Electrical Vehicles Tax Benefit: ఎలక్ట్రిక్ వాహనాలు కొనాలనుకుంటున్నారా..? అయితే ఈ టాక్స్ బెనిఫిట్స్ మీ కోసమే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Electrical Vehicles Tax Benefit:భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) జోరు పెరిగింది. గతంలో పోలిస్తే ఇటీవల సంవత్సరాల్లో ఈవీలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పెరుగుతున్న పెట్రోల్ ధరల నేపథ్యంలో వినియోగదారుడు ఎలక్ట్రిక్ వాహనాల వైపు వెళ్తున్నాడు. ద్విచక్ర వాహనాలతో పాటు కార్లను కొనుగోలు చేస్తున్నారు. రానున్న కాలంలో ఛార్జింగ్ సమస్యలు తీరేలా మౌళిక సదుపాయాలు మెరుగుపడితే మరింత మంది ఈవీలను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. అయితే ఈవీ వాహనాలు కొనుగోలు చేసేవారికి కొన్ని ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తోంది ప్రభుత్వం. సాధారణంగా పెట్రోల్, డిజిల్ వాహనాలతో పోలిస్తే.. ఈవీ వాహనాల ధరలు కాస్త ఎక్కువగా ఉన్నా కూడా.. లాంగ్ రన్ లో వీటి నిర్వహణ వ్యయం అనేది తక్కువ.
ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై జీఎస్టీ తక్కువగా ఉంటుంది. 80EEB కింద ఆదాయపన్నును ఆదా చేసుకోవచ్చు. మామూలుగా పెట్రోల్, డిజిల్ వాహనాలతో పోలిస్తే ఈవీల్లో జీఎస్టీ తక్కువగా ఉంటుంది. వాహనం కొనుగోలుపై కేవలం 5 శాతం జీఎస్టీని మాత్రమే వసూలు చేస్తారు.
Also Read
- Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వండర్ కిడ్కు టాటా భారీ రివార్డ్.. నాడు ‘టాటా కర్వ్’.. నేడు ‘టాటా సియెర్రా’.. ఫీచర్స్ అదుర్స్!
- AB de Villiers: ముంబై లోకల్ గ్రౌండ్లో అభిమానులతో కలిసి క్రికెట్ ఆడి సందడి చేసిన ‘మిస్టర్ 360’.!
- Karnataka Politics: కర్ణాటక రాజకీయంలో హైడ్రామా.. కేబినెట్ కొలువుదీరిన కొద్దిరోజులకే మంత్రి రాజీనామా!
- వరల్డ్ కప్ గెలిచినా అసలు ట్రోఫీ దక్కదట.! 'FIFA World Cup' గురించి తెలియని విషయాలు మీకోసం..
టాక్స్ బెనిఫిట్స్:
ఒక వేళ మీరు వ్యక్తిగతంలో ఓ ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేస్తే 80EEB( ఇంట్రెస్ట్ లోన్ ఫర్ ఎలక్ట్రిక్ వెహికిల్స్) కింద వాహనం పన్ను మినహాయింపులను పొందవచ్చు. బ్యాంకు లేదా మరేదైనా ఆర్థిక సంస్థ ద్వారా అయినా లోన్ తీసుకుని ఈవీని కొనుగోలు చేస్తే కొన్ని మినహాయింపులను వర్తిస్తాయి. లోన్ తీసుకున్న మొత్తానికి గరిష్టంగా ప్రతీ ఏడాది రూ.1.5 లక్షల వరకు వడ్డీ మినహాయింపు పొందవచ్చు. ఇది టూవీలర్, త్రీవీలర్, ఫోర్ వీలర్ ఎలక్ట్రిక్ వాహనాలకు వర్తిస్తుంది. రిజిస్టర్ బ్యాంకు, ఎన్బీఎఫ్సీ ద్వారా రుణాలు పొందితేనే ఈ మినహాయింపులను పొందవచ్చు. ఎప్రిల్ 1, 2019 నుంచి మార్చి 30, 2023 వరకు లోన్ ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసిన వారికి మాత్రమే 80EEB కింద ఈ మినహాయింపులు ఇవ్వనుంది. ఈ కాలం పరిధిలో ఈవీలను కొనుగోలు చేసినవారు మాత్రమే వడ్డీ చెల్లింపును క్లెయిమ్ చేయవచ్చు.
వీటితో పాటు పలు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈవీ పాలసీలను తీసుకువచ్చాయి. రాష్ట్రాల తరుపున కొన్ని ప్రయోజనాలను ఈవీ కొనుగోలుదారులకు ఇస్తున్నాయి. ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మేఘాలయ, తెలంగాణ రాష్ట్రాలు ఈవీలు కొనుగోలు చేసిన వారికి కొన్ని రాయితీను ప్రకటించాయి.
తాజావార్తలు
-
Liam Livingstone: ఎస్ఆర్హెచ్ తుది జట్టు ఎంపికలో యజమానుల జోక్యం.. ఆ ప్లేయర్ కోసం నన్ను తొక్కేశారు!
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వండర్ కిడ్కు టాటా భారీ రివార్డ్.. నాడు ‘టాటా కర్వ్’.. నేడు ‘టాటా సియెర్రా’.. ఫీచర్స్ అదుర్స్!
-
AB de Villiers: ముంబై లోకల్ గ్రౌండ్లో అభిమానులతో కలిసి క్రికెట్ ఆడి సందడి చేసిన ‘మిస్టర్ 360’.!
-
K Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్బై.. రాజీనామాను ఆమోదించిన నితిన్ నబిన్
-
PEDDI Day -1collections : పెద్ది డే -1 కలెక్షన్స్.. రామ్ చరణ్ కెరీర్ హయ్యెస్ట్
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..