Current Subsidy : రాజధానివాసులకు షాక్..నేటితో ముగియనున్న కరెంట్ సబ్సిడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Current Subsidy : దేశ రాజధాని ఢిల్లీ వాసులకు పెద్ద షాక్ తగలనుంది. ఢిల్లీలో నేటితో విద్యుత్ సబ్సిడీ ముగియనుంది. అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వంలోని ఇంధన శాఖ మంత్రి అతిషి మాట్లాడుతూ.. నేటితో రాష్ట్రంలోని 46 లక్షల కుటుంబాలకు విద్యుత్ సబ్సిడీ ముగుస్తుంది. విద్యుత్ సబ్సిడీ పెంపుపై కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆ ఫైల్ లెఫ్టినెంట్ గవర్నర్ ముందు పెండింగ్లో ఉందన్నారు. ఢిల్లీలో దాదాపు 48 లక్షల కుటుంబాలు విద్యుత్ సబ్సిడీ కోసం దరఖాస్తు చేసుకున్నాయని ఆయన చెప్పారు.
వినియోగదారులకు విద్యుత్ సబ్సిడీ ఇచ్చే ఫైల్ లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సేనా ఆమోదించనందున, నగరంలోని సుమారు 46 లక్షల మందికి విద్యుత్ సబ్సిడీ శుక్రవారం నుండి ముగుస్తుందన్నారు. ఈ అంశంపై ఇప్పుడు ఢిల్లీ ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ మధ్య వాగ్వాదం జరిగే అవకాశం ఉందని ఆయన భావిస్తున్నారు. ఈ విషయంపై సక్సేనాతో సమావేశం కావాలని కోరామని.. అయితే ఎల్జీ కార్యాలయం నుండి ఇప్పటివరకు ఎటువంటి స్పందన రాలేదని మంత్రి చెప్పారు.
Also Read
- Astrology: జూన్ 29 సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి గుడ్ న్యూస్..
- Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
- Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
- IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
Read Also: Bhatti Vikramarka : ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు.. త్వరలో తిరుగుబాటు రానుంది
ఇంధన మంత్రి అతిషి మాట్లాడుతూ.. ‘మేం 46 లక్షల మందికి ఇస్తున్న విద్యుత్ సబ్సిడీ నేటితో నిలిచిపోతుంది. సోమవారం నుంచి ప్రజలకు సబ్సిడీ లేకుండా పెరిగిన బిల్లులు అందుతాయి. 2023-24 సంవత్సరానికి విద్యుత్ సబ్సిడీని పొడిగించడానికి ఢిల్లీ మంత్రివర్గం ఆమోదించింది. అయితే ఫైల్ ఇప్పటికీ LG కార్యాలయంలో పెండింగ్లో ఉంది. ఫైల్ ఆమోదించే వరకు.. మేము సబ్సిడీ ఇవ్వలేము. ఈ విషయంపై చర్చించడానికి నేను LG కార్యాలయాన్ని కోరాను. కానీ నాకు సమయం ఇవ్వలేదు. ఫైల్ కూడా ఇంకా తిరిగి రాలేదు’ అన్నారు.
కొన్ని రోజుల క్రితమే ఫైల్ను పంపించామని, ఇంకా సమాధానం రావాల్సి ఉందని అతిషి తెలిపారు. ఈ సబ్సిడీకి సంబంధించిన బడ్జెట్ ను అసెంబ్లీ ఆమోదించిందని తెలిపారు. ప్రభుత్వం వద్ద సబ్సిడీకి డబ్బులు ఉన్నా ఖర్చు చేయలేం. ఢిల్లీలో, ఆప్ ప్రభుత్వం 200 యూనిట్ల నెలవారీ వినియోగంతో వినియోగదారులకు ఉచిత విద్యుత్ను అందజేస్తుంది. నెలకు 201 నుంచి 400 యూనిట్లు వినియోగించే వారికి 50 శాతం సబ్సిడీ అంటే దాదాపు రూ.850 ఇస్తున్నారు.
వాస్తవానికి, గతేడాది ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విద్యుత్ సబ్సిడీ కోసం దరఖాస్తు చేసుకున్న వినియోగదారులకు మాత్రమే అందించబడుతుందని ప్రకటించారు. అధికారిక లెక్కల ప్రకారం 58 లక్షల మంది గృహ వినియోగదారులలో 48 లక్షల మంది విద్యుత్ సబ్సిడీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆప్ ప్రభుత్వం 2023-24 బడ్జెట్లో విద్యుత్ సబ్సిడీకి రూ.3250 కోట్లు కేటాయించింది.
తాజావార్తలు
-
Lorcan Tucker: టీమిండియాపై టీ20 సిరీస్ గెలిచామా.. నేను ఇంకా నమ్మలేకపోతున్నా!
-
US Iran Talks: అమెరికా–ఇరాన్ మధ్య శాంతి దిశగా కీలక అడుగు..
-
God Of War : సోషల్ మీడియాని షేక్ చేస్తున్న Jr. NTR – త్రివిక్రమ్ ‘గాడ్ ఆఫ్ వార్’
-
Peddi OTT Release: రామ్ చరణ్ ‘పెద్ది’ ఇప్పుడు ఇంట్లోనే.. కానీ ఈ ఒక్క భాషకు వెయిటింగ్ తప్పదు!
-
Astrology: జూన్ 29 సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి గుడ్ న్యూస్..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!