Duddilla Sridhar Babu : క్లస్టర్ల వారీగా ప్రతి రంగాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సచివాలయంలో తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబుతో బుధవారం కాన్సుల్ జనరల్ ఆఫ్ ఫ్రాన్స్ కన్సులేట్ జనరల్ బెంగళూరు, థేయిరి బెర్తెలోట్ మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఏ సందర్బంగా రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, అనువైన వాతావరణం తదితర అంశాలను మంత్రి ఫ్రాన్స్ కాన్సూల్ జెనరల్ బెర్తేలోట్ కు వివరించారు. రాష్ట్రంలో త్వరలో నిర్వహించబోతున్నా ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమ విశేషాలను పంచుకున్నారు. క్లస్టర్ల వారీగా ప్రతి రంగాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు ఐఐటీ లు, ఐఐఐ లు, ఐ ఎస్ బి లాంటివి హైదరాబాద్ లో ఉన్నాయని, 165 ఇంజనీరింగ్ కాలేజి లు ఉన్నాయని, ప్రపంచ వ్యాప్తంగా ది బెస్ట్ మ్యాన్ పవర్ ఇచ్చే రాష్ట్రమగా తెలంగాణ ఉండబోతోందని మంత్రి వివరించారు.
హైదరాబాద్ లో ని టి హబ్ లో ఏర్పాటు కానున్న ఫ్రాన్స్ కాన్సులేట్ హైదరాబాద్ కార్యాలయం త్వరలో ప్రారంభించనున్నట్టు కాన్సల్ జనరల్ బెంగళూరు థేయిరి బెర్తెలోట్ మంత్రికి తెలిపారు. ఈ కార్యక్రమానికి ఫ్రాన్స్ ఇండియా అంబాసిడర్ రానున్నట్టు తెలిపిన ఆయన మంత్రి శ్రీధర్ బాబు ను ఆహ్వానించారు. కార్యక్రమంలో ఐటి, ఇండస్ట్రీస్ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ కూడా ఉన్నారు.
Also Read
- IND Vs IRE: టీమిండియాకు షాక్.. కొంపముంచనున్న వర్షం.. ఐర్లాండ్దే సిరీస్..
- Womens T20 World Cup: ముగిసిన టీమిండియా బ్యాటింగ్.. ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే..
- Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీకి అన్యాయం.. రెండో టీ20లో కూడా అదే తప్పు’..
- Ben Stokes: క్రికెట్ ప్రపంచాన్ని షాక్కు గురిచేసిన బెన్ స్టోక్స్.. రిటైర్మెంట్ ప్రకటన..
మంత్రి తో టెలి పెర్ఫార్మన్స్ కంపెనీ ప్రతినిధుల భేటీ
ఫ్రాన్స్ కి చెందిన ప్రముఖ సంస్థ టెలి పెర్ఫార్మన్స్ ప్రతినిధులు ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు తో భేటీ బుధవారం సచివాలయం లో భేటీ అయ్యారు. ఆ సంస్థ ఈ నెల 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఐటీసీ కోహినూర్ లో నిర్వహిస్తున్న ఇమ్మెన్సీవ్ ఈవెంట్ కు అతిధిగా రావాలని ఆహ్వానించారు. దేశ వ్యాప్తంగా తమ సంస్థలో 90 వేల మంది ఉద్యోగులు, ప్రపంచ వ్యాప్తంగా 95 దేశాల్లో 5 లక్షల మంది కి పైగా ఉద్యోగులు 300 పైగా భాషల్లో పనిచేస్తున్నారని మంత్రికి తెలిపారీ. త్వరలోనే హైదరాబాద్ తో పాటు ద్వితీయ శ్రేణి నగరాలుగా ఉన్న పలు జిల్లా కేంద్రాల్లోనూ తాము తమ సంస్థను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి గా ఉన్నామని కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మమతా లంబ మంత్రి కి వివరించారు. టెలి పెర్ఫార్మన్స్ సంస్థ పెట్టుబడులకు, సంస్థ కార్యకలాపాకు ప్రభుత్వం తరుపున అన్ని సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. సమావేశంలో ఐటి, ఇండస్ట్రీస్ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ తో పటు కంపెనీ ప్రతినిధులు శివ ఊలపల్లి, ఫనిందర్ నల్లబెల్లి, స్వాతి పాల్గొన్నారు.
తాజావార్తలు
-
IND Vs IRE: టీమిండియాకు షాక్.. కొంపముంచనున్న వర్షం.. ఐర్లాండ్దే సిరీస్..
-
NTR – Trivikram Movie: రేపే ఎన్టీఆర్-త్రివిక్రమ్ ‘God Of War’ అనౌన్స్మెంట్!
-
Garuda Puran: చనిపోయిన వారి బట్టలు ఇంట్లో ఉంచుతున్నారా? గరుడ పురాణంలో చెప్పిన భయంకరమైన నిజాలు ఇవే!
-
Komatireddy Venkat Reddy : రేవంత్పై కోమటిరెడ్డి ప్రశంసలు.. నల్లగొండలో 12 సీట్లు మావే.!
-
Womens T20 World Cup: ముగిసిన టీమిండియా బ్యాటింగ్.. ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!