Dulam Nageswara Rao: కైకలూరు వైసీపీలోకి భారీగా చేరికలు.. పార్టీలోకి ఆహ్వానించిన దూలం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏలూరు జిల్లా కైకలూరు ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా కలిదిండి మండలంలో లోడిద లంక, పలాటపాలెం గ్రామాల్లో ఎమ్మెల్యే అభ్యర్థి దూలం నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రచారానికి వెళ్తుంటే డీఎన్ఆర్ అన్న ఎన్నికలకు 13 రోజులే ఉంది.. నీవు మా దగ్గరికి రావాలా అన్న అని ప్రజలు అంటున్నారని చెప్పుకొచ్చారు. జగనన్న సంక్షేమా పథకాలు ప్రజల్ని ఎంత దగ్గర చేస్తున్నాయో అర్థమవుతుందని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైకలూరులో మంచి మెజార్టీతో గెలుస్తుందన్నారు. ఇక, ప్రతిపక్షం వారు మూకుమ్మడిగా నాపై అనేక అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఒక ఆడపిల్లని అడ్డుపెట్టుకుని కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దూలం నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Rohit Sharma Birthday: రో.. ఈ ఏడాది నీ కలలు నిజమవుతాయి: రితికా సజ్దే
Also Read
కాగా, నాపై అసత్య వీడియో చిత్రీకరించి వాట్సాప్ లో సోషల్ మీడియాలో అలజడి చేస్తున్నారని కైకలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దూలం నాగేశ్వరరావు అన్నారు. దీనిపై సైబర్ క్రైమ్ కి, స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తిని పోలీసులు విచారిస్తుంటే ప్రతిపక్ష నాయకుడు కామినేని శ్రీను పోలీస్ స్టేషన్ కి వెళ్లి బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు. నా మీద కావాలనే ప్రతిపక్ష నాయకుడు బురద జలటమే కాకుండా అసత్య ప్రచారం చేసిన వారిని కాపాడటానికి ప్రయత్నిస్తున్నారన్నారు. ఇలాంటి చౌక బార్లు పనులు మానుకొని ఎలక్షన్ లో నా మీద గెలిచి చూపించాలి తప్ప.. గెలవనేని వారు ఇలాంటి ఆరోపణలు చేస్తూ ఉంటారని చెప్పుకొచ్చారు.
Read Also: Aroori Ramesh: పిచ్చిగా మాట్లాడితే దళిత వర్గాలు ఊరుకోరు.. కడియంపై ఆరూరి కీలక వ్యాఖ్యలు
ఇక, సోషల్ మీడియాలో నా మీద తప్పుడు ప్రచారం చేసే వారి మీద కేసు పెడితే దూలం నాగేశ్వరరావు బీసీల మీద కేసులు పెట్టి వేధిస్తున్నాడంటూ ప్రతిపక్ష నాయకుడు కామినేని శ్రీను ప్రచారం చేయటం దారుణమని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దూలం నాగేశ్వరావు అన్నారు. అన్ని పార్టీలు జతకట్టిన మా జగనన్న సింగల్ గా వస్తాడని అలాగే, కైకలూరు నియోజకవర్గంలో నేను కూడా సింగిల్ గానే వస్తానని మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో ఎవరి బలం ఏంటో తేలిపోతుందని దూలం నాగేశ్వరావు తెలిపారు. ప్రజా ఆశీర్వాద యాత్ర చూస్తుంటే పడటపాలెంలో వంద మంది టీడీపీ, జనసేన పార్టీల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిన యువకులకు ఎమ్మెల్యే అభ్యర్థి దూలం నాగేశ్వరావు కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
తాజావార్తలు
-
Russia: నాటో కూటమిలో చీలిక తెచ్చేందుకు పుతిన్ బిగ్ ప్లాన్.!
-
Sugar Price Hike: పండుగల వేళ చక్కెర ధరకు రెక్కలు.. తాజాగా ఎంత పెరిగిందంటే..!
-
Vijaya Dairy Chairman Post: విజయ డైరీ ఛైర్మన్ ఎంపికకు బ్రేక్.. వారం రోజులు వాయిదా..
-
North Korea: కిమ్ జోంగ్ ఉన్ ఎక్కడ? రెండు నెలలుగా కనిపించని ఉత్తర కొరియా అధినేత
-
Medico Priyanka : కిమ్స్లో కూతురు మృత్యుపోరాటం.. తండ్రి కన్నీటి వేడుకోలు.!
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!