Current Subsidy : రాజధానివాసులకు షాక్..నేటితో ముగియనున్న కరెంట్ సబ్సిడీ
Current Subsidy : దేశ రాజధాని ఢిల్లీ వాసులకు పెద్ద షాక్ తగలనుంది. ఢిల్లీలో నేటితో విద్యుత్ సబ్సిడీ ముగియనుంది. అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వంలోని ఇంధన శాఖ మంత్రి అతిషి మాట్లాడుతూ.. నేటితో రాష్ట్రంలోని 46 లక్షల కుటుంబాలకు విద్యుత్ సబ్సిడీ ముగుస్తుంది. విద్యుత్ సబ్సిడీ పెంపుపై కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆ ఫైల్ లెఫ్టినెంట్ గవర్నర్ ముందు పెండింగ్లో ఉందన్నారు. ఢిల్లీలో దాదాపు 48 లక్షల కుటుంబాలు విద్యుత్ సబ్సిడీ కోసం దరఖాస్తు చేసుకున్నాయని ఆయన చెప్పారు.
వినియోగదారులకు విద్యుత్ సబ్సిడీ ఇచ్చే ఫైల్ లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సేనా ఆమోదించనందున, నగరంలోని సుమారు 46 లక్షల మందికి విద్యుత్ సబ్సిడీ శుక్రవారం నుండి ముగుస్తుందన్నారు. ఈ అంశంపై ఇప్పుడు ఢిల్లీ ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ మధ్య వాగ్వాదం జరిగే అవకాశం ఉందని ఆయన భావిస్తున్నారు. ఈ విషయంపై సక్సేనాతో సమావేశం కావాలని కోరామని.. అయితే ఎల్జీ కార్యాలయం నుండి ఇప్పటివరకు ఎటువంటి స్పందన రాలేదని మంత్రి చెప్పారు.
Also Read
- Mamata Banerjee: 200కు పైగా సీట్లలో గెలుస్తాం, స్టాక్ మార్కెట్ కోసమే ఎగ్జిట్ పోల్స్..
- Abhishek Sharma: హనుమాన్ ఆలయంలో కాటేరమ్మ కొడుకు.. రేపు దబిడిదిబిడే..
- China-Pakistan: పాకిస్తాన్కు చైనా J-35AE ఫైటర్ జెట్.. భారత్కు ముప్పు..
- Cooking Oil Price: సామాన్యుడికి మరో బిగ్ షాక్.. భారీగా పెరిగిన వంట నూనె ధరలు..
Read Also: Bhatti Vikramarka : ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు.. త్వరలో తిరుగుబాటు రానుంది
ఇంధన మంత్రి అతిషి మాట్లాడుతూ.. ‘మేం 46 లక్షల మందికి ఇస్తున్న విద్యుత్ సబ్సిడీ నేటితో నిలిచిపోతుంది. సోమవారం నుంచి ప్రజలకు సబ్సిడీ లేకుండా పెరిగిన బిల్లులు అందుతాయి. 2023-24 సంవత్సరానికి విద్యుత్ సబ్సిడీని పొడిగించడానికి ఢిల్లీ మంత్రివర్గం ఆమోదించింది. అయితే ఫైల్ ఇప్పటికీ LG కార్యాలయంలో పెండింగ్లో ఉంది. ఫైల్ ఆమోదించే వరకు.. మేము సబ్సిడీ ఇవ్వలేము. ఈ విషయంపై చర్చించడానికి నేను LG కార్యాలయాన్ని కోరాను. కానీ నాకు సమయం ఇవ్వలేదు. ఫైల్ కూడా ఇంకా తిరిగి రాలేదు’ అన్నారు.
కొన్ని రోజుల క్రితమే ఫైల్ను పంపించామని, ఇంకా సమాధానం రావాల్సి ఉందని అతిషి తెలిపారు. ఈ సబ్సిడీకి సంబంధించిన బడ్జెట్ ను అసెంబ్లీ ఆమోదించిందని తెలిపారు. ప్రభుత్వం వద్ద సబ్సిడీకి డబ్బులు ఉన్నా ఖర్చు చేయలేం. ఢిల్లీలో, ఆప్ ప్రభుత్వం 200 యూనిట్ల నెలవారీ వినియోగంతో వినియోగదారులకు ఉచిత విద్యుత్ను అందజేస్తుంది. నెలకు 201 నుంచి 400 యూనిట్లు వినియోగించే వారికి 50 శాతం సబ్సిడీ అంటే దాదాపు రూ.850 ఇస్తున్నారు.
వాస్తవానికి, గతేడాది ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విద్యుత్ సబ్సిడీ కోసం దరఖాస్తు చేసుకున్న వినియోగదారులకు మాత్రమే అందించబడుతుందని ప్రకటించారు. అధికారిక లెక్కల ప్రకారం 58 లక్షల మంది గృహ వినియోగదారులలో 48 లక్షల మంది విద్యుత్ సబ్సిడీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆప్ ప్రభుత్వం 2023-24 బడ్జెట్లో విద్యుత్ సబ్సిడీకి రూ.3250 కోట్లు కేటాయించింది.
తాజావార్తలు
-
Mamata Banerjee: 200కు పైగా సీట్లలో గెలుస్తాం, స్టాక్ మార్కెట్ కోసమే ఎగ్జిట్ పోల్స్..
-
Abhishek Sharma: హనుమాన్ ఆలయంలో కాటేరమ్మ కొడుకు.. రేపు దబిడిదిబిడే..
-
JD Chakravarthy: “ఆర్జీవీ నా బలం.. కంటెంట్ ఉంటేనే సినిమా కింగ్”.. జేడీ చక్రవర్తి
-
China-Pakistan: పాకిస్తాన్కు చైనా J-35AE ఫైటర్ జెట్.. భారత్కు ముప్పు..
-
Cooking Oil Price: సామాన్యుడికి మరో బిగ్ షాక్.. భారీగా పెరిగిన వంట నూనె ధరలు..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!