని మిగిల్చింది. కుమారుడు మృతి చెందిన విషయం తెలియని పరిస్థితిలో మూడు రోజుల పాటు తిండి, తిప్పలు లేక ఆ అంధ వృద్ధ దంపతులు అవస్థలు పడ్డారు. ఆ ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికుల ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కొడుకు మృతి చెందాడు అనే విషయం తెలియని పరిస్థితుల్లో అంధ తల్లిదండ్రులు ఉండగా.. నాగోల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వారికి అండగా నిలిచారు. వారికి స్నానం చేయించి అన్నం పెట్టించారు నాగోల్ సీఐ సూర్య నాయక్. పోస్టుమార్టం కోసం మృతదేహం తరలించారు.
Read Also: Train Accident: ప్యాసింజర్ రైలులో పేలుడు.. కోచ్లో దట్టమైన పొగలు..
Also Read
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకు వీరవిహారం.. బాదుడే బాదుడే.. కేవలం 26 బంతుల్లోనే..
- 9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
- Vaibhav Sooryavanshi: ఫార్మేట్ ఏదైనా ఓకే.. బాదుడు మాత్రం కామన్.. మరో చరిత్ర సృష్టించిన వైభవ్.!
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
నాగోల్ డివిజన్ పరిధిలోని జైపురి కాలనీ బ్లైండ్స్ కాలనీలో నివాసం ఉండే రమణ(65), శాంతకుమారి(60) వృద్ధ దంపతులకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెద్ద కుమారుడు ప్రదీప్ తన కుటుంబ సభ్యులతో మరొక చోట ఉంటుండగా.. చిన్న కుమారుడు ప్రమోద్(30) తల్లిదండ్రులతోనే నివాసం ఉంటున్నాడు. ప్రమోద్కు పెళ్లి అయినా పలు కారణాలతో భార్య వదిలిపెట్టి వెళ్లిపోయింది. ఆ కారణంతో మద్యానికి బానిసయ్యాడు. అటు మద్యానికి బానిసైనప్పటికీ తల్లిదండ్రులకు అండగా ఉంటూ వారిని చూసుకునేవాడు. మద్యం ఎక్కువగా సేవిస్తుండటంతో ఆరోగ్య పూర్తిగా క్షీణించింది. మద్యం మత్తులోనే 3 రోజుల క్రితం ప్రమోద్ చనిపోయాడు. తమ కుమారుడు చనిపోయినట్లుగా ఇంట్లో అంధులైన తల్లిదండ్రులు గుర్తించలేకపోయారు. వృద్దాప్య దశలో ఏమీ చేయలేని స్థితిలో ఆ వృద్ధ దంపతులు ఉండిపోయారు.
Read Also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
ఈ క్రమంలో ఎవరూ అటువైపు చూడకపోవటంతో మృతదేహం కుళ్లిపోయి దుర్వాసన వచ్చింది. దుర్వాసన వస్తుండడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఒకవైపు ఆకలితో, మరోవైపు భరించలేని కంపు వాసనతో దీనావస్థ స్థితిలో ఉన్న వృద్ధ దంపతులను బయటికి తీసుకొచ్చారు. ఆ వృద్ధ దంపతులకు స్నానం చేయించి.. భోజనం ఏర్పాట్లు చేసి మానవత్వం చాటుకున్నారు. అనంతరం వృద్ధులతో మాట్లాడుతూ.. వారి కుటుంబ వివరాలను తెలుసుకొని.. తమ చిన్నకొడుకు ప్రమోద్ చనిపోయాడని వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పెద్ద కొడుకును పిలిపించి వృద్ధ దంపతులను అప్పజెప్పారు.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకు వీరవిహారం.. బాదుడే బాదుడే.. కేవలం 26 బంతుల్లోనే..
-
America Deportations: వలసదారులను నరకంలోకి గెంటేస్తోన్న ట్రంప్ సర్కార్.. అమెరికా భయంకర ముఖం ఇదే!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
Rashmika Mandanna: రీఎంట్రీకి సిద్ధమైన రష్మిక.. త్వరలోనే కెమెరా ముందుకు నేషనల్ క్రష్
-
Vaibhav Sooryavanshi: ఫార్మేట్ ఏదైనా ఓకే.. బాదుడు మాత్రం కామన్.. మరో చరిత్ర సృష్టించిన వైభవ్.!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!