Duddilla Sridhar Babu : ప్రజల తీర్పును బాధ్యతారాహిత్యంగా చేశారు కాబట్టే కాంగ్రెస్కి పట్టం కట్టారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొత్త సంవత్సరంలో ప్రజలతో పాటు.. మా ప్రతిపక్ష సభ్యులు కూడా బాగుండాలన్నారు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2018లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన 36 రోజుల తర్వాత.. అసెంబ్లీ సమావేశాలు పెట్టారన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ప్రజల తీర్పును బాధ్యతారాహిత్యంగా చేశారు కాబట్టి.. కాంగ్రెస్ కి పట్టం కట్టారని, ప్రజల తీర్పు గౌరవిస్తూ 48 గంటల్లో రెండు గ్యారంటీలు అమలు చేశామన్నారు. ఆరున్నర కోట్ల మంది మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు వసతి కల్పించామని ఆయన తెలిపారు. బీఆర్ఎస్ నేతల తీరు.. నవ్విపోదురు గాకా.. నాకేంటి సిగ్గు అన్నట్టు ఉందని మంత్రి శ్రీధర్ బాబు ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నేతలను చూస్తుంటే మాకు సిగ్గు అనిపిస్తుంది.. జాలి వేస్తోందన్నారు. అధికారం వాళ్ళకే సొంతం.. ఇంకా ఎవరు పాలించొద్దు అనే ధోరణి లో ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఓటమి తర్వాత.. ప్రజల నాడీ అర్థం చేసుకుంటాం అని అనుకున్నామని, కానీ వారి వ్యవహారం మాత్రం మారలేదని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ హామీలపై ఓ బుక్ తీశారు.. దానిపై మా ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నామన్నారు.
2014 నుండి 2023 వరకు బీఆర్ఎస్ పరిపాలనే చేశారని, బీఆర్ఎస్ 3500 రోజులు పాలించింది.. కాంగ్రెస్ వచ్చి 30 రోజులు కాలేదని ఆయన అన్నారు. 30 రోజులను కూడా ఓర్వలేకుండా పొయిందని, విష ప్రచారం చేస్తుంది బీఆర్ఎస్ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు అంతా తొందరపాటు.. ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలు అమలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఏడాది తర్వాతనో.. బీఆర్ఎస్ వాళ్ళు మమ్మల్ని ప్రశ్నిస్తే దానికో అర్థం ఉందని, మీరు ఎన్నికల్లో ముస్లిం రిసేర్వేషన్ ఇస్తామని.. అవినీతి కి పాల్పడితే కొడుకైనా.. బిడ్డనైన జైల్లో పెడతా అన్న కేసీఆర్ ఏం చేశారన్నారు. కేంద్రం నుండి రావాల్సిన ఐఐఎం, ఐటీఐఆర్ ఏమైంది అని ఆయన ప్రశ్నించారు. ఎవరు 420.. ఎవరు డబుల్ 420 అనేది ప్రజలే భేరీజు వేసుకుంటారని, బీఆర్ఎస్ కి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు లేక.. ఆవేదనలో మట్లాడుతున్నారన్నారు. తెలంగాణ పాలిట పాపం.. శాపం బీఆర్ఎస్ అని మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. అధికారం లేదనే బాధ లో ఏదేదో మాట్లాడుతున్నారని, దేవుడు.. ప్రజలు మా వైపు ఉన్నారని, 100 రోజుల్లో మేము ఇచ్చిన గ్యారంటీలు అమలు చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు ఉద్ఘాటించారు.
Also Read
- Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!