Duddilla Sridhar Babu : సిట్టింగ్ జడ్జిని కాళేశ్వరం విచారణకు ఇవ్వాలని హైకోర్టును కోరినం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీటి రంగానికి సంబంధించి అసెంబ్లీలో శ్వేతపత్రం సమర్పించింది. శనివారం ఉదయం సభ ప్రారంభం కాగానే నీటిపారుదల శాఖపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. మంత్రి తన ప్రసంగంలో మేడిగడ్డ ప్రాజెక్టుపై ఆందోళనలను ఎత్తిచూపారు. ప్రాజెక్టుల పరిస్థితిని వివరించే సంక్షిప్త వీడియోను అసెంబ్లీలో పంచుకున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులకు సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీతో చర్చలు కొనసాగుతున్నాయని, ఎన్డీఎస్ఏ నివేదికను సభకు సమర్పించారని మంత్రి ఉత్తమ్ ఉద్ఘాటించారు. ప్రాజెక్ట్ అనంతర తనిఖీలు లేకపోవడాన్ని మంత్రి ఉత్తమ్ ఎత్తి చూపారు , కాగ్ నివేదిక ఆధారంగా జవాబుదారీ చర్యలను అమలు చేస్తామని ఉద్ఘాటించారు.
అయితే ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ ప్రాంగణంలో మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిట్టింగ్ జడ్జిని కాళేశ్వరం విచారణకు ఇవ్వాలని హైకోర్టు ను కోరామని ఆయన వెల్లడించారు. జడ్జి లు తక్కువ ఉన్నారు అని హైకోర్టు నుంచి రిప్లై వచ్చిందని, మళ్ళీ లేఖ రాస్తామని ఆయన పేర్కొన్నారు. మా మ్యానిఫెస్టోలో జ్యూడిషియల్ విచారణ అని స్పష్టం చేసామని, సీబీఐ విచారణ కేంద్రం చేస్తా అంటే మేము వద్దు అన్నామని ఆయన పేర్కొన్నారు. సీబీఐ ఒకటే కాదు వాళ్ళు చేయాలనుకుంటే ED, CVC ఉందని, వాటితో విచారణ చేస్తే బీఅరెస్, బీజేపీ ఒకటవువతారు అన్న అనుమానం మాకు ఉందన్నారు. కాగ్ నివేదిక మీద కూడా విచారణ జరిపిస్తామని, గతంలో సిట్టింగ్ జడ్జి చేత పలు విచారణలు జరిగాయి, సిట్టింగ్ జడ్జి ని ఎపుడు ఇవ్వలేదు అన్న వాదనలు అవాస్తవమన్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంటే కాళేశ్వరం మీద విచారణ జరిపించే వాళ్ళు …సిట్టింగ్ జడ్జి ని ఇచ్చే వాళ్ళు విచారణకు అని ఆయన అన్నారు.
Also Read
- Hyderabad: షా గౌస్, మెహ్ఫిల్లలో దారుణంగా కిచెన్లు.. ఈగలు, మురికి కూపాలను చూసి షాకైన అధికారులు!
- Venezuela: ప్రాణమిచ్చి పాపను కాపాడిన తల్లి.. వెనిజులా భూకంప శిథిలాల మధ్య గుండెల్ని పిండేసే కథనం!
- Aman Sanger: నాలుగేళ్లలో ఐదున్నర లక్షల కోట్ల సంపాదన.. 25 ఏళ్ల భారతీయ కుర్రాడి సక్సెస్ స్టోరీ..
- Anant Ambani: టీటీడీకి రూ.27.5 కోట్ల భారీ విరాళం.. 50 మంది డ్రైవర్లు, ఛార్జింగ్ స్టేషన్ కూడా!
అనంతరం ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి అసెంబ్లీ లాబీలో చిట్ చాట్ నిర్వహించారు. రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. మిషన్ భగీరథ ఫెయిల్యూర్ స్కీమ్ అని, గ్రౌండ్లో సర్వే చేయకుండా వేల కోట్లు ఖర్చు పెట్టి స్కీమ్ స్టార్ట్ చేశారన్నారు. ఊర్లలో మిషన్ భగీరథ నీళ్లు రాక పోవడం, అవి క్లీన్ గా లేకపోవడంతో పబ్లిక్ మినరల్ వాటర్ తాగుతున్నారని, మిషన్ భగీరథ ఓపెనింగ్ పైలాన్ నా నియోజకవర్గంలో చౌటప్పల్లో హరీష్ ఓపెన్ చేశారన్నారు. 3 రోజుల కు ఒక సారి చౌటప్పల్ లో నీళ్లు వస్తున్నాయి అవి క్లీన్ గా ఉండటం లేదని, మునుగోడు, దేవరకొండ కు సాగు నీరు ఇవ్వాలని సీఎం కి వినతి పత్రం ఇస్తామన్నారు. డిండి ప్రాజెక్టు కోసం ఎదుల రిజర్వాయర్ నుంచి నీళ్లు తీసుక రావడం కోసం ప్లాన్ రెడీ చేసామని, మునుగోడు, దేవరకొండ లో 3.60 లక్షల ఎకరాల కు నీళ్లు వస్తాయని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
NBK 112 : బాలయ్య -కొరటాల మాస్ సినిమా కాదు.. అంతకుమించి
-
Hyderabad: షా గౌస్, మెహ్ఫిల్లలో దారుణంగా కిచెన్లు.. ఈగలు, మురికి కూపాలను చూసి షాకైన అధికారులు!
-
Lenin movie trailer : లెనిన్ ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్.. అయ్యగారు ఆన్ ట్రాక్
-
Stokes-Archer: వికెట్ పడినా సెలబ్రేషన్స్ చేసుకొని ఆర్చర్.. స్టోక్స్ అసహనం.. అసలు కారణం ఇదే!
-
Venezuela: ప్రాణమిచ్చి పాపను కాపాడిన తల్లి.. వెనిజులా భూకంప శిథిలాల మధ్య గుండెల్ని పిండేసే కథనం!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!