Dwarakatirumala: 2 వేలు విరాళం ఇస్తే… 8 కోట్లు ఇచ్చినట్టు లెక్కలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒక్కోసారి చిన్నచిన్న పొరపాట్లు జరుగుతుంటాయి. కొంతమంది దేవాలయాలకు చందాలు, విరాళాలు ఇస్తుంటారు. ఒక వ్యక్తి ఇచ్చిన విరాళం తక్కువే అయినా, కోట్లలో విరాళం ఇచ్చినట్టు దేవస్థానం రికార్డుల్లో నమోదైంది. ఏలూరు జిల్లాలోని ద్వారకా తిరుమలలోని వేంకటేశ్వరస్వామి దేవస్థానానికి శ్రీవారి నిత్య అన్నదానం ట్రస్టుకు. రూ. 2116 చెల్లించాడో భక్తుడు. కానీ రూ 8.కోట్లకు పైగా ఇచ్చినట్టు ఆన్ లైన్లో ఎంటర్ చేశాడో ఉద్యోగి. ఆ తప్పు సరిదిద్దుకునేందుకు ఆలయ అధికారులు నానా తిప్పలు పడుతున్నారు.
ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీవారి నిత్య అన్నదాన ట్రస్టుకు కు ఒక భక్తుడు రూ.2,116 విరాళం చెల్లించాడు. అతడు రూ.8 కోట్లకు పైగా చెల్లించినట్లు ఉద్యోగి ఆన్లైన్లో పొరపాటున నమోదు చేశాడు. చివరకు నగదు లావాదేవీలలో కోట్లాది రూపాయల మేర తేడా రావడంతో సంబంధిత ఉద్యోగి ఆలయ అధికారులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణానికిచెందిన ఓ భక్తుడు ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ తూర్పు రాజగోపురం ప్రాంతంలోని డొనేషన్ కౌంటర్ లో గురువారం సాయంత్రం నిత్య అన్నదానం ట్రస్టుకు రూ.2,116 విరాళంగా చెల్లించాడు. అక్కడే ఉన్న దేవస్థానం ఉద్యోగి నగదు ఎంటర్ చేయాల్సిన స్థానంలో పొరపాటున భక్తుడి నెంబర్ ఎంటర్ చేశాడు. దాంతో ఆ భక్తుడు రూ. 8 కోట్లకు పైగా విరాళం చెల్లించినట్లు ఆన్లైన్లో నమోదైంది.
Also Read
- Social Boycott: ఏపీలో దారుణం.. ప్రేమ పెళ్లి చేసుకున్న జంటను వెలివేసిన గ్రామ పెద్దలు.. ధిక్కరిస్తే రూ.2 లక్షల జరిమానా..!?
- AP Heatwave Alert: ఏపీలో భగ్గుమంటున్న ఎండలు.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు..
- TG Bharath vs Byreddy Siddharth Reddy: బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై మంత్రి టీజీ భరత్ క్రిమినల్ పరువునష్టం దావా
- Off The Record : జోగి రమేష్కు అనవసరంగా మైలేజ్ ఇస్తున్నారా? వైసీపీ, టీడీపీలో చర్చలు?
ఆ తరువాత ఉద్యోగి ఆ నగదు రసీదును భక్తుడికి అందించగా అతడు స్వగ్రామానికి వెళ్ళిపోయాడు. ఆ రోజు సాయంత్రం డీసీఆర్ క్లోజ్ చేసే సమయంలో కోట్ల లో నగదు తేడా వచ్చినట్లు గుర్తించారు. క్షుణ్ణంగా పరిశీలించగా అసలు విషయం బయటపడింది. ఖంగుతిన్న ఆలయ అధికారులు ప్రస్తుతం ఆ తప్పును సరిదిద్దుకునే పనిలో పడ్డారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా కోట్లలో తేడా రావడంతో ఉద్యోగి చేసిన పొరపాటు అధికారులకు తలనొప్పులు తెచ్చిపెడుతోంది.
తాజావార్తలు
-
Saroj Khan: మాధురీని ఉదాహరణగా చూపిస్తూ.. కరిష్మాపై ఫైర్ అయిన సరోజ్ ఖాన్..
-
Social Boycott: ఏపీలో దారుణం.. ప్రేమ పెళ్లి చేసుకున్న జంటను వెలివేసిన గ్రామ పెద్దలు.. ధిక్కరిస్తే రూ.2 లక్షల జరిమానా..!?
-
బ్రిటన్ మార్కెట్లోకి హీరో XPulse 200 బైక్స్.. అడ్వెంచర్ రైడర్ల కోసం కొత్త శక్తి!
-
Virat Kohli: ఐపీఎల్ చరిత్రలో విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు.. సీఎస్కే, ఎంఐ కాదు టాప్లో కేకేఆర్!
-
Medak: ఉమ్మడి మెదక్లో గాలివాన బీభత్సం.. తడిసి ముద్దయిన వరి ధాన్యం, ఆందోళనలో రైతన్నలు
ట్రెండింగ్
-
Google I/O 2026: AIలో Google దూకుడు.. కొత్త Gemini 3.5 Flash నుంచి AI చిప్స్ వరకు భారీ ప్రకటనలు.!
-
PCOS గురించి ఈ నిజాలు తెలుసా..? వైద్యులు చెబుతున్న కీలక విషయాలు ఇవే.!
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?