IPS Story: రూ.50 లక్షల ఫారిన్ ఉద్యోగం వదిలేసి.. ఎస్పీగా మారిన సంతోష్ కథ..
- రూ.50 లక్షల ఫారిన్ ఉద్యోగం వదిలేసి వ్యక్తి
- దేశ సేవ చేయాలనే లక్ష్యంతో భారత్ కు తిరివచ్చారు
- యూపీఎస్సీని చేధించి ఎస్పీగా మారారు
ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లో ఓ కేసు వార్తల్లో నిలుస్తోంది. ఇక్కడ గోరఖ్పూర్కు ఆనుకుని ఉన్న ఖుషీనగర్లో నకిలీ నోట్ల వ్యాపారం బట్టబయలైంది. ఈకేసును చేధించిన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఐపీఎస్ సంతోష్ కుమార్ మిశ్రా కూడా వార్తల్లో నిలిచారు. దీనికి ముందు..ఆయన యుపిలోని అనేక ఇతర జిల్లాల్లో కూడా ఎస్పీగా పనిచేశారు. ఖుషీనగర్ ఎస్పీ సంతోష్ కుమార్ మిశ్రా ఐపీఎస్ ప్రయాణం అందరినీ ఆకట్టుకుంటోంది. ఆయన మంచి ఫారిన్ ఉద్యోగం వదిలేసి యూపీఎస్సీ పరీక్ష రాయాలని నిర్ణయించుకున్నారు. యూపీఎస్సీలో ఉత్తీర్ణత సాధించి ఐపీఎస్ అయ్యారు.
READ MORE: Israel-Lebanon: లెబనాన్లోకి ప్రవేశించి దాడి చేసేందుకు ఇజ్రాయెల్ సిద్ధం.. సరిహద్దులో యుద్ధ ట్యాంకులు
Also Read
సంతోష్ కుమార్ మిశ్రా కథ
సంతోష్ కుమార్ మిశ్రా 2012 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. సంతోష్ కుమార్ మిశ్రా కుటుంబం బీహార్లోని భోజ్పూర్ జిల్లాకు చెందినది. సాధారణ యువకుడిలాగే సంతోష్ కుమార్ మిశ్రా 10వ, 12 తర్వాత ఇంజినీరింగ్ని ఎంచుకుని పూణే యూనివర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్ చేరారు. తన తండ్రి మిలిటరీలో ఉన్నందున, ఆయన కూడా సైన్యం, దేశ సేవ వైపు మొగ్గు చూపారు. 2004 సంవత్సరంలో.. ఆయన న్యూయార్క్ కంపెనీకి క్యాంపస్ ప్లేస్మెంట్ పొందారు. అక్కడ ఓ కంపెనీలో మంచి ప్లేస్మెంట్ వచ్చింది. కంపెనీ ఆఫర్ చేసిన ప్యాకేజీ భారతీయ రూపాయలలో 50 లక్షలు అని సంతోష్ కుమార్ మిశ్రా చెప్పారు. ప్యాకేజ్ బాగుంది కాబట్టి తాను జాయిన్ అయినట్లు తెలిపారు. ఆయన అలాగే పనిచేసి ఉంటే.. ప్రస్తుతం జీతం రూ. కోటి వరకు ఇచ్చి ఉండేది.
READ MORE: Mallikarjun Kharge: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఆయన కుటుంబంపై కేసు..!
విదేశాల్లో లక్షల విలువ చేసే ఉద్యోగాన్ని ఎందుకు వదిలేశారనే ప్రశ్న..
విదేశాల్లో లక్షల విలువ చేసే ఉద్యోగాన్ని ఎందుకు వదిలేశారనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. విదేశాలకు వెళ్లిన తర్వాత ఉద్యోగం బాగానే ఉందని, అయితే దేశానికి, సమాజానికి మనం ఏమీ చేయలేకపోతున్నామనే బాధ ఎప్పుడూ మనసులో ఉండేదని సంతోష్ కుమార్ మిశ్రా చెప్పారు. తండ్రి లక్ష్మణ్ మిశ్రా మిలటరీలో ఉండటం వల్ల చదువు, పెంపకం కూడా ఈ వాతావరణంలోనే సాగింద వివరించారు. అటువంటి పరిస్థితిలో.. ఆయన తన ఉద్యోగాన్ని వదిలి తన దేశానికి తిరిగి రావాలని నిర్ణయించుకున్నారు. ప్రజలు ఆయన నిర్ణయాన్ని పెద్దగా ఇష్టపడలేదు. కానీ 2011 సంవత్సరంలో యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. ఏడాది ఐపీఎస్ శిక్షణ అనంతరం ఆయనను ఉత్తరప్రదేశ్ కేడర్కు కేటాయించారు. ప్రొబేషన్ పీరియడ్ తర్వాత సెప్టెంబర్ 3, 2014న ఎస్పీగా ఛార్జి తీసుకున్నారు.
career, education, ips santosh mishra, success story, who left job of 50 lakhs, cracked upsc, upsc, become ips, sp-of kushinagar, kushinagar, up, nakali noton, encounter
- Tags
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బాల్ ఎలా వేసిన రిస్క్ బౌలర్లకే.. కొట్టిపడేస్తా.. బుడ్డోడు మరో సెంచరీ
-
Scientists disappear: సైంటిస్టులు మాయం.. అమెరికా, చైనాలో టెన్షన్..
-
SSC Stenographer: ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. 731 స్టెనోగ్రాఫర్ పోస్టులకు రిజిస్ట్రేషన్ ప్రారంభం
-
PM Modi : మే 9న తెలంగాణకు ప్రధాని మోడీ.. పరేడ్ గ్రౌండ్స్లో భారీ బహిరంగ సభ.!
-
Hyderabad Metro : మెట్రోపై ప్రభుత్వ హక్కు.. L&Tకి గుడ్బై!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!