Dwarakatirumala: 2 వేలు విరాళం ఇస్తే… 8 కోట్లు ఇచ్చినట్టు లెక్కలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒక్కోసారి చిన్నచిన్న పొరపాట్లు జరుగుతుంటాయి. కొంతమంది దేవాలయాలకు చందాలు, విరాళాలు ఇస్తుంటారు. ఒక వ్యక్తి ఇచ్చిన విరాళం తక్కువే అయినా, కోట్లలో విరాళం ఇచ్చినట్టు దేవస్థానం రికార్డుల్లో నమోదైంది. ఏలూరు జిల్లాలోని ద్వారకా తిరుమలలోని వేంకటేశ్వరస్వామి దేవస్థానానికి శ్రీవారి నిత్య అన్నదానం ట్రస్టుకు. రూ. 2116 చెల్లించాడో భక్తుడు. కానీ రూ 8.కోట్లకు పైగా ఇచ్చినట్టు ఆన్ లైన్లో ఎంటర్ చేశాడో ఉద్యోగి. ఆ తప్పు సరిదిద్దుకునేందుకు ఆలయ అధికారులు నానా తిప్పలు పడుతున్నారు.
ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీవారి నిత్య అన్నదాన ట్రస్టుకు కు ఒక భక్తుడు రూ.2,116 విరాళం చెల్లించాడు. అతడు రూ.8 కోట్లకు పైగా చెల్లించినట్లు ఉద్యోగి ఆన్లైన్లో పొరపాటున నమోదు చేశాడు. చివరకు నగదు లావాదేవీలలో కోట్లాది రూపాయల మేర తేడా రావడంతో సంబంధిత ఉద్యోగి ఆలయ అధికారులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణానికిచెందిన ఓ భక్తుడు ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ తూర్పు రాజగోపురం ప్రాంతంలోని డొనేషన్ కౌంటర్ లో గురువారం సాయంత్రం నిత్య అన్నదానం ట్రస్టుకు రూ.2,116 విరాళంగా చెల్లించాడు. అక్కడే ఉన్న దేవస్థానం ఉద్యోగి నగదు ఎంటర్ చేయాల్సిన స్థానంలో పొరపాటున భక్తుడి నెంబర్ ఎంటర్ చేశాడు. దాంతో ఆ భక్తుడు రూ. 8 కోట్లకు పైగా విరాళం చెల్లించినట్లు ఆన్లైన్లో నమోదైంది.
Also Read
- Nagababu: జనసేన పార్టీ ఆ పార్లమెంట్ పరిధిలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది.. ఎమ్మెల్సీ నాగబాబు కీలక వ్యాఖ్యలు.!
- Cyber Crime Recovery Mela: సైబర్ క్రైమ్ రికవరీ మేళా.. 310 మంది బాధితులకు రూ.6 కోట్ల రికవరీ చెక్కులు..
- CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
- Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ఆ తరువాత ఉద్యోగి ఆ నగదు రసీదును భక్తుడికి అందించగా అతడు స్వగ్రామానికి వెళ్ళిపోయాడు. ఆ రోజు సాయంత్రం డీసీఆర్ క్లోజ్ చేసే సమయంలో కోట్ల లో నగదు తేడా వచ్చినట్లు గుర్తించారు. క్షుణ్ణంగా పరిశీలించగా అసలు విషయం బయటపడింది. ఖంగుతిన్న ఆలయ అధికారులు ప్రస్తుతం ఆ తప్పును సరిదిద్దుకునే పనిలో పడ్డారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా కోట్లలో తేడా రావడంతో ఉద్యోగి చేసిన పొరపాటు అధికారులకు తలనొప్పులు తెచ్చిపెడుతోంది.
తాజావార్తలు
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
Cleaning Tips: ఇల్లాళ్లకు స్మార్ట్ కిచెన్ ఐడియాస్.. వంటగదిని క్లీన్గా ఉంచే 12 అదిరిపోయే చిట్కాలు!
-
Nitin Nabin: గిరిజనుల అభివృద్ధికి బీజేపీ కట్టుబడింది.. కాంగ్రెస్ తెలంగాణను ఏటీఎంగా వాడుకుంటోంది
-
Trump-Iran: ఇరాన్ చర్చలు కోరింది.. రేపు దోహాలో కీలక భేటీ అంటూ ట్రంప్ ప్రకటన
-
Mahua Moitra: రామమందిర విరాళాల స్కామ్పై స్పందించరే.. బీజేపీపై మహువా మొయిత్రా ఫైర్
ట్రెండింగ్
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!