Electric Bus For Tirumala: తిరుమలకు గేరు లేని బండి..హంగులెన్నో తెలుసాండీ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కలియుగ వైకుంఠం అంటేనే అదో అనుభూతి.. తిరుమల బ్రహ్మోత్సవాల గురించి ఎంత చెప్పినా తక్కువే. లక్షలాదిమంది భక్తులు ఆమలయప్పస్వామిని కనులారా వీక్షించి తరిస్తారు. నమో వేంకటేశాయ అనే మంత్రం విని పులకాంకితులు అవుతారు. త్వరలో తిరుమల బ్రహోత్సవ శోభతో అలరారనుంది. ఈ నేపథ్యంలో అత్యాధునిక ఎలక్ట్రిక్ బస్ ఒకటి తిరుమలకు రానుంది.
రైల్ రన్ కోసం ప్రస్తుతానికి అలిపిరి డిపోకు వచ్చింది ఏసీ విద్యుత్తు బస్సు. దీనిని అత్యాధునిక సాంకే తిక పరిజ్ఞానంతో రూపొందించారు. ఇందులో గేరు వ్యవస్థ ఉండదు. డ్రైవర్ సీటు వద్ద బ్రేకు, ఎక్స్ లేటర్ మాత్రమే ఉంటాయి. వైఫైతో పాటు డిస్ ప్లే స్క్రీన్, వాకీ టాకీ, ముందు వెనుక సీసీ కెమెరాలు ఉన్నాయి. ఛార్జింగ్ పోర్టుకు సంబంధించి ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.
Also Read
- WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
- Indian Rupee: రూపాయికి 'చీకటి' రోజు.. జీవితకాల కనిష్టానికి పడిపోయిన భారత కరెన్సీ..
- 8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
- Sambhaji Maharaj Jayanti: ఛత్రపతి శివాజీ వారసుడు.. మొఘలుల సింహస్వప్నం! ఛత్రపతి శంభాజీ మహారాజ్ వీరగాథ ఇదే..
Read Also: Jammu Kashmir: కాశ్మీర్పై ఇస్లామిక్ దేశాల ప్రేలాపన.. సొంతింటిని చక్కదిద్దుకోండని భారత్ ఘాటు సమాధానం
ఈ ఎలక్ట్రిక్ బస్సుకి పూర్తిగా అద్దాలు మూసి ఉండటంతో ప్రతి విండో వద్ద అత్యవసర ఏర్పాట్లు చేశారు. విధుల్లో ఉన్న సిబ్బంది ఈ బస్ ని ఆసక్తిగా తిలకించారు. డిపోలో ఛార్జింగ్ పాయింట్ వ్యవస్థ నిర్మాణంలో ఉంది. ఇప్పటికే ఛార్జింగ్ పాయింట్ బాక్సులు డిపోకు చేరుకున్నాయి. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే సుమారు 240 కిలోమీటర్లు వరకు ఛార్జింగ్ ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ నెల 21న ప్రారంభం చేయనున్నట్లు అలిపిరి డిపో మేనేజర్ హరిబాబు తెలిపారు.
మరోవైపు తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలుకు కట్టుదిట్టమైన భధ్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. గరుడ సేవకు 6 లక్షల మంది భక్తులు తరలివస్తారని అంచనా వేస్తున్నారు టీటీడీ అధికారులు. బ్రహ్మోత్సవాలకు 7 వేల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. బ్రహ్మోత్సవాల భద్రతపై త్వరలోనే డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించే అవకాశం వుందని తెలుస్తోంది. ఇప్పటికే బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఇఓ ధర్మారెడ్డితో సమావేశం నిర్వహించారు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి.
Read Also: Tirumala: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల షెడ్యూల్.. ఏ రోజు ఏ వాహన సేవ..?
తాజావార్తలు
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
Indian Rupee: రూపాయికి ‘చీకటి’ రోజు.. జీవితకాల కనిష్టానికి పడిపోయిన భారత కరెన్సీ..
-
Rajat Patidar: దెబ్బ గట్టిగా తాకింది, ఇప్పుడు బాగానే ఉన్నా.. ఇక వదలను!
-
India Bans Sugar Exports: చక్కెర ఎగుమతులపై భారత్ నిషేధం.. ఎందుకు? పూర్తి వివరాలు
-
SBI GPAI: SBI అకౌంట్ ఉన్నవారు తప్పక తీసుకోవాల్సిన పాలసీ!.. రూ.20 లక్షలు పొందే ఛాన్స్!
ట్రెండింగ్
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!