Suresh Raina: టీమిండియా మాజీ క్రికెటర్ కు ఈడీ షాక్.. నేడే విచారణ
- నేడు మాజీ క్రికెటర్ సురేష్ రైనాకు ఈడీ నోటీసులు..
- బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసులో.. విచారణకు హాజరుకానున్న రైనా..
- ఢిల్లీలోని ఆఫీసులో సురేష్ రైనాను విచారించనున్న ఈడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suresh Raina: టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనాకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షాక్ ఇచ్చింది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసులో విచారణకు రావాలని సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ (ఆగస్టు 13న) ఢిల్లీలోని తమ కార్యాలయంలో హాజరు కావాలని ఆదేశించింది. అనధికారిక బెట్టింగ్ యాప్ 1xBetకి సంబంధించి కొంతమంది ద్వారా మద్దతు ఇచ్చినట్లు అనుమానాలు ఉన్నాయి.. వాటిపై స్పష్టత కోసమే విచారణ జరపాలని ఈడీ భావిస్తోంది.
Read Also: Mahabubabad: బాత్రూమ్ క్లీనర్ తాగి యువతి ఆత్మహత్యాయత్నం..
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
అయితే, దేశవ్యాప్తంగా అనధికారిక బెట్టింగ్ ప్లాట్ఫారమ్లు అనేక మంది వినియోగదారులను మోసం చేసి డబ్బును మనీ లాండరింగ్ చేస్తున్నట్లు ఈడీ ఇప్పటికే పలు కేసుల్లో విచారణ చేస్తుంది. ఇటీవల గూగుల్, మెటా సంస్థల ప్రతినిధులను కూడా సమన్లు జారీ చేసి, ప్రత్యామ్నాయ ద్వారా ఈ యాప్లు ఎలా ప్రచారం పొందుతున్నాయో వివరాలను తెలుసుకుంది. కాగా, 2025 మొదటి మూడు నెలల్లోనే 1.6 బిలియన్ సార్లు ఈ బెట్టింగ్ వెబ్సైట్లు, యాప్లను యూజర్లు సందర్శించారని అంచనా. భారతదేశంలో ఈ మార్కెట్ విలువ సుమారు 100 మిలియన్ డాలర్లుగా ఉందని సమాచారం.
Read Also: Coolie : ఏంటి.. కూలీ సినిమాకి నాగార్జున మరీ అంత తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నారా?
ఇక, ప్రస్తుతం 22 కోట్లకు పైగా భారతీయులు ఈ యాప్లను వినియోగిస్తుండగా, వీరిలో 11 కోట్లు రెగ్యులర్ కస్టమర్లుగా ఉన్నారని తెలుస్తుంది. ప్రతి సంవత్సరం సుమారు రూ. 27,000 కోట్ల పన్ను ఎగవేత జరుగుతున్నట్లు ఈడీ అనుమానిస్తుంది. మరోవైపు, మంగళవారం ‘పారీ మ్యాచ్’ అనే మరో యాప్పై ముంబై, ఢిల్లీ-ఎన్సీఆర్, హైదరాబాద్, జైపూర్, మధురై, సూరత్లోని 15 ప్రదేశాల్లో ఈడీ సోదాలు చేసింది. ప్రాథమిక విచారణలో రూ. 2,000 కోట్లకుపైగా మోసపూరిత లావాదేవీల ద్వారా మ్యూల్ అకౌంట్లలో డబ్బు జమ చేసి, క్రిప్టో వాలెట్లు, ఏటీఎంలు, యూపీఐ ట్రాన్స్ ఫర్ల ద్వారా మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు ఈడీ గుర్తించింది.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!