Electrical Vehicles Tax Benefit: ఎలక్ట్రిక్ వాహనాలు కొనాలనుకుంటున్నారా..? అయితే ఈ టాక్స్ బెనిఫిట్స్ మీ కోసమే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Electrical Vehicles Tax Benefit:భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) జోరు పెరిగింది. గతంలో పోలిస్తే ఇటీవల సంవత్సరాల్లో ఈవీలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పెరుగుతున్న పెట్రోల్ ధరల నేపథ్యంలో వినియోగదారుడు ఎలక్ట్రిక్ వాహనాల వైపు వెళ్తున్నాడు. ద్విచక్ర వాహనాలతో పాటు కార్లను కొనుగోలు చేస్తున్నారు. రానున్న కాలంలో ఛార్జింగ్ సమస్యలు తీరేలా మౌళిక సదుపాయాలు మెరుగుపడితే మరింత మంది ఈవీలను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. అయితే ఈవీ వాహనాలు కొనుగోలు చేసేవారికి కొన్ని ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తోంది ప్రభుత్వం. సాధారణంగా పెట్రోల్, డిజిల్ వాహనాలతో పోలిస్తే.. ఈవీ వాహనాల ధరలు కాస్త ఎక్కువగా ఉన్నా కూడా.. లాంగ్ రన్ లో వీటి నిర్వహణ వ్యయం అనేది తక్కువ.
ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై జీఎస్టీ తక్కువగా ఉంటుంది. 80EEB కింద ఆదాయపన్నును ఆదా చేసుకోవచ్చు. మామూలుగా పెట్రోల్, డిజిల్ వాహనాలతో పోలిస్తే ఈవీల్లో జీఎస్టీ తక్కువగా ఉంటుంది. వాహనం కొనుగోలుపై కేవలం 5 శాతం జీఎస్టీని మాత్రమే వసూలు చేస్తారు.
Also Read
- Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
- Congress: బంగ్లాదేశ్ ఉదాహరణతో కాంగ్రెస్కు కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్.. ప్రధాని నివాసం ముందు నిరసనపై ఫైర్
- Rahul Gandhi: రాహుల్గాంధీని ఈడ్చుకెళ్లిన పోలీసులు.. ముక్కుకు గాయం?
- Arijit Singh: గూండాల్లా విద్యార్థులపై దాడి చేస్తారా? ఢిల్లీ ఘటనపై ప్రముఖ సింగర్ ధ్వజం
టాక్స్ బెనిఫిట్స్:
ఒక వేళ మీరు వ్యక్తిగతంలో ఓ ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేస్తే 80EEB( ఇంట్రెస్ట్ లోన్ ఫర్ ఎలక్ట్రిక్ వెహికిల్స్) కింద వాహనం పన్ను మినహాయింపులను పొందవచ్చు. బ్యాంకు లేదా మరేదైనా ఆర్థిక సంస్థ ద్వారా అయినా లోన్ తీసుకుని ఈవీని కొనుగోలు చేస్తే కొన్ని మినహాయింపులను వర్తిస్తాయి. లోన్ తీసుకున్న మొత్తానికి గరిష్టంగా ప్రతీ ఏడాది రూ.1.5 లక్షల వరకు వడ్డీ మినహాయింపు పొందవచ్చు. ఇది టూవీలర్, త్రీవీలర్, ఫోర్ వీలర్ ఎలక్ట్రిక్ వాహనాలకు వర్తిస్తుంది. రిజిస్టర్ బ్యాంకు, ఎన్బీఎఫ్సీ ద్వారా రుణాలు పొందితేనే ఈ మినహాయింపులను పొందవచ్చు. ఎప్రిల్ 1, 2019 నుంచి మార్చి 30, 2023 వరకు లోన్ ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసిన వారికి మాత్రమే 80EEB కింద ఈ మినహాయింపులు ఇవ్వనుంది. ఈ కాలం పరిధిలో ఈవీలను కొనుగోలు చేసినవారు మాత్రమే వడ్డీ చెల్లింపును క్లెయిమ్ చేయవచ్చు.
వీటితో పాటు పలు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈవీ పాలసీలను తీసుకువచ్చాయి. రాష్ట్రాల తరుపున కొన్ని ప్రయోజనాలను ఈవీ కొనుగోలుదారులకు ఇస్తున్నాయి. ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మేఘాలయ, తెలంగాణ రాష్ట్రాలు ఈవీలు కొనుగోలు చేసిన వారికి కొన్ని రాయితీను ప్రకటించాయి.
తాజావార్తలు
-
Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
-
Congress: బంగ్లాదేశ్ ఉదాహరణతో కాంగ్రెస్కు కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్.. ప్రధాని నివాసం ముందు నిరసనపై ఫైర్
-
Rahul Gandhi: రాహుల్గాంధీని ఈడ్చుకెళ్లిన పోలీసులు.. ముక్కుకు గాయం?
-
China: కొత్త గేమ్కి రెడీ అవుతున్న చైనా.. ప్రపంచానికి షాక్ తప్పదా?
-
Arijit Singh: గూండాల్లా విద్యార్థులపై దాడి చేస్తారా? ఢిల్లీ ఘటనపై ప్రముఖ సింగర్ ధ్వజం
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!