Dubbing Movies : డబ్బింగ్ సినిమాలకు సంక్రాంతికి ఇబ్బందులు తప్పేలా లేవు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంక్రాంతి సీజన్ అంటే ఎప్పటిలాగే థియేటర్లపై మొదటి హక్కు తెలుగు సినిమాలదే. ఈసారి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ది రాజాసాబ్ సినిమాతో ముందుగానే జనవరి 9న బరిలోకి దిగుతున్నాడు. ఆ వెంటనే మెగాస్టార్ చిరంజీవి జనవరి 12న మన శంకర వరప్రసాద్ గారు వస్తున్నారు సినిమాతో రంగంలోకి వస్తున్నాడు. వీటితో పాటు మాస్ మహారాజా రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి, శర్వానంద్ నారి నారి నడమ మురారి, నవీన్ పొలిశెట్టి అనగనగా ఒకరాజు సినిమాలు కూడా సంక్రాంతి బరిలోకొస్తున్నారు. థియేటర్లలో మెజారిటీ షోస్ ముందుగా తెలుగు సినిమాలకే కేటాయిస్తారు.
Also Read : Kalam kaval : రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘మమ్ముట్టి’ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ కాలంకవాల్
Also Read
ఇక డబ్బింగ్ సినిమాల విషయానికి వస్తే దళపతి విజయ్ చివరి సినిమా అంటూ ప్రచారం జరుగుతున్న జననాయగన్ పై భారీ అంచనాలున్నాయి. అయితే ఈ సినిమా కూడా జనవరి 9న రిలీజ్ కానుంది కాని సంక్రాంతి సీజన్లో తెలుగు సినిమాలే థియేటర్లను ఆక్రమిస్తే, హైదరాబాద్లో కొన్ని మెయిన్ థియేటర్లు తప్ప బిజీ సెంటర్లలో ఈ సినిమాకు స్క్రీన్స్ దొరకడం కష్టమేనన్నది ట్రేడ్ టాక్. గతంలోనూ ఇలాంటి సిచ్యుయేషన్ ఎదురైనప్పుడు డబ్బింగ్ సినిమాలు రిలీజ్ వాయిదా వేసుకున్న ఉదాహరణలూ ఉన్నాయి. ఇదే పరిస్థితి శివకార్తికేయన్, శ్రీలీల కాంబినేషన్ లో సుధా కొంగర తెరకెక్కిస్తున్న పరాశక్తి సినిమాకూ ఎదురయ్యింది. కంటెంట్ బలంగా ఉన్నా, సంక్రాంతి సమయంలో థియేటర్స్ ఇవ్వడంలో డబ్బింగ్ సినిమాలకు ఎప్పుడూ చివరి ప్రాధాన్యమే. డిస్ట్రిబ్యూటర్లు కూడా ముందుగా తెలుగు సినిమాలకు థియేటర్లు ఇచ్చి, మిగిలితేనే డబ్బింగ్ సినిమాలపై దృష్టి పెడతారు. దీంతో ఈసారి కూడా డబ్బింగ్ సినిమాలకు సంక్రాంతి ఇబ్బందులు తప్పేలా లేవన్నది ఇండస్ట్రీ టాక్. సంక్రాంతి బరిలో ఎవరు నిలుస్తారు, ఎవరు గెలుస్తారు అనే చర్చ ఆసక్తిగా మారింది.
తాజావార్తలు
-
Vizag: నమ్మినవాడే ప్రాణాలు తీశాడు.. వీడిన అక్కయ్యపాలెం మర్డర్ మిస్టరీ
-
Crime: కాపాడాల్సిన బాబాయే కీచకుడయ్యాడు.. ప్రైవేట్ ఫోటోలతో బెదిరించి బాలికపై దారుణం..
-
Pawan Kalyan : రాష్ట్రం కోసమే రాజీ పడ్డాను.. పొత్తులో మీ ఆత్మగౌరవం దెబ్బతింటే ఊరుకోను
-
Gas Pipeline: భారత్ మాస్టర్ ప్లాన్.. సముద్రగర్భంలో భారీ గ్యాస్ పైప్లైన్..
-
Polavaram: పోలవరం నిర్వాసితులకు రూ. 307 కోట్ల పరిహారం.. 2027 నాటికి ప్రాజెక్ట్ పూర్తి: మంత్రి నిమ్మల రామానాయుడు
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..