Tragedy: అంధ తల్లిదండ్రులకు అంతులేని విషాదం.. కొడుకు చనిపోయినా..
- నాగోల్లో అంధ తల్లిదండ్రులకు అంతులేని విషాదం
- కుమారుడు మృతి చెందిన విషయం తెలియని వైనం
- మూడు రోజుల పాటు తిండి..తిప్పలు లేక అవస్థలు
- దుర్వాసన రావడంతో స్థానికుల ఫిర్యాదుతో వెలుగులోకి ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tragedy: కొడుకు చనిపోయిన విషయం తెలియక మూడు రోజుల పాటు అంధకారంలోనే ఉండిపోయారు అంధ తల్లిదండ్రులు. మనసును కలచివేసే ఈ విషాద ఘటన హైదరాబాద్లోని నాగోల్లో చోటుచేసుకుంది. కొడుకు మృతి నాగోల్లో అంధ తల్లిదండ్రులకు అంతులేని విషాదాన్ని మిగిల్చింది. కుమారుడు మృతి చెందిన విషయం తెలియని పరిస్థితిలో మూడు రోజుల పాటు తిండి, తిప్పలు లేక ఆ అంధ వృద్ధ దంపతులు అవస్థలు పడ్డారు. ఆ ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికుల ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కొడుకు మృతి చెందాడు అనే విషయం తెలియని పరిస్థితుల్లో అంధ తల్లిదండ్రులు ఉండగా.. నాగోల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వారికి అండగా నిలిచారు. వారికి స్నానం చేయించి అన్నం పెట్టించారు నాగోల్ సీఐ సూర్య నాయక్. పోస్టుమార్టం కోసం మృతదేహం తరలించారు.
Read Also: Train Accident: ప్యాసింజర్ రైలులో పేలుడు.. కోచ్లో దట్టమైన పొగలు..
Also Read
- Rohit Sharma Retirement: బిగ్ షాక్.. సెలక్టర్లకు ఎదురుతిరిగిన రోహిత్ శర్మ.. జైస్వాల్ కోసం గిల్ త్యాగం!
- Amit Shah: 'చికెన్ నెక్' కారిడార్ భద్రతపై అమిత్ షా హై లెవల్ రివ్యూ..
- Kapil Dev: "బాధ ఎందుకు.. పండుగలా సెలబ్రేట్ చేసుకోవాలి".. రోహిత్ రిటైర్మెంట్పై కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు..
- Abhijit Deepke: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. అభిజిత్ దీప్కేపై ఇంక్ దాడి..
నాగోల్ డివిజన్ పరిధిలోని జైపురి కాలనీ బ్లైండ్స్ కాలనీలో నివాసం ఉండే రమణ(65), శాంతకుమారి(60) వృద్ధ దంపతులకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెద్ద కుమారుడు ప్రదీప్ తన కుటుంబ సభ్యులతో మరొక చోట ఉంటుండగా.. చిన్న కుమారుడు ప్రమోద్(30) తల్లిదండ్రులతోనే నివాసం ఉంటున్నాడు. ప్రమోద్కు పెళ్లి అయినా పలు కారణాలతో భార్య వదిలిపెట్టి వెళ్లిపోయింది. ఆ కారణంతో మద్యానికి బానిసయ్యాడు. అటు మద్యానికి బానిసైనప్పటికీ తల్లిదండ్రులకు అండగా ఉంటూ వారిని చూసుకునేవాడు. మద్యం ఎక్కువగా సేవిస్తుండటంతో ఆరోగ్య పూర్తిగా క్షీణించింది. మద్యం మత్తులోనే 3 రోజుల క్రితం ప్రమోద్ చనిపోయాడు. తమ కుమారుడు చనిపోయినట్లుగా ఇంట్లో అంధులైన తల్లిదండ్రులు గుర్తించలేకపోయారు. వృద్దాప్య దశలో ఏమీ చేయలేని స్థితిలో ఆ వృద్ధ దంపతులు ఉండిపోయారు.
Read Also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
ఈ క్రమంలో ఎవరూ అటువైపు చూడకపోవటంతో మృతదేహం కుళ్లిపోయి దుర్వాసన వచ్చింది. దుర్వాసన వస్తుండడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఒకవైపు ఆకలితో, మరోవైపు భరించలేని కంపు వాసనతో దీనావస్థ స్థితిలో ఉన్న వృద్ధ దంపతులను బయటికి తీసుకొచ్చారు. ఆ వృద్ధ దంపతులకు స్నానం చేయించి.. భోజనం ఏర్పాట్లు చేసి మానవత్వం చాటుకున్నారు. అనంతరం వృద్ధులతో మాట్లాడుతూ.. వారి కుటుంబ వివరాలను తెలుసుకొని.. తమ చిన్నకొడుకు ప్రమోద్ చనిపోయాడని వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పెద్ద కొడుకును పిలిపించి వృద్ధ దంపతులను అప్పజెప్పారు.
తాజావార్తలు
-
Criminal Gang : నల్లగొండలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ అరెస్ట్.. రూ.53 లక్షల సొత్తుతో.!
-
Rohit Sharma Retirement: బిగ్ షాక్.. సెలక్టర్లకు ఎదురుతిరిగిన రోహిత్ శర్మ.. జైస్వాల్ కోసం గిల్ త్యాగం!
-
Nandini : “ఆమె నా కోడలు కాదు.. కూతురు.. భట్టి సతీమణి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Amit Shah: ‘చికెన్ నెక్’ కారిడార్ భద్రతపై అమిత్ షా హై లెవల్ రివ్యూ..
-
NBK 111: బిగ్ రిస్క్ లో బాలయ్య?
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!