NTV Telugu Site icon

Election Commission: భద్రాద్రి సీతారాముల కళ్యాణం లైవ్ టెలికాస్ట్కు ఈసీ గ్రీన్ సిగ్నల్

Ramadu

Ramadu

Election Commission: శ్రీరామ నవమి వేళ ఎన్నికల సంఘం ( EC ) కీలక నిర్ణయం తీసుకుంది. రాముల వారి కల్యాణం లైవ్ టెలీకాస్ట్‌ చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఎన్నికల నియమావళికి అనుగుణంగా శ్రీరామ నవమి నిర్వహించాలని ఆదేశాల్లో పేర్కొనింది. కాగా, ఇటీవల భద్రాచలం సీతారాముల కల్యాణం ప్రత్యక్ష ప్రసారంపై ఈసీ ఆంక్షలు విధించింది. ఎన్నికల వేళ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడానికి వీళ్లేదని తెలిపింది. దీంతో ప్రత్యక్ష ప్రసారానికి పర్మిషన్ ఇవ్వాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కేంద్ర ఎన్నికల కమిషన్ కు లేఖ రాసింది. దాదాపు 40 ఏళ్లుగా ప్రత్యక్ష ప్రసారం జరుగుతుంది.. ఈ ఒక్క దానికి ఎన్నికల కోడ్ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆమె లేఖలో పేర్కొన్నారు. దీంతో నిబంధనలు ఉల్లంఘించకుండా రాములవారి కళ్యాణం జరుపుకోవాలని ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.

అయితే, అంతకుముందు భద్రాచలంలో సీతారాముల కళ్యాణం లైవ్ టెలికాస్ట్ చెయొద్దని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపై ఇప్పటికే పలుమార్లు ఈసీఐకి లేఖ రాసింది. ఎట్టకేలకు ఇవాళ ఎన్నికల కమిషన్ పర్మిషన్ ఇవ్వడంతో భద్రాచలంలో ముమ్మరంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.