Petrol and Diesel Shortage: పుకార్లు నమ్మవద్దు.. పెట్రోల్, డీజిల్ కొరత లేదు: CP సజ్జనార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్తో పాటు తెలంగాణవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరత ఉందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు కేవలం పుకార్లేనని అధికారులు స్పష్టం చేశారు. గుజరాత్లో తలెత్తిన కొన్ని తాత్కాలిక ఇబ్బందులను సాకుగా చూపి, స్థానికంగా కొరత ఉందనే అపోహలను సృష్టించడం వల్ల ప్రజలు ఆందోళనతో బంకుల వద్ద క్యూ కడుతున్నారు. అసలేం జరుగుతోందంటే.. గత కొద్దిరోజులుగా గుజరాత్ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ సరఫరాలో అంతరాయం కలిగిందనే వార్తలు వచ్చాయి. దీనిని ఆధారం చేసుకుని, హైదరాబాద్లో కూడా ఇంధన కొరత రాబోతోందని సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు మొదలయ్యాయి. ఈ వార్తలను నమ్మిన వాహనదారులు ఒక్కసారిగా పెట్రోల్ బంకులకు పోటెత్తారు. దీనివల్ల సాధారణం కంటే 3 రెట్లు ఎక్కువ డిమాండ్ పెరిగి, కొన్ని బంకుల్లో స్టాక్ త్వరగా ఖాళీ అవ్వడంతో ‘కృత్రిమ కొరత’ ఏర్పడింది.
ఈ పరిస్థితిపై హైదరాబాద్ సీపీ సజ్జనార్ , హైదరాబాద్ కలెక్టర్ హరిచందన స్పందించారు. నగర పరిధిలోని 186 పెట్రోల్ బంకుల వద్ద పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నామని వారు తెలిపారు. బంకులకు కావాల్సిన అంత ఇంధన సరఫరా నిరంతరాయంగా జరుగుతోందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 60 రోజులకు సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు అందుబాటులో ఉన్నాయన్నారు. చమురు సంస్థలైన HPCL, IOCL, BPCL నుంచి సరఫరా గొలుసు (Supply Chain) సజావుగా సాగుతోంది. కాబట్టి.. ముందస్తుగా నిల్వ చేసుకోవడం వల్ల అనవసర రద్దీతో పాటు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
Also Read
- CM Revanth Reddy: రేవంత్ రెడ్డిగా మొదలై.. నేడు మీ అందరి గుండెల్లో “రేవంతన్న”గా.. భావోద్వేగ ట్వీట్ చేసిన సీఎం.!
- Centre Orders Google, Apple: ప్రయాణికుల భద్రతకు ముప్పు.. గూగుల్, యాపిల్కు కేంద్రం కీలక ఆదేశాలు
- Thailand: 11 ఏళ్ల బాలుడి ర్యాష్ డ్రైవింగ్.. 9 మంది సన్యాసుల ప్రాణాలు బలి.! వీడియో వైరల్..
- Ahilyanagar: అదుపుతప్పి బోల్తా పడ్డ స్కూల్ బస్సు.. 50 మంది విద్యార్థులతో వెళ్తుండగా ప్రమాదం.!
Also Read:Kavitha Party: తెలంగాణలో మరో కొత్త పార్టీ.. మార్చి 27న ప్రకటన..
సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు వ్యాప్తి చేసే వారిపై నిఘా పెట్టామని, అపోహలు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్ చేసే వారిని వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. ప్రజలు కేవలం అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలి. పెట్రోల్ బంకుల వద్ద అనవసరంగా గుమిగూడకుండా.. సాధారణ అవసరాలకు మాత్రమే ఇంధనాన్ని తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: రేవంత్ రెడ్డిగా మొదలై.. నేడు మీ అందరి గుండెల్లో “రేవంతన్న”గా.. భావోద్వేగ ట్వీట్ చేసిన సీఎం.!
-
Lalu Prasad Yadav: బీహార్ ప్రభుత్వం యూటర్న్.. లాలూ ప్రసాద్, రబ్రీ దేవికి మళ్లీ Z కేటగిరీ భద్రత..
-
Centre Orders Google, Apple: ప్రయాణికుల భద్రతకు ముప్పు.. గూగుల్, యాపిల్కు కేంద్రం కీలక ఆదేశాలు
-
Janhvi Kapoor: ఒక్క ఇన్స్టా పోస్ట్కే అన్ని లక్షలా!… జాన్వీ డిజిటల్ ఆదాయం షాకింగ్
-
Thailand: 11 ఏళ్ల బాలుడి ర్యాష్ డ్రైవింగ్.. 9 మంది సన్యాసుల ప్రాణాలు బలి.! వీడియో వైరల్..
ట్రెండింగ్
-
Smartphones in Budget: రూ. 15,000 లోపు భారీ బ్యాటరీ లైఫ్ బెస్ట్ 5G స్మార్ట్ఫోన్లు ఇవే.. రెండు రోజుల బ్యాకప్ గ్యారెంటీ!
-
EV కారు కొనాలనుకుంటున్నారా? Hyundai Creta ఎలక్ట్రిక్ కు కొత్త BaaS ప్లాన్.. రూ.7 లక్షల వరకు తగ్గింపు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ అరంగేట్రంపై విమర్శలు.. మా ఇష్టం అంటూ మాజీలకు గట్టిగా ఇచ్చిపడేసిన బీసీసీఐ!
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!