West Bengal: మహిళ అస్థిపంజరాన్ని తవ్వి బయటకు తీసిన యువకుడు.. దాంతో ఏం చేశాడంటే?
- పశ్చిమ బెంగాల్ తూర్పు మేదినీపూర్ జిల్లాలో ఘటన
- పంజరంతో సెల్ఫీ తీసుకుంటూ పట్టుబడ్డ యువకుడు
- ఇది చూసి ఆశ్చర్యానికి గురైన గ్రామస్థులు
- యువకుడిని పట్టుకుని చితక బాదిన గ్రామస్థులు
- ఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్ రాష్ట్రం తూర్పు మేదినీపూర్ జిల్లాలోని కాంతి ప్రాంతంలో ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ నివసిస్తున్న ఒక యువకుడు ఏడేళ్ల మహిళ అస్థిపంజరంతో సెల్ఫీ తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో కలకలం సృష్టించింది. స్థానికులు సమాచారం ప్రకారం.. ఏడు సంవత్సరాల క్రితం కాంతి ప్రాంతంలో ఒక స్థానిక మహిళను ఖననం చేశారు. తాజాగా అదే స్త్రీ అస్థిపంజరాన్ని ఆ యువకుడు సమాధి నుంచి తవ్వి బయటకు తీశాడు. అనంతరం అతను అస్థిపంజరంతో నిలబడి సెల్ఫీలు తీసుకోవడం ప్రారంభించాడు. ఇది చూసిన గ్రామస్థులు ఆశ్చర్యపోయారు. ఆ యువకుడిని ప్రభాకర్ సీతగా గుర్తించారు.
READ MORE: Nambala Keshava Rao: బీటెక్ టు నక్సలిజం.. 43 ఏళ్లుగా అజ్ఞాతంలోనే!
Also Read
- VD Satheesan: 'సీఎం ఇలా ఏడవకూడదు..' గురువు భార్య వద్ద కాబోయే సీఎం భావోద్వేగం..!
- Trisha Krishnan: సీఎం విజయ్ గురించి అభిమాని అడిగిన ప్రశ్నకు త్రిష ఎలా సిగ్గు పడిందో చూడండి..(వీడియో)
- Petrol and Diesel Prices: మళ్లీ పెరగనున్న పెట్రో ధరలు..! ఇంధన ధరలపై నిపుణుల హెచ్చరిక
- Borewell Rescue: 10 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్.. 300 అడుగుల బోర్వెల్లో చిక్కుకున్న చిన్నారి సురక్షితం.!
ఈ ఘటన తర్వాత ఆగ్రహానికి గురైన గ్రామస్థులు ఆ యువకుడిని పట్టుకుని చితకబాదారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్రామస్థులు అతన్ని పోలీసులకు అప్పగించడానికి నిరాకరించారు. దీంతో పోలీసులకు, గ్రామస్థులకు మధ్య తోపులాట జరిగిందని, స్థానికులు పోలీసులపై ఇటుకలు విసిరినట్లు తెలుస్తోంది. ఈ ఘర్షణలో ముగ్గురు పోలీసులు గాయపడ్డారు. దాదాపు రెండు గంటల పాటు గ్రామస్థులతో మాట్లాడిన పోలీసులు.. చివరకు జనసమూహాన్ని నియంత్రించి, తీవ్రంగా గాయపడిన యువకుడిని కాంతి ఉపజిల్లా ఆసుపత్రిలో చేర్చారు.
READ MORE: China- Pakistan: భారత్ పాక్ ఉద్రిక్తత మధ్య.. పాకిస్థాన్, చైనా మధ్య కీలక ఒప్పందం..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ యువకుడు మద్యం మత్తులో ఉన్నాడు. అతని వద్ద ఓ మద్యం బాటిల్ కూడా దొరికింది. ప్రాథమిక దర్యాప్తులో ఆ యువకుడు గతంలో వేరే రాష్ట్రంలోని ఓ హోటల్లో పనిచేసేవాడని, మద్యానికి బానిసైన కారణంగా అతన్ని ఉద్యోగం నుంచి తొలగించారని తేలింది. అతను ఆ మహిళ అస్థిపంజరాన్ని ఎందుకు తవ్వి తీశాడో అనే అంశంపై స్పష్టత రాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Jayam Ravi: బ్రేకప్ చెప్పేసిన కెనీషా ఫ్రాన్సిస్? జయం రవికి భారీ షాక్, చెన్నై వదిలేసి?
-
VD Satheesan: ‘సీఎం ఇలా ఏడవకూడదు..’ గురువు భార్య వద్ద కాబోయే సీఎం భావోద్వేగం..!
-
Trisha Krishnan: సీఎం విజయ్ గురించి అభిమాని అడిగిన ప్రశ్నకు త్రిష ఎలా సిగ్గు పడిందో చూడండి..(వీడియో)
-
Hanuman : మళ్లీ ‘హనుమాన్’ జాతర.. ఈసారి 3Dలో థియేటర్లు దద్దరిల్లడం ఖాయం!
-
Petrol and Diesel Prices: మళ్లీ పెరగనున్న పెట్రో ధరలు..! ఇంధన ధరలపై నిపుణుల హెచ్చరిక
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..