NTV Telugu Site icon

Crime News: తల్లిని తిట్టాడని తమ్ముడిని కత్తితో పొడిచిన అన్న

Bapatla Volunteer Died

Bapatla Volunteer Died

నేరాలు, ఘోరాలు ఎక్కువైపోతున్నాయి. మద్యానికి డబ్బులివ్వలేదని తల్లిని, భార్యని కూడా కడతేరుస్తున్నారు కొందరు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో దారుణం చోటుచేసుకుంది. మైలవరంలో మద్యం మత్తులో తల్లిని తిట్టాడని తమ్ముడి ని కత్తితో పొడిచాడో అన్న. రాత్రి మద్యం సేవించి ఇంటికి వెళ్లారు అన్నదమ్ములు ప్రసన్నకుమార్,కరుణ కుమార్. రోజు త్రాగి వస్తున్నారెందుకని ప్రశ్నించింది తల్లి. మా ఇష్టం తాగుతామని తల్లిని పరుషంగా మాట్లాడాడు తమ్ముడు కరుణ కుమార్. దీంతో అన్నదమ్ముల మధ్య గొడవ ప్రారంభం అయింది.

Read Also: K. Viswanath: హిందీలోనూ అలరించిన విశ్వనాథ్!

అమ్మని తిడతావా నిన్ను చంపేస్తా అంటూ వంటగదిలో కూరగాయలు కోసే కత్తి తీసుకు వచ్చి తమ్ముడు కరుణ కుమార్ ని ఎడమ వైపు ఛాతీలో,డొక్కలో పొడిచాడు అన్న ప్రసన్న కుమార్. దీంతో తీవ్రంగా గాయపడ్డాడు తమ్ముడు కరుణ కుమార్. హుటాహుటిన తమ్ముడు కరుణ కుమార్ ని మైలవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. చికిత్స పొందుతూ మరణించాడు కరుణ కుమార్. తండ్రి నాగేశ్వరరావు ఫిర్యాదు మేరకు ప్రసన్న కుమార్ ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మద్యం మత్తులో ఒక కొడుకుని పోగొట్టుకుని, మరో కొడుకు జైలు పాలు కావడంతో విషాదంలో మునిగిపోయింది కుటుంబం.

Read Also: K. Viswanath: హిందీలోనూ అలరించిన విశ్వనాథ్!