Elon Musk: ప్రస్తుతం టెక్ ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) గురించే చర్చ నడుస్తోంది. ప్రపంచ ప్రఖ్యాత టెక్ కంపెనీలన్నీ కృత్రిమమేథపై పనిచేస్తున్నాయి. అయితే రానున్న కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవాళికి ఎంతో సహాయకంగా మారతుందని కొంతమంది భావిస్తుంటే, మరికొంత మంది మాత్రం మానవాళి వినాశనానికి ఇది దోహదం చేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
Read Also: IPL: ఐపీఎల్పై సౌదీ అరేబియా కన్ను.. భారీ పెట్టుబడికి సిద్ధం..
తాజాగా టెస్లా, ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ మాత్రం రెండో కోవకు చెందిన వ్యక్తిగా ఉన్నాడు. రానున్న కాలంలో AI ప్రమాదాల గురించి హెచ్చరిస్తున్నాడు. యూకే పీఎం రిషిసునాక్తో మాట్లాడుతూ.. AI ‘‘చరిత్రలో అత్యంత విధ్వంసక శక్తి’’గా అభివర్ణించారు. ఇది అన్ని మానవ ఉద్యోగాలని స్వాధీనం చేసుకోవచ్చని అన్నారు. యూకేలో జరుగుతున్న ఏఐ సేఫ్టీ సమ్మిట్ సందర్భంగా యూకే పీఎం రిషిసునాక్, ఎలాన్ మస్క్ని ఇంటర్వ్యూ చేశారు. ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయనే భయం ఉందని దీనిపై ఎలాన్ మస్క్ అభిప్రాయాన్ని అడిగారు. ఏఐ గురించి మాట్లాడుతూ మస్క్.. ఇది తెలివైన మనిషి కన్నా తెలివైనదిగా మన దగ్గర ఉంటుందని అన్నారు. భవిష్యత్తులో ఉద్యోగం అవసరం లేని స్థితి వస్తుందని అంచనా వేశారు. దీంట్లో మంచి మరియు చెడు రెండు ఉన్నాయని అన్నారు. ఇది ప్రజలకు సౌకర్యంగా ఉందా.. అసౌకర్యంగా ఉంటుందో నాకు తెలియని అతను చెప్పాడు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భద్రతపై చైనా, బ్రిటన్, యూఎస్ఏ జతకట్టాలని తాను కోరుకుంటున్నట్లు మస్క్ వెల్లడించారు. మే నెలలో ఎలాన్ మస్క్ చైనా పర్యటనకు వెళ్లారు. అక్కడి కమ్యూనిస్ట్ ప్రభుత్వం మస్క్కి గ్రాండ్ వెల్కమ్ చెప్పంది. ఏఐ భద్రతా చర్యల్లో బీజింగ్ పాల్గొనడాన్ని మస్క్ స్వాగతించారు.