Elon Musk: అమెరికాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఎలోన్ మస్క్. ప్రపంచ కుబేరుడిగా ఆయనకు పేరు.అతను స్పేస్ ఎక్స్(Space X), టెస్లా(Tesla) కంపెనీలకు CEO. గతేడాది ఏప్రిల్లో రూ.3.5 లక్షల కోట్లతో ట్విట్టర్ను కొనుగోలు చేశారు. అతను ట్విట్టర్ కొనుగోలు సమయంలో తన టెస్లా కంపెనీలో వాటాలను విక్రయించడం ప్రారంభించాడు. ఇది ట్విట్టర్ నిర్వహణలో వివాదాస్పద మార్పులను తీసుకువచ్చింది. కంపెనీ నుంచి 50 శాతం మంది ఉద్యోగుల తొలగించంతో చర్చనీయాంశమైంది. అంతర్జాతీయంగా కూడా విమర్శలకు దారితీసింది.
Read Also: Joshimath : శరవేగంగా కుంగుతున్న జోషిమఠ్.. షాక్ పుట్టిస్తున్న ఛాయా చిత్రాలు
దీంతో టెస్లా ఇన్వెస్టర్లు తమ షేర్లను విక్రయించి నిష్క్రమిస్తున్నారు. దీని కారణంగా, ఎలోన్ మస్క్ ఆస్తి విలువ భారీగా పడిపోయింది. దీంతో ప్రపంచంలోనే తొలి సంపన్నుడిగా తన హోదాను కోల్పోయాడు మస్క్. ఈ సందర్భంలో నవంబర్ 2021 లో ఎలోన్ మస్క్ ఆస్తి విలువ 320 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 26 లక్షల కోట్లు), ఇప్పుడు అది 137 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 11 లక్షల కోట్లు) పడిపోయింది. గత ఏడాది కాలంలోనే ఆయన 182 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 15 లక్షల కోట్లు) కోల్పోయారు. దీంతో మానవ చరిత్రలోనే అత్యంత ఘోరమైన నష్టాన్ని చవిచూసిన వ్యక్తిగా ఎలోన్ మస్క్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్నాడు.