Tragedy: అంధ తల్లిదండ్రులకు అంతులేని విషాదం.. కొడుకు చనిపోయినా..
- నాగోల్లో అంధ తల్లిదండ్రులకు అంతులేని విషాదం
- కుమారుడు మృతి చెందిన విషయం తెలియని వైనం
- మూడు రోజుల పాటు తిండి..తిప్పలు లేక అవస్థలు
- దుర్వాసన రావడంతో స్థానికుల ఫిర్యాదుతో వెలుగులోకి ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tragedy: కొడుకు చనిపోయిన విషయం తెలియక మూడు రోజుల పాటు అంధకారంలోనే ఉండిపోయారు అంధ తల్లిదండ్రులు. మనసును కలచివేసే ఈ విషాద ఘటన హైదరాబాద్లోని నాగోల్లో చోటుచేసుకుంది. కొడుకు మృతి నాగోల్లో అంధ తల్లిదండ్రులకు అంతులేని విషాదాన్ని మిగిల్చింది. కుమారుడు మృతి చెందిన విషయం తెలియని పరిస్థితిలో మూడు రోజుల పాటు తిండి, తిప్పలు లేక ఆ అంధ వృద్ధ దంపతులు అవస్థలు పడ్డారు. ఆ ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికుల ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కొడుకు మృతి చెందాడు అనే విషయం తెలియని పరిస్థితుల్లో అంధ తల్లిదండ్రులు ఉండగా.. నాగోల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వారికి అండగా నిలిచారు. వారికి స్నానం చేయించి అన్నం పెట్టించారు నాగోల్ సీఐ సూర్య నాయక్. పోస్టుమార్టం కోసం మృతదేహం తరలించారు.
Read Also: Train Accident: ప్యాసింజర్ రైలులో పేలుడు.. కోచ్లో దట్టమైన పొగలు..
Also Read
- Bihar IPL Team: ప్రతిభ ఉన్నా గుర్తింపు లేదు.. బీహార్కు కూడా ఐపీఎల్ జట్టు కావాలి..? పారిశ్రామికవేత్త భావోద్వేగ పోస్ట్ వైరల్..!
- Honda City facelift: భారత మార్కెట్లోకి సరికొత్త హోండా సిటీ ఫేస్లిఫ్ట్.. అదిరిపోయే లుక్స్, ఫీచర్లు!
- Prakash Raj: కాక్రోచ్ జనతా పార్టీలో ప్రకాష్ రాజ్ ఎంట్రీ.. వైరల్ అవుతున్న వీడియో!
- West Bengal: ప్రధాని మోడీకి ఝల్మురి వడ్డించిన షాప్ ఓనర్కి ప్రాణ భయం..! పాక్ నుంచి బెదిరింపులు..
నాగోల్ డివిజన్ పరిధిలోని జైపురి కాలనీ బ్లైండ్స్ కాలనీలో నివాసం ఉండే రమణ(65), శాంతకుమారి(60) వృద్ధ దంపతులకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెద్ద కుమారుడు ప్రదీప్ తన కుటుంబ సభ్యులతో మరొక చోట ఉంటుండగా.. చిన్న కుమారుడు ప్రమోద్(30) తల్లిదండ్రులతోనే నివాసం ఉంటున్నాడు. ప్రమోద్కు పెళ్లి అయినా పలు కారణాలతో భార్య వదిలిపెట్టి వెళ్లిపోయింది. ఆ కారణంతో మద్యానికి బానిసయ్యాడు. అటు మద్యానికి బానిసైనప్పటికీ తల్లిదండ్రులకు అండగా ఉంటూ వారిని చూసుకునేవాడు. మద్యం ఎక్కువగా సేవిస్తుండటంతో ఆరోగ్య పూర్తిగా క్షీణించింది. మద్యం మత్తులోనే 3 రోజుల క్రితం ప్రమోద్ చనిపోయాడు. తమ కుమారుడు చనిపోయినట్లుగా ఇంట్లో అంధులైన తల్లిదండ్రులు గుర్తించలేకపోయారు. వృద్దాప్య దశలో ఏమీ చేయలేని స్థితిలో ఆ వృద్ధ దంపతులు ఉండిపోయారు.
Read Also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
ఈ క్రమంలో ఎవరూ అటువైపు చూడకపోవటంతో మృతదేహం కుళ్లిపోయి దుర్వాసన వచ్చింది. దుర్వాసన వస్తుండడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఒకవైపు ఆకలితో, మరోవైపు భరించలేని కంపు వాసనతో దీనావస్థ స్థితిలో ఉన్న వృద్ధ దంపతులను బయటికి తీసుకొచ్చారు. ఆ వృద్ధ దంపతులకు స్నానం చేయించి.. భోజనం ఏర్పాట్లు చేసి మానవత్వం చాటుకున్నారు. అనంతరం వృద్ధులతో మాట్లాడుతూ.. వారి కుటుంబ వివరాలను తెలుసుకొని.. తమ చిన్నకొడుకు ప్రమోద్ చనిపోయాడని వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పెద్ద కొడుకును పిలిపించి వృద్ధ దంపతులను అప్పజెప్పారు.
తాజావార్తలు
-
Bihar IPL Team: ప్రతిభ ఉన్నా గుర్తింపు లేదు.. బీహార్కు కూడా ఐపీఎల్ జట్టు కావాలి..? పారిశ్రామికవేత్త భావోద్వేగ పోస్ట్ వైరల్..!
-
Gayapadda Simham: ‘గాయపడ్డ సింహం’ ఓటీటీ రిలీజ్..
-
Honda City facelift: భారత మార్కెట్లోకి సరికొత్త హోండా సిటీ ఫేస్లిఫ్ట్.. అదిరిపోయే లుక్స్, ఫీచర్లు!
-
Kodak QLED Smart TV: కోడాక్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ రిలీజ్.. Google TV 5.0తో థియేటర్ ఫీల్!
-
Peddi: ‘పెద్ది’ నుండి స్పెషల్ సాంగ్ ప్రోమో రిలీజ్.. అదిరిపోయిన చరణ్ – శృతి స్టెప్స్
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!