Current Subsidy : రాజధానివాసులకు షాక్..నేటితో ముగియనున్న కరెంట్ సబ్సిడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Current Subsidy : దేశ రాజధాని ఢిల్లీ వాసులకు పెద్ద షాక్ తగలనుంది. ఢిల్లీలో నేటితో విద్యుత్ సబ్సిడీ ముగియనుంది. అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వంలోని ఇంధన శాఖ మంత్రి అతిషి మాట్లాడుతూ.. నేటితో రాష్ట్రంలోని 46 లక్షల కుటుంబాలకు విద్యుత్ సబ్సిడీ ముగుస్తుంది. విద్యుత్ సబ్సిడీ పెంపుపై కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆ ఫైల్ లెఫ్టినెంట్ గవర్నర్ ముందు పెండింగ్లో ఉందన్నారు. ఢిల్లీలో దాదాపు 48 లక్షల కుటుంబాలు విద్యుత్ సబ్సిడీ కోసం దరఖాస్తు చేసుకున్నాయని ఆయన చెప్పారు.
వినియోగదారులకు విద్యుత్ సబ్సిడీ ఇచ్చే ఫైల్ లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సేనా ఆమోదించనందున, నగరంలోని సుమారు 46 లక్షల మందికి విద్యుత్ సబ్సిడీ శుక్రవారం నుండి ముగుస్తుందన్నారు. ఈ అంశంపై ఇప్పుడు ఢిల్లీ ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ మధ్య వాగ్వాదం జరిగే అవకాశం ఉందని ఆయన భావిస్తున్నారు. ఈ విషయంపై సక్సేనాతో సమావేశం కావాలని కోరామని.. అయితే ఎల్జీ కార్యాలయం నుండి ఇప్పటివరకు ఎటువంటి స్పందన రాలేదని మంత్రి చెప్పారు.
Also Read
- Twisha Sharma: తెలుగు నటి మృతి కేసులో కీలక పరిణామం.. రెండో పోస్ట్మార్టానికి హైకోర్టు ఆదేశం
- Vaibhav Sooryavanshi: అప్పుడే క్రిస్ గేల్ రికార్డుకు చేరువలోకి వచ్చిన వైభవ్ సూర్యవంశీ.. కేవలం 3 మాత్రమే..
- Bihar IPL Team: ప్రతిభ ఉన్నా గుర్తింపు లేదు.. బీహార్కు కూడా ఐపీఎల్ జట్టు కావాలి..? పారిశ్రామికవేత్త భావోద్వేగ పోస్ట్ వైరల్..!
- Honda City facelift: భారత మార్కెట్లోకి సరికొత్త హోండా సిటీ ఫేస్లిఫ్ట్.. అదిరిపోయే లుక్స్, ఫీచర్లు!
Read Also: Bhatti Vikramarka : ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు.. త్వరలో తిరుగుబాటు రానుంది
ఇంధన మంత్రి అతిషి మాట్లాడుతూ.. ‘మేం 46 లక్షల మందికి ఇస్తున్న విద్యుత్ సబ్సిడీ నేటితో నిలిచిపోతుంది. సోమవారం నుంచి ప్రజలకు సబ్సిడీ లేకుండా పెరిగిన బిల్లులు అందుతాయి. 2023-24 సంవత్సరానికి విద్యుత్ సబ్సిడీని పొడిగించడానికి ఢిల్లీ మంత్రివర్గం ఆమోదించింది. అయితే ఫైల్ ఇప్పటికీ LG కార్యాలయంలో పెండింగ్లో ఉంది. ఫైల్ ఆమోదించే వరకు.. మేము సబ్సిడీ ఇవ్వలేము. ఈ విషయంపై చర్చించడానికి నేను LG కార్యాలయాన్ని కోరాను. కానీ నాకు సమయం ఇవ్వలేదు. ఫైల్ కూడా ఇంకా తిరిగి రాలేదు’ అన్నారు.
కొన్ని రోజుల క్రితమే ఫైల్ను పంపించామని, ఇంకా సమాధానం రావాల్సి ఉందని అతిషి తెలిపారు. ఈ సబ్సిడీకి సంబంధించిన బడ్జెట్ ను అసెంబ్లీ ఆమోదించిందని తెలిపారు. ప్రభుత్వం వద్ద సబ్సిడీకి డబ్బులు ఉన్నా ఖర్చు చేయలేం. ఢిల్లీలో, ఆప్ ప్రభుత్వం 200 యూనిట్ల నెలవారీ వినియోగంతో వినియోగదారులకు ఉచిత విద్యుత్ను అందజేస్తుంది. నెలకు 201 నుంచి 400 యూనిట్లు వినియోగించే వారికి 50 శాతం సబ్సిడీ అంటే దాదాపు రూ.850 ఇస్తున్నారు.
వాస్తవానికి, గతేడాది ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విద్యుత్ సబ్సిడీ కోసం దరఖాస్తు చేసుకున్న వినియోగదారులకు మాత్రమే అందించబడుతుందని ప్రకటించారు. అధికారిక లెక్కల ప్రకారం 58 లక్షల మంది గృహ వినియోగదారులలో 48 లక్షల మంది విద్యుత్ సబ్సిడీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆప్ ప్రభుత్వం 2023-24 బడ్జెట్లో విద్యుత్ సబ్సిడీకి రూ.3250 కోట్లు కేటాయించింది.
తాజావార్తలు
-
Twisha Sharma: తెలుగు నటి మృతి కేసులో కీలక పరిణామం.. రెండో పోస్ట్మార్టానికి హైకోర్టు ఆదేశం
-
HYDRAA : శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద హైడ్రా యాక్షన్.. అక్రమ కట్టడాల కూల్చివేత.!
-
Peddi: పెద్ది’పై హైప్రెజర్ ?
-
Vaibhav Sooryavanshi: అప్పుడే క్రిస్ గేల్ రికార్డుకు చేరువలోకి వచ్చిన వైభవ్ సూర్యవంశీ.. కేవలం 3 మాత్రమే..
-
Bihar IPL Team: ప్రతిభ ఉన్నా గుర్తింపు లేదు.. బీహార్కు కూడా ఐపీఎల్ జట్టు కావాలి..? పారిశ్రామికవేత్త భావోద్వేగ పోస్ట్ వైరల్..!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!