Lok Sabha Elections 2024: 45 రోజులు.. రూ.4,650 కోట్లు సీజ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లోక్సభ ఎన్నికలు 2024 నేపథ్యంలో అక్రమంగా తరలిస్తున్న నగదు, మద్యం, విలువైన వస్తువులు భారీగా పట్టుపడుతున్నాయి. ఈ క్రమంలో భారత ఎన్నికల సంఘం (ఈసీ) రికార్డు స్థాయిలో డబ్బును సీజ్ చేసింది. మార్చి 1 నుంచి ఏప్రిల్ 15 వరకు 45 రోజుల వ్యవధిలో దేశవ్యాప్తంగా రూ.4,650 కోట్ల విలువైన డబ్బు, మద్యం, మాదకద్రవ్యాలు, ఇతర తాయిలాలను ఈసీ స్వాధీనం చేసుకుంది. 2019 ఎన్నికల ప్రచారంలో స్వాధీనం చేసుకున్న రూ.3,475 కోట్లతో పోలిస్తే.. ఈసారి 34 శతం పెరిగింది.
2019 లోక్సభ ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతం సీజ్ చేసిన వస్తువుల విలువ గణనీయంగా పెరిగింది. నగదు 114 శాతం, మద్యం 61 శాతం, విలువైన లోహలు 43 శాతం పెరిగాయి. మాదకద్రవ్యాల సీజ్లు 62 శాతం పెరిగి రూ.2,068 కోట్లకు చేరుకున్నాయి. మార్చి 1 నుంచి దేశవ్యాప్తంగా జరిపిన సోదాల్లో రోజుకు సగటున రూ.100 కోట్లు విలువైన వాటిని స్వాధీనం చేసుకున్నామని ఈసీ వెల్లడించింది. మొత్తం సీజ్ చేసిన రూ.4,658 కోట్ల విలువైన వాటిలో నగదు రూ.395 కోట్లు కాగా.. మద్యం వాటా రూ.489 కోట్లకు పైగా ఉందని పేర్కొంది.
Also Read
- Telangana High Court: "సమాజంలో ఎవరికైనా బాధ్యత ఉందా".. ఉచిత పథకాలపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు..
- CM Chandrababu: వారికి ఎంతైనా ఖర్చు పెట్టాలనుంది.. కానీ ఖజానా ఖాళీగా ఉంది!
- Ajinkya Rahane: "ధోనీ, కోహ్లీ కానే కాదు.. టీమిండియా ఆల్టైమ్ గ్రేట్ అతడే".. రహానే ఆసక్తికర వ్యాఖ్యలు..
- Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
Also Read: Robert Vadra: రాహుల్ గాంధీ కాదు.. అమేథీ నుంచి రాబర్ట్ వాద్రా పోటీ!
నిబంధనలకు విరుద్ధంగా ప్రచారంలో రాజకీయ నేతలకు సహకరిస్తున్న 106 మంది ప్రభుత్వ అధికారులపై కఠిన చర్యలు తీసుకొన్నట్టు భారత ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. హెలికాప్టర్లో సోదాలు చేయడం కొత్తేం కాదని, టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ విషయంలో కూడా అదే జరిగిందని ఈడీ పేర్కొంది. అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో రాజస్థాన్లో అత్యధికంగా రూ.778 కోట్లు, గుజరాత్లో రూ.605 కోట్లు, తమిళనాడులో రూ.460 కోట్లను ఈసీ సీజ్ చేసింది. గుజరాత్లో రూ.485 కోట్లు, రాజస్థాన్లో రూ.533 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకుంది. 18వ లోక్సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ శుక్రవారం ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Telangana High Court: “సమాజంలో ఎవరికైనా బాధ్యత ఉందా”.. ఉచిత పథకాలపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు..
-
CM Chandrababu: వారికి ఎంతైనా ఖర్చు పెట్టాలనుంది.. కానీ ఖజానా ఖాళీగా ఉంది!
-
Petrol Cars India: పెట్రోల్ కార్ల శకం ముగిసిందా? ఈవీలు, హైబ్రిడ్ కార్ల అమ్మకాలు రికార్డు స్థాయికి.. మార్కెట్లో మారుతి ఆధిపత్యం
-
Ajinkya Rahane: “ధోనీ, కోహ్లీ కానే కాదు.. టీమిండియా ఆల్టైమ్ గ్రేట్ అతడే”.. రహానే ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Salman Khan: అస్సాం వరద బాధితులకు అండగా సల్మాన్ ఖాన్.. 500 కొత్త ఇళ్ల నిర్మాణానికి సహాయం
ట్రెండింగ్
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!