ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో గజ్వేల్ ఈఎన్సి హరిరామ్ ఏసీబి కస్టడి కొనసాగుతోంది. ఇప్పటికే హరిరామ్ ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈఎన్సీ హరిరామ్ ను ఐదు రోజుల పాటు కస్టడీకి అనుమతిచ్చింది కోర్టు. శుక్రవారం హరిరామ్ ను చంచల్గూడ జైలు నుంచి ఏసీబి కస్టడులోకి తీసుకుంది. ఏసీబీ ప్రధాన కార్యాలయంలో హరిరామ్ ఆస్తులపై ఏసీబీ ఆరా తీస్తోంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం 13 కోట్ల రూపాయల ఆస్తులను గుర్తించింది ఏసీబి. బహిరంగ మార్కెట్ వీటి విలువ పదిరెట్లు. వంద కోట్లకు పైగా హరిరామ్ ఆస్తులను గుర్తించింది ఏసీబి.
Also Read:IPL 2025 : పవర్ ప్లే దెబ్బతీసింది… SRH ఓటమికి కారణాలు ఇవే..!
మంగళవారం వరకు హరిరామ్ ను ఏసీబి విచారించనున్నది. కస్టడీలో భాగంగా హరి రామ్ కు చెందిన లాకర్లను ఓపెన్ చేయనున్నది ఏసీబి. లాకర్లు ఓపెన్ చేస్తే హరీ రామ్ ఆస్తుల విలువ పెరిగే అవకాశం ఉందంటున్నారు అధికారులు. ఇంత భారీ స్థాయిలో ఆస్తులను కూడా పెట్టిన హరిరామ్ వెనకాల ఉన్నది ఎవరు అన్న కోణంలోనూ విచారిస్తోంది ఏసీబీ. హరి రామ్ ఇంట్లో సోదాల సమయంలో స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్ల వివరాలు సేకరిస్తోంది. స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్ల పై ఉన్న పేర్లు, వారితో ఉన్న సంబంధాలు పై ఆరా తీస్తున్నారు అధికారులు. హరిరామ్ కు పలువురు బినామీలు ఉన్నట్లుగా గుర్తించారు. బ్యాంకు అకౌంట్లు, డాక్యుమెంట్ల, బినామీలతో ఉన్న ఆస్తులు వివరాలను రాబట్టనున్నారు.