Electric Bus For Tirumala: తిరుమలకు గేరు లేని బండి..హంగులెన్నో తెలుసాండీ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కలియుగ వైకుంఠం అంటేనే అదో అనుభూతి.. తిరుమల బ్రహ్మోత్సవాల గురించి ఎంత చెప్పినా తక్కువే. లక్షలాదిమంది భక్తులు ఆమలయప్పస్వామిని కనులారా వీక్షించి తరిస్తారు. నమో వేంకటేశాయ అనే మంత్రం విని పులకాంకితులు అవుతారు. త్వరలో తిరుమల బ్రహోత్సవ శోభతో అలరారనుంది. ఈ నేపథ్యంలో అత్యాధునిక ఎలక్ట్రిక్ బస్ ఒకటి తిరుమలకు రానుంది.
రైల్ రన్ కోసం ప్రస్తుతానికి అలిపిరి డిపోకు వచ్చింది ఏసీ విద్యుత్తు బస్సు. దీనిని అత్యాధునిక సాంకే తిక పరిజ్ఞానంతో రూపొందించారు. ఇందులో గేరు వ్యవస్థ ఉండదు. డ్రైవర్ సీటు వద్ద బ్రేకు, ఎక్స్ లేటర్ మాత్రమే ఉంటాయి. వైఫైతో పాటు డిస్ ప్లే స్క్రీన్, వాకీ టాకీ, ముందు వెనుక సీసీ కెమెరాలు ఉన్నాయి. ఛార్జింగ్ పోర్టుకు సంబంధించి ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
Read Also: Jammu Kashmir: కాశ్మీర్పై ఇస్లామిక్ దేశాల ప్రేలాపన.. సొంతింటిని చక్కదిద్దుకోండని భారత్ ఘాటు సమాధానం
ఈ ఎలక్ట్రిక్ బస్సుకి పూర్తిగా అద్దాలు మూసి ఉండటంతో ప్రతి విండో వద్ద అత్యవసర ఏర్పాట్లు చేశారు. విధుల్లో ఉన్న సిబ్బంది ఈ బస్ ని ఆసక్తిగా తిలకించారు. డిపోలో ఛార్జింగ్ పాయింట్ వ్యవస్థ నిర్మాణంలో ఉంది. ఇప్పటికే ఛార్జింగ్ పాయింట్ బాక్సులు డిపోకు చేరుకున్నాయి. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే సుమారు 240 కిలోమీటర్లు వరకు ఛార్జింగ్ ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ నెల 21న ప్రారంభం చేయనున్నట్లు అలిపిరి డిపో మేనేజర్ హరిబాబు తెలిపారు.
మరోవైపు తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలుకు కట్టుదిట్టమైన భధ్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. గరుడ సేవకు 6 లక్షల మంది భక్తులు తరలివస్తారని అంచనా వేస్తున్నారు టీటీడీ అధికారులు. బ్రహ్మోత్సవాలకు 7 వేల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. బ్రహ్మోత్సవాల భద్రతపై త్వరలోనే డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించే అవకాశం వుందని తెలుస్తోంది. ఇప్పటికే బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఇఓ ధర్మారెడ్డితో సమావేశం నిర్వహించారు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి.
Read Also: Tirumala: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల షెడ్యూల్.. ఏ రోజు ఏ వాహన సేవ..?
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!