Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ నోటీసులు
Delhi Liquor Case: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ సమన్లు జారీ చేసింది. రేపు విచారణకు రావాలని కవితకు నోటీసులు ఇచ్చింది. గతంలోనూ కవితకు ఈడీ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. గత మార్చిలో 3 రోజుల పాటు కవితను ఈడీ విచారించింది. ఈడీ విచారణపై గతంలో కవిత కోర్టును ఆశ్రయించింది.
Read Also: TSSPDCL: పవర్ కట్ విషయంలో ఏరియా వారీగా కంట్రోల్ రూమ్
Also Read
ఢిల్లీ మద్యం కుంభకోణంలో సౌత్ గ్రూప్కు సంబంధించిన వ్యవహారాల్లో కవిత లీడ్ చేశారని ఈడీ ఆరోపిస్తోంది. అంతే కాకుండా అప్రూవర్గా మారిన అరుణ్ రామచంద్ర పిళ్లై ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా చేసుకుని కవితకు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు నాలుగు సార్లు నోటీసులు ఇచ్చారు. ఆయన ఇప్పటివరకు ఈడీ విచారణకు హాజరుకాలేదు. తాజాగా కేజ్రీవాల్కు ఈడీ నోటీసులు ఇచ్చిన సంగతి విదతమే. ఈ వారమే ఆయన విచారణ కూడా ఉంది. మొత్తానికి రేపటి విచారణకు కవిత హాజరవుతారా.. లేదా అనేది ఆమె నుంచి ఇప్పటివరకు స్పష్టత రాలేదు. ఇప్పుడు అందిన నోటీసులకు సంబంధించి ఆమె ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.
తాజావార్తలు
-
రితేష్-జెనీలియా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రాజా శివాజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ!
-
Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
-
Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం
-
Faria Abdullah: అతని కోసమే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను..
-
MS. Subbalakshmi : ఎం.ఎస్. సుబ్బలక్ష్మి బయోపిక్ పుకార్లపై క్లారిటీ ఇచ్చిన బన్ని వాస్
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!