Current Subsidy : రాజధానివాసులకు షాక్..నేటితో ముగియనున్న కరెంట్ సబ్సిడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Current Subsidy : దేశ రాజధాని ఢిల్లీ వాసులకు పెద్ద షాక్ తగలనుంది. ఢిల్లీలో నేటితో విద్యుత్ సబ్సిడీ ముగియనుంది. అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వంలోని ఇంధన శాఖ మంత్రి అతిషి మాట్లాడుతూ.. నేటితో రాష్ట్రంలోని 46 లక్షల కుటుంబాలకు విద్యుత్ సబ్సిడీ ముగుస్తుంది. విద్యుత్ సబ్సిడీ పెంపుపై కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆ ఫైల్ లెఫ్టినెంట్ గవర్నర్ ముందు పెండింగ్లో ఉందన్నారు. ఢిల్లీలో దాదాపు 48 లక్షల కుటుంబాలు విద్యుత్ సబ్సిడీ కోసం దరఖాస్తు చేసుకున్నాయని ఆయన చెప్పారు.
వినియోగదారులకు విద్యుత్ సబ్సిడీ ఇచ్చే ఫైల్ లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సేనా ఆమోదించనందున, నగరంలోని సుమారు 46 లక్షల మందికి విద్యుత్ సబ్సిడీ శుక్రవారం నుండి ముగుస్తుందన్నారు. ఈ అంశంపై ఇప్పుడు ఢిల్లీ ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ మధ్య వాగ్వాదం జరిగే అవకాశం ఉందని ఆయన భావిస్తున్నారు. ఈ విషయంపై సక్సేనాతో సమావేశం కావాలని కోరామని.. అయితే ఎల్జీ కార్యాలయం నుండి ఇప్పటివరకు ఎటువంటి స్పందన రాలేదని మంత్రి చెప్పారు.
Also Read
- CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
- Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
- CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్లు వైరల్
- Lalit Modi: 16 ఏళ్ల తర్వాత భారత్ రాబోతున్న లలిత్ మోడీ..
Read Also: Bhatti Vikramarka : ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు.. త్వరలో తిరుగుబాటు రానుంది
ఇంధన మంత్రి అతిషి మాట్లాడుతూ.. ‘మేం 46 లక్షల మందికి ఇస్తున్న విద్యుత్ సబ్సిడీ నేటితో నిలిచిపోతుంది. సోమవారం నుంచి ప్రజలకు సబ్సిడీ లేకుండా పెరిగిన బిల్లులు అందుతాయి. 2023-24 సంవత్సరానికి విద్యుత్ సబ్సిడీని పొడిగించడానికి ఢిల్లీ మంత్రివర్గం ఆమోదించింది. అయితే ఫైల్ ఇప్పటికీ LG కార్యాలయంలో పెండింగ్లో ఉంది. ఫైల్ ఆమోదించే వరకు.. మేము సబ్సిడీ ఇవ్వలేము. ఈ విషయంపై చర్చించడానికి నేను LG కార్యాలయాన్ని కోరాను. కానీ నాకు సమయం ఇవ్వలేదు. ఫైల్ కూడా ఇంకా తిరిగి రాలేదు’ అన్నారు.
కొన్ని రోజుల క్రితమే ఫైల్ను పంపించామని, ఇంకా సమాధానం రావాల్సి ఉందని అతిషి తెలిపారు. ఈ సబ్సిడీకి సంబంధించిన బడ్జెట్ ను అసెంబ్లీ ఆమోదించిందని తెలిపారు. ప్రభుత్వం వద్ద సబ్సిడీకి డబ్బులు ఉన్నా ఖర్చు చేయలేం. ఢిల్లీలో, ఆప్ ప్రభుత్వం 200 యూనిట్ల నెలవారీ వినియోగంతో వినియోగదారులకు ఉచిత విద్యుత్ను అందజేస్తుంది. నెలకు 201 నుంచి 400 యూనిట్లు వినియోగించే వారికి 50 శాతం సబ్సిడీ అంటే దాదాపు రూ.850 ఇస్తున్నారు.
వాస్తవానికి, గతేడాది ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విద్యుత్ సబ్సిడీ కోసం దరఖాస్తు చేసుకున్న వినియోగదారులకు మాత్రమే అందించబడుతుందని ప్రకటించారు. అధికారిక లెక్కల ప్రకారం 58 లక్షల మంది గృహ వినియోగదారులలో 48 లక్షల మంది విద్యుత్ సబ్సిడీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆప్ ప్రభుత్వం 2023-24 బడ్జెట్లో విద్యుత్ సబ్సిడీకి రూ.3250 కోట్లు కేటాయించింది.
తాజావార్తలు
-
Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్కు గుడ్బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
-
CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
-
Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
-
Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
-
Komatireddy Rajgopal Reddy : కాంగ్రెస్ నాయకత్వానికి రాజగోపాల్ రెడ్డి కీలక విజ్ఞప్తి..!
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!